బాలయ్య- మందు బాటిల్,అంజలి ఇష్యూపై నాగవంశీ, విశ్వక్సేన్ ఏమంటారంటే...
‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు గెస్ట్గా వెళ్లిన బాలయ్య ప్రవర్తనపై వివాదం నడుస్తోంది.

Balakrishna
విశ్వక్ సేన్ తాజా సినిమా 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ప్రీ రిలీజ్ వేడుకకు బాలకృష్ణ గెస్ట్ గా వచ్చిన విషయం అందరికీ తెలుసు. కాగా, ఈ వేడుకలో బాలకృష్ణ కాళ్ల దగ్గర మందు బాటిల్ ఉన్నట్లుగా ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీంతో ఈ వీడియోపై పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. అలాగే బాలయ్య స్టేజి మీద అంజలిని పక్కకు తోయడంపై నెటిజనులు భగ్గుమన్నారు. అగ్ర హీరో ఆ విధంగా చేయడం తగదని పోస్టులు పెడుతున్నారు. దీనిపై విశ్వక్ సేన్, 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' నిర్మాతలలో ఒకరైన సూర్యదేవర నాగవంశీ స్పందించారు.
‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు గెస్ట్గా వెళ్లిన బాలయ్య ప్రవర్తనపై వివాదం నడుస్తోంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో బాలకృష్ణ మందు కొట్టి రావడమే కాదు.. అతని కూడా వాటర్ బాటిల్ మందు కొట్టి తెచ్చుకుని అందరి ముందు తాగాడంటూ.. దానికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతోంది.
ఆ వీడియోలో బాలకృష్ణ కూర్చుని ఉండగా.. అతను కుర్చీకి కిందే.. ఒక వాటర్ బాటిల్తో పాటు.. చిన్న వాటర్ బాటిల్లో మద్యం కూడా ఉన్న వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియో వైరల్ చేస్తున్నాయి వైసీపీ వర్గాలు.. ‘మహిళల పట్ల టీడీపీ నేత బాలకృష్ణ మరోసారి అసభ్య ప్రవర్తన.. ప్రీ రిలీజ్ ఈవెంట్లో మద్యం తాగి మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన వైనం.. మహిళలంటే మీకు అంత చులకనా’ అంటూ హెడ్డింగ్ లు పెట్టి దుమ్ము రేపుతున్నారు.
తాజాగా ఈ వీడియోపై నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. ఆ ఈవెంట్ ను నిర్వహించింది తామేనని.. అక్కడ ఏముందో తమకు తెలుసని ఆయన అన్నారు. అయితే, ఎవరో కావాలనే బాలయ్య కాళ్ల దగ్గర మందు బాటిల్ ఉన్నట్లుగా సీజీ వర్క్ చేశారని ఆయన చెప్పుకొచ్చారు.
విశ్వక్సేన్ మాట్లాడుతూ.. అసలు అక్కడ మందు బాటిలే లేదు.. బాలయ్య మందే కొట్టలేదు.. అదంతా గ్రాఫిక్స్’ అని కొట్టిపారేశారు. బాలయ్య బాబు ప్రీ రిలీజ్ ఈవెంట్లో మందు తాగున్నట్టుగా.. వాటర్ బాటిల్లో మందు కలిపి ఉన్న బాటిల్స్ని ఆయన కూర్చున్న దగ్గర పెట్టారు. అదంతా ఫేక్. గ్రాఫిక్స్ చేశారు. సీజీ గ్రాఫిక్స్ చేసినోళ్లని పట్టుకున్నాం’ అని అన్నారు హీరో విశ్వక్ సేన్.
ఇక అంజలిని స్టేజిపై ప్రక్కకు తోసేసారనే విషయమై విశ్వక్సేన్ మాట్లాడుతూ...‘బాలయ్య గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ అంజలిని తోయడం గురించే మాట్లాడుతున్నారు. ఆయన అలా ఎందుకు తోశారనేది.. ముందు వెనుకు ఉన్న కంటిన్యూ వీడియోలు చూస్తే తెలుస్తుంది అన్నారు.
Balakrishna
నాగవంశీ అంజలిని స్టేజ్పై తోయడంపై స్పందిస్తూ.. . ‘‘ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నప్పుడు.. జరగరా అన్నప్పుడు.. పక్కకి జరక్కపోతే వాళ్ల మధ్య ఉన్న రిలేషన్తో పక్కకి జరుగు అని తోస్తారు. అది చాలా క్యాజువల్. దాన్ని వివాదం చేయాలని ప్లాన్ చేశారు. అలాంటి వాటికి ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు? ముగ్గురు ఫ్రెండ్స్ పక్క పక్కన ఉన్నప్పుడు ఇవన్నీ చాలా క్యాజువల్. ’ అన్నారు నిర్మాత నాగవంశీ.
ఇక “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” చిత్రంలో నేహా శెట్టి, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండగా, కృష్ణ చైతన్య ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు.