Pallavi Prashanth: రైతుబిడ్డ ఎన్ని లక్షలు సంపాదించాడో తెలుసా?
రైతుబిడ్డ ట్యాగ్ తో సామాన్యుడిగా హౌస్లో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ అయ్యాడు. ఇది ఊహించని పరిణామం. మరి పల్లవి ప్రశాంత్ ఈ షోతో ఎన్ని లక్షలు సంపాదించాడో చూద్దాం...
సంకల్పం ఉంటే కోరుకున్నది సాధించవచ్చని పల్లవి ప్రశాంత్ నిరూపించాడు. సోషల్ మీడియాలో సెలెబ్రిటీ కావాలని కోరుకున్న పల్లవి ప్రశాంత్ రీల్స్ చేయడం స్టార్ట్ చేశాడు. రైతుల జీవనవిధానం, పొలాల్లో పనులకు సంబంధించిన వీడియోలు పోస్ట్ చేస్తూ రైతుబిడ్డగా పాప్యులర్ అయ్యాడు.
![article_image2](https://static-ai.asianetnews.com/images/01hhkvjnvwc1e90bbw9esz7rfm/pallavi-prashanth-1-jpg_300x202xt.jpg)
Bigg Boss Telugu 7
పల్లవి ప్రశాంత్ కి బిగ్ బాస్ షో అంటే చాలా ఇష్టం. రెగ్యులర్ గా అన్ని సీజన్స్ ఫాలో అయ్యాడు. ఆడియన్ గా పలుమార్లు షో చూసేందుకు అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళాడు. ఎలాగైనా బిగ్ బాస్ హౌస్ కి వెళ్లాలని ప్రయత్నాలు చేశాడు. ఆఫీసుల చుట్టూ తిరిగాడు. ఎలాంటి గుర్తింపు లేకుండా హౌస్లో అడుగుపెట్టడం సులభం కాదని, సోషల్ మీడియాలో పాపులర్ కావాలనున్నాడు. కోరుకున్నట్లే కొంత కాలానికి పల్లవి ప్రశాంత్ వీడియోలు వైరల్ అయ్యాయి.
ఎట్టకేలకు బిగ్ బాస్ సీజన్ 7లో కామనర్ గా అడుగుపెట్టాడు. మొదట్లో పల్లవి ప్రశాంత్ తడబడ్డాడు. కొత్త వాతావరణం, కొత్త మనుషులు మధ్య ఎలా నడుచుకోవాలో అర్థం కాలేదు. మెల్లగా సర్దుకున్న పల్లవి ప్రశాంత్ తన గేమ్ స్టార్ట్ చేశాడు. టాస్క్ లలో విజృంభిస్తూ మంచి ప్రవర్తనతో అభిమానులను సంపాదించుకున్నాడు. చివరికి టైటిల్ విన్నర్ అయ్యాడు.
కేవలం బిగ్ బాస్ షోకి వెళితే చాలు అనుకున్న పల్లవి ప్రశాంత్... ఏకంగా టైటిల్ కొట్టాడు. టాప్ సెలబ్రీటీస్ ని వెనక్కి నెట్టి టైటిల్ అందుకున్నాడు. మరి విజేతగా పల్లవి ప్రశాంత్ ఎన్ని లక్షలు సంపాదించాడు అంటే... ప్రైజ్ మనీ రూ. 50 లక్షలు. అయితే యావర్ రూ. 15 లక్షలు తీసుకుని టైటిల్ రేసునుండి తప్పుకున్నాడు. కాబట్టి రూ. 35 లక్షలు ప్రైజ్ మనీగా దక్కుతాయి.
అలాగే రూ. 15 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్ బహుమతిగా ఇచ్చారు. మారుతీ సుజుకీ బ్రీజా కారు కూడా లభించింది. దీని విలువ రూ. 10- 15 లక్షలు ఉంటుంది. ఇక పల్లవి ప్రశాంత్ రెమ్యూనరేషన్ వారానికి రూ. 1 లక్ష అని సమాచారం. ఆ విధంగా మరో రూ. 15 లక్షలు ఆర్జించాడు. మొత్తంగా పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ షోతో రూ. 70 నుండి 75 లక్షలు సంపాదించాడు.
అయితే రెమ్యూనరేషన్ రూ. 15 లక్షలు మినహాయిస్తే... ప్రైజ్ మనీ, బహుమతులు మీద భారీగా టాక్స్ కోత ఉంటుంది. ప్రైజ్ మనీ కటింగ్స్ పోను రూ. 16 లక్షలు వస్తుందని సమాచారం. కారు, డైమండ్ నెక్లెస్ మీద కూడా టాక్స్ చెల్లించాలి. కాబట్టి పల్లవి ప్రశాంత్ కి పెద్దగా మిగిలిది లేదు. ఇక ఎంత వచ్చినా అది రైతులకే అని ఇప్పటికే పల్లవి ప్రశాంత్ ప్రకటించాడు...