- Home
- Entertainment
- 2027లో బాక్సాఫీస్ను షేక్ చేయబోతున్న 8 బాలీవుడ్ సినిమాలు.. తెలుగు మూవీస్ని దెబ్బ కొట్టేది ఏంటంటే?
2027లో బాక్సాఫీస్ను షేక్ చేయబోతున్న 8 బాలీవుడ్ సినిమాలు.. తెలుగు మూవీస్ని దెబ్బ కొట్టేది ఏంటంటే?
Bollywood Movie: 2027 రాబోయే రోజుల్లో బాలీవుడ్లో చాలా పెద్ద సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. అయితే బాక్సాఫీస్ను షేక్ చేయడానికి సిద్ధమవుతున్న సినిమాలేంటో చూస్తే, వీటిలో యాక్షన్తో పాటు హారర్-కామెడీ, రొమాంటిక్ చిత్రాలు కూడా ఉన్నాయి.

2027లో బాక్సాఫీస్ బద్దలే!
2027లో సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ నుంచి అజయ్ దేవగన్, రణ్బీర్ కపూర్, రణ్వీర్ సింగ్ వరకు తమ సినిమాలతో బాక్సాఫీస్ను షేక్ చేయడానికి రెడీ అవుతున్నారు. తెలుగులో రాబోతున్న భారీ చిత్రాలకు కాంపిటీషన్ ఇవ్వబోతున్నాయి. ఆ సినిమాలేంటో చూద్దాం.
సల్మాన్ ఖాన్ సినిమా SVC63
సల్మాన్ ఖాన్ 2027లోనూ సందడి చేయనున్నారు. ఇటీవల ఆయన మన తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లితో సినిమా చేస్తున్నారు. ఈ యాక్షన్ సినిమాలో నయనతార హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా 2027లో విడుదల కానుంది. దీనికి దిల్ రాజు నిర్మాత కావడం విశేషం. ఇది ఈద్ కి రానుంది.
రణ్బీర్ కపూర్ సినిమా రామాయణ్ 2
రణ్బీర్ కపూర్.. డైరెక్టర్ నితీష్ తివారీ సినిమా 'రామాయణ్' రెండో భాగంలో కనిపించనున్నారు. ఈ సినిమా మొదటి భాగం 2026 దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి విడుదల కానుంది. మొదటి సినిమా విజయాన్ని బట్టి రెండో పార్ట్ రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. ఇది తెలుగు సినిమాలకు కాంపిటీషన్ ఇస్తుందా లేదా అనేది చూడాలి.
అజయ్ దేవగన్ 'గోల్మాల్ 5'
అజయ్ దేవగన్.. డైరెక్టర్ రోహిత్ శెట్టి సినిమా 'గోల్మాల్ 5'లో నటించనున్నారు. ఈ మల్టీస్టారర్ సినిమాలో అక్షయ్ కుమార్ విలన్గా కనిపించనున్నారు. ఈ సినిమా 2027లో విడుదల అవుతుంది. అయితే, రిలీజ్ డేట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. దీన్ని కూడా పెద్ద కాంపిటీషన్ అని భావించలేం.
విక్కీ కౌశల్ సినిమా లవ్ అండ్ వార్
డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తన 'లవ్ అండ్ వార్' సినిమాను మొదట ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు 2027 జనవరి 21న విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో విక్కీ కౌశల్, రణ్బీర్ కపూర్, ఆలియా భట్ నటిస్తున్నారు. దీనిపై భారీ అంచనాలున్నాయి.
జాన్ అబ్రహం సినిమా ఫోర్స్ 3
జాన్ అబ్రహం తన 'ఫోర్స్' ఫ్రాంచైజీలో మూడో సినిమా 'ఫోర్స్ 3'తో వస్తున్నారు. హర్షవర్ధన్ రాణే కూడా నటిస్తున్న ఈ సినిమా 2027 మార్చి 19న థియేటర్లలోకి రానుంది. ఇది `స్పిరిట్`కి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. కానీ పెద్ద పోటీ కాదని చెప్పొచ్చు.
రణ్వీర్ సింగ్ సినిమా ప్రళయ్
ధురంధర్ తో ఇండియన్ సినిమా బాక్సాఫీస్ని షేక్ చేసిన రణ్వీర్ సింగ్.. ఇప్పుడు డైరెక్టర్ జై మెహతా సినిమా 'ప్రళయ్'లో కనిపించనున్నారు. జాంబీ థీమ్తో వస్తున్న ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్. ఈ మూవీ 2027లో విడుదల కానుంది.
అక్షయ్ కుమార్ సినిమా భాగమ్ భాగ్ 2
రాజ్కుమార్ రావు సినిమా దాదా
రాజ్కుమార్ రావు.. క్రికెటర్ సౌరవ్ గంగూలీ బయోపిక్ 'దాదా'లో నటిస్తున్నారు. ఈ సినిమా గురించి ఎక్కువ సమాచారం అందుబాటులో లేదు. ఇది కూడా 2027లోనే రానుంది. ఇలా భారీ చిత్రాలే వచ్చే ఏడాదిని టార్గెట్ చేశాయి. అయితే ఈ సినిమాలు తెలుగులో రాబోతున్న `స్పిరిట్`, `రాకా,` `వారణాసి`, `డ్రాగన్`, `ఫౌజీ` చిత్రాలకు పెద్ద కాంపిటీషన్ ఇవ్వలేవని చెప్పొచ్చు.

