వేణుమాధవ్ యూ టర్న్ రోల్స్.. నల్లబాలు నల్ల తాచు లెక్క
కమెడియన్ గా టాలీవుడ్ లో సరికొత్త యాంగిల్ లో గుర్తింపు తెచ్చుకున్న వేణు మాధవ్ మరణించడం అభిమానులను కలచివేసింది. గత కొంత కాలంగా కాలేయ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వేణుమాధవ్ బుధవారం తుది శ్వాసను విడిచారు.
కెరీర్ లో 600కు పైగా సినిమాల్లో నటించిన అతికొద్ది మంది నటుల్లో వేణుమాధవ్ ఒకరు
ఆయన చివరి చిత్రం రుద్రమదేవి సినిమా అనంతరం నటనకు దూరంగా ఉన్నారు
హంగామా చిత్రంతో హీరోగా తెరగ్రేటం చేశారు.
మొదటి సినిమా సంప్రదాయం (1996) తరువాత పలువురి సినీ ఇండస్ట్రీ ప్రముఖులను ఆకర్షించిన వేణు మాధవ్ తొలిప్రేమ సినిమాతో బాగా పాపులర్ అయ్యారు.
పవన్ కళ్యాణ్ అలీ తో పాటు వేణు మాధవ్ ని కూడా చాలా సార్లు తన సినిమాల్లో నటించేలా చూసుకునేవారు.
ముఖ్యంగా అన్నవరం సినిమాలో సతీష్ పాత్రలో కామెడీతో పాటు ఎమోషనల్ సీన్స్ లో అద్భుతంగా నటించాడు.
వివి. వినాయక్ ఆది - దిల్ సినిమాల్లో కామెడీ రోల్స్ ద్వారా వేణు మాధవ్ క్రేజ్ మరింత పెరిగింది.
ఇక లక్ష్మి సినిమాలో టైగర్ సత్తిగా ఆయన పండించిన కామెడీకి నంది సొంతమైంది. తెలంగాణ శకుంతలతో ఆయన కామెడీ టైమింగ్ అప్పట్లో ఒక ట్రెండ్ సెట్ చేసింది.
చిరంజీవితో కూడా చాలా సినిమాల్లో నటించి కామెడీ టైమింగ్ తో మెప్పించారు,. మెగాస్టార్ సపోర్ట్ తో రామ్ చరణ్ మొదటి సినిమా చిరుతలో కథానాయకుడి ఫ్రెండ్ గా కనిపించాడు. రామ్ చరణ్ రచ్చ సినిమాలో కూడా వేణు మాధవ్ మంచి పాత్ర పోషించాడు.
కిక్ సినిమాలో కూడా వేణు మాధవ్ చేసిన ఆజామూ రోల్ ఎవర్ గ్రీన్ కామెడీ హిట్స్ లో ఒకటి.
మాస్ సినిమాలో క్యాన్సర్ పేషేంట్ గా గుండాలను మోసం చేస్తూ కనిపించే పాత్ర సినిమాలో హైలెట్ గా నిలిచింది.
రాజమౌళి సై సినిమాలో నల్లబాలు నల్ల తాచు లెక్క అంటూ ఒక ట్రెండ్ చేసిన విషయం తెలిసిందే.
దర్శకుడు పూరి జగన్నాథ్ సినిమాల్లో కూడా వేణు మాధవ్ మ్యాక్జిమామ్ కనిపించేవారు. నేనింతే - దేశముదురు - పోకిరి సినిమాల్లో వేణు పాత్రలు హైలెట్ గా నిలిచాయి.
2002 నుంచి 2013 వరకు వేణుమాధవ్ తీరిక లేకుండా బిజీ బిజీ గా కనిపించేవారు.
2014అనంతరం ఆరోగ్య పరిస్థితి బాలేకపోవడంతో మెల్లగా వెండితెరకు దూరమయ్యారు.