- Home
- Entertainment
- Vijay Rashmika: చిన్నారికి ఊహించని ట్రీట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా.. విరోష్తో కలిసి ఏం చేసిందంటే
Vijay Rashmika: చిన్నారికి ఊహించని ట్రీట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా.. విరోష్తో కలిసి ఏం చేసిందంటే
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాలు తమకి స్వీట్లు ఇవ్వలేదని, విందుకు పిలవలేదని ఓ చిన్నారి వీడియో పోస్ట్ చేసిన నేపథ్యంలో ఆ చిన్నారి కుటుంబాన్ని ఇంటికి పిలిచి సర్ప్రైజ్ చేసింది విరోష్ ఫ్యామిలీ.

విజయ్ దేవరకొండ, రష్మికలకు చిన్నారి రిక్వెస్ట్
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ఇటీవలే పెళ్లి చేసుకున్నారు. ఫిబ్రవరి 26న మ్యారేజ్ చేసుకోగా, ఆ తర్వాత సినిమా సెలబ్రిటీలకు, అభిమానులకు, మీడియాకి ప్రత్యేకంగా విందు ఇచ్చారు. అంతేకాదు స్వీట్లు పంచారు. దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో స్వీట్లు, కొన్ని టెంపుల్స్ వద్ద అన్నదానం చేశారు. దీంతో వీరి పెళ్లి దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. చాలా మందిని పిలిచి విందు ఏర్పాటు చేయగా, తమని పిలవలేదని ఓ చిన్నారి సోషల్ మీడియాలో వీడియో పెట్టింది.
చిన్నారికి రియాక్ట్ అయిన విజయ్, రష్మిక జంట
`లక్కీ తల్లి` అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి ఒక చిన్నారి విజయ్ దేవరకొండ మామ, రష్మిక అక్క మీరు అందరిని పిలిచిన స్వీట్లు, అన్నదానం చేశారు. మరి మమ్మల్ని పిలవరా, మేము కూడా మీ అభిమానులమే కదా, మమ్మల్ని పిలవొచ్చు కదా అంటూ సోషల్ మీడియాలో వీడియో పెట్టింది. ఇది వైరల్గా మారింది. అది కాస్త, విజయ్, రష్మికలకు చేరింది. దీంతో ఈ ఇద్దరు ఆ చిన్నారికి స్పందించారు. `బుజ్జి తల్లి, నిన్ను ఇంటికి లంచ్కి పిలుస్తాం, నీకు ఇష్టమైన ఫుడ్, స్వీట్స్ చెప్పు, అన్నీ కలిసి తిందాం` అని రిప్లై ఇచ్చారు.
చిన్నారి ఫ్యామిలీకి విరోష్ జంట ట్రీట్
చెప్పడమే కాదు ఏకంగా ఆ చిన్నారి ఫ్యామిలీని విజయ్ దేవరకొండ ఇంటికి పిలిపించారు. ఆ చిన్నారి ఫ్యామిలీకి విజయ్, రష్మిక భోజనం ఏర్పాటు చేశారు. అంతా కలిసి భోజనం చేశారు. వారికి స్వీట్లు తినిపించారు. అలాగే పులిహోర పెట్టారు. అంతేకాదు వారికి నచ్చిన, ఇష్టమైన ఫుడ్ని వడ్డించారు. వీటితోపాటు గిఫ్ట్ లతో సర్ప్రైజ్ చేశారు. తాజాగా ఆ విషయాన్ని లక్కీ తల్లి చిన్నారి తన సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
విజయ్, రష్మికలకు థ్యాంక్స్ చెప్పిన చిన్నారి
ఇందులో లక్కీ తల్లి చిన్నారి పేరెంట్స్ చెబుతూ, విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా, వారి కుటుంబాన్ని కలవడం ఆనందంగా ఉందని, వారి చిరునవ్వు, స్నేహ పూర్వక స్వభావం ఈ టూర్కి సంతోషాన్ని చేకూర్చిందని తెలిపారు. వారితోపాటు వారి కుటుంబంతో గడిపిన సమయం ఈ అనుభవాన్ని ప్రత్యేకంగా, సొంత ఇంటి వాతావరణంలా అనిపించేలా చేసిందని చెప్పారు. వారంతా ఎంతో ప్రేమతో, దయతో, నిరాడంబరంగా ఉన్నారని, దీంతో మేమూ వాళ్ల మధ్య ఉన్నామనే భావన కలిగిందన్నారు. ఎన్నో అందమైన సంభాషణలు, నవ్వులు, ఎప్పటికీ గుర్తిండిపోయే ఆనంద క్షణాలను పంచుకున్నాం. అక్కడి వాతావరణం హృదయాన్ని హత్తుకునే అనుభూతినిచ్చింది. వారు ప్రతిభావంతులే కాదు, వినయవంతులు. ఈ రోజుని ఎప్పటికీ మర్చిపోలేము అని వెల్లడించారు. ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.
రణబాలిలో కలిసి నటిస్తోన్న విరోష్ జంట
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా కలిసి ఇప్పుడు `రణబాలి` చిత్రంలో నటిస్తున్నారు. రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. దీంతోపాటు రష్మిక మందన్నా `మైసా`అనే మరో సినిమాలో నటిస్తోంది. అలాగే విజయ్ దేవరకొండ `రౌడీ జనార్థన్` మూవీలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

