ఉప్పెన బేబమ్మ తల్లి హాట్ ఫోటోలు చూశారా... ఆమె కూడా ఒకప్పుడు హీరోయినే!
ఉప్పెన చిత్రంలో విజయ సేతుపతి భార్య పాత్ర చేశారు గాయత్రీ జయరామ్. అనారోగ్యంతో మంచానికి పరిమితమైన కదలికలు లేని భార్య, తల్లి పాత్ర ఆమె చేశారు. డైలాగ్స్ కూడా లేని ఆ పాత్రను ఆమె కళ్ళతోనే నటించి మెప్పించారు.
భర్త ఆదరణకు నోచుకోని భార్యగా, కూతురు ఇబ్బందులు తెలిసీ ఏమిచేయలేని తల్లిగా, విలన్ లైంగిక వేధింపులు భరించే ఇల్లాలిగా ఆమె తక్కువ నిడివి గల పాత్ర చేయడం జరిగింది.
గాయత్రీ జయరామ్ ఒకప్పటి హీరోయిన్ అన్న విషయం చాలా మందికి తెలియదు. ఆమె తెలుగులో కూడా హీరోయిన్ గా ఒకటి రెండు చిత్రాలు చేశారు.
చెన్నైకి చెందిన గాయత్రీ నాలుగేళ్ళ ప్రాయం నుండి అక్కడే పెరిగారు. చెన్నైలో చదువు పూర్తి అయిన అనంతరం హీరోయిన్ కావాలనే ప్రయత్నాలు మొదలుపెట్టారు.
దిగ్గజ దర్శకుడు కె బాలచందర్ తెరకెక్కించిన తమిళ సీరియల్ అజుక్కు వేస్తి ద్వారా ఆమె యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేశారు. అదే సమయంలో ఆమెకు హీరోయిన్ గా ఆఫర్స్ వచ్చినా వదులుకున్నారు.
2001లో విడుదలైన నీలా అనే కన్నడ చిత్రం ద్వారా ఆమె వెండితెరకు పరిచయం అయ్యారు. క్యాన్సర్ వ్యాధిబారిన పడిన ట్రైబల్ లేడీ సింగర్ కథాంశంతో ఆ మూవీ తెరకెక్కింది.
ఇక తెలుగులో శ్రీకాంత్, సునీల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ ఆడుతూ పడుతూ మూవీలో హీరోయిన్ గా నటించారు.
ఆడుతూ పడుతూ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. అయినా గాయత్రీ జయరామ్ కి అవకాశాలు రాలేదు. ఆ తరువాత ఆకాష్ హీరోగా విడుదలైన నాయుడు ఎల్ ఎల్ బి మూవీలో నటించారు.
కన్నడ, తమిళ, మలయాళ బాషలలో సినిమాలు చేసినా ఆమెకు బ్రేక్ రాలేదు. 2005నాటికి ఆమె కెరీర్ ఫేడ్ అవుట్ దశకు చేరుకుంది.
అవకాశాల కోసం ఎదురుచూసినా ప్రయోజనం లేకపోవడంతో 2007లో గాయత్రీ వివాహం చేసుకున్నారు . సమిత్ సాహ్ని అనే వ్యాపారవేత్తతో ఆమెకు వివాహం జరిగింది.
ఇక చాలా గ్యాప్ తరువాత గాయత్రీ ఉప్పెన మూవీతో తల్లిగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. హీరోయిన్ గా ఎదగలేకపోయిన గాయత్రీ సెకండ్ ఇన్నింగ్స్ లో అయినా నిలదొక్కుకోవాలని చూస్తున్నారు.
ఉప్పెనలో ఆమె చేసింది చిన్న పాత్రే అయినా అద్భుత నటనతో మెప్పించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆమె బిజీ అయ్యే అవకాశాలు లేకపోలేదు.