- Home
- Entertainment
- ప్రభాస్, సమంత, విజయ్ దేవరకొండపై వేణు స్వామి దారుణమైన కామెంట్స్..ఫ్యామిలీ, ఫ్యాన్స్ వింటే గుండె బద్దలు ?
ప్రభాస్, సమంత, విజయ్ దేవరకొండపై వేణు స్వామి దారుణమైన కామెంట్స్..ఫ్యామిలీ, ఫ్యాన్స్ వింటే గుండె బద్దలు ?
Venu Swamy: వేణు స్వామి ఎంతటి వివాదాస్పద జ్యోతిష్యుడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన వివాదాస్పద కామెంట్స్ తో వేణు స్వామి పలుమార్లు విమర్శలు ఎదుర్కొన్నారు. వేణు స్వామి సెలెబ్రిటీల జాతకాల పేరుతో గతంలో వేణు స్వామి వారి పర్సనల్ లైఫ్ గురించి కూడా వ్యాఖ్యలు చేశారు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Prabhas, Samantha, Vijay Deverakonda
వేణు స్వామి ఎంతటి వివాదాస్పద జ్యోతిష్యుడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన వివాదాస్పద కామెంట్స్ తో వేణు స్వామి పలుమార్లు విమర్శలు ఎదుర్కొన్నారు. వేణు స్వామి సెలెబ్రిటీల జాతకాల పేరుతో గతంలో వేణు స్వామి వారి పర్సనల్ లైఫ్ గురించి కూడా వ్యాఖ్యలు చేశారు. నాగ చైతన్య, శోభిత గురించి వేణు స్వామి దారుణంగా కామెంట్స్ చేయడంతో అతడిపై ఫిలిం జర్నలిస్టులు కంప్లైంట్ కూడా ఇచ్చారు.
రాజకీయాల గురించి వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు గత సార్వత్రిక ఎన్నికల్లో నిజం కాలేదు. తాను చెప్పిన జ్యోతిష్యం తప్పింది అని వేణు స్వామి క్షమాపణ కూడా చెప్పారు. తాజాగా వేణు స్వామి సంచలన ఆడియో ఒకటి లీక్ అయింది. గతంలో వేణు స్వామి టాలీవుడ్ లో కొందరు సెలెబ్రిటీలు ఆత్మహత్య చేసుకుంటారు అని చెప్పేవారు. లీక్ అయిన వీడియోలో సూసైడ్ చేసుకోబోయే సెలెబ్రిటీల పేర్లని కూడా వేణు స్వామి చెప్పేశారు.
ఒక జర్నలిస్ట్ తో ఆఫ్ ది రికార్డ్ లో వేణు స్వామి మాట్లాడుతున్న ఆడియో లీక్ అయింది. ప్రస్తుతం టాలీవుడ్ లో జరుగుతున్న బెట్టింగ్ యాప్స్ వివాదం కారణంగా ఈ ఆడియో లీక్ అయింది. ప్రభాస్, సమంత, విజయ్ దేవరకొండ గురించి వేణు స్వామి దారుణమైన వ్యాఖ్యలు చేశారు. వేణు స్వామి చేసిన కామెంట్స్ విషయానికి వస్తే..' నేను ముగ్గురు చనిపోతారని చెప్పాను. ఒక హీరో, ఒక హీరోయిన్ చనిపోతారు. ప్రభాస్, విజయ్ దేవరకొండ ఇద్దరూ చనిపోతారని చెప్పా. సమంత సూసైడ్ చేసుకుంటుందా అని జర్నలిస్ట్ అడగగా.. ఎవరైనా ఒకరు చేసుకుంటారు అని అని చెప్పారు. నా లెక్క ప్రకారం విజయ్ దేవరకొండ చేసుకుంటాడు. బయటకి రావడానికి టైం పడుతుంది.
ఒక హీరోకి సీరియస్ ఇంజ్యురి ఉందని చెప్పారు. నిజంగా అంత ప్రాబ్లెమ్ ఉందా అని అడగగా.. చాలా సమస్యలు ఉన్నాయి. అతడికి మొత్తం సమస్యలే. ప్రభాస్ గారికా అని అడగగా.. అన్నీ అయిన తర్వాత మాట్లాడదాం అని వేణు స్వామి అన్నారు. ఈ ఆడియో లీక్ అయి ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒక టివి ఛానల్ లో ఈ ఆడియో లీక్ చేశారు. దీనిపై ప్రముఖ జర్నలిస్ట్ ప్రభు స్పందించారు. ఎలాంటి విషయాలని వాళ్ళ కుటుంబ సభ్యులు వింటే పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు.
ఇలాంటి వ్యాఖ్యలకు హీరోలు స్పందించాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు, ఫ్యాన్స్ వింటే మాత్రం బాధపడతారు అని ప్రభు తెలిపారు. వేణు స్వామి దగ్గర కొందరు సెలెబ్రిటీలు పూజలు చేయించుకుంటున్న విషయం కూడా ప్రస్తావనకు వచ్చాయి.