Guppedantha Manasu Serial Today:ఏమైపోయారు రిషి సర్.. రోడ్లపై పిచ్చిదానిలా వెతుకుతున్న వసుధార..!
మహేంద్ర తన కొడుకు విషయంలో ఏం చేయాలో తనకు తెలుసని, 24గంటలు గడిచిన తర్వాత కంప్లైంట్ ఇద్దాం అని, ఏమంటావ్ వసుధార అని అడుగుతాడు. దానికి వసు, మీ ఇష్టం మామయ్య అంటుంది. వసుధార మాత్రం చాలా కంగారుపడుతూ ఉంటుంది.
Guppedantha Manasu
Guppedantha Manasu Serial Today: మహేంద్ర ఇంటికి అనుపమ వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఆ సమయంలో కనీసం కాఫీ కూడా తాగకుండా వసు కంగారుపడుతూ ఉంటుంది. రిషి ఆచూకీ కోసం అందరికీ ఫోన్లు చేస్తూ ఉంటుంది. దీంతో, రిషికి ఏమైందని అనుపమ అడుగుతుంది. ఉదయం నుంచి కనపడటం లేదు అని చెప్పే సరికి ఆమెలోనూ అనుమానాలు మొదలౌతాయి. ఈరోజు ఎపిసోడ్ లోకి వెళితే.. మహేంద్ర, అనుపమ మీద సీరియస్ అవుతాడు. తాను కూడా రిషి కోసం కంగారు పడుతూ ఉన్నానని, ఓ తండ్రిగా భయపడుతున్నానని మహేంద్ర అంటాడు. అయితే, అనుపమ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వమని సలహా ఇస్తుంది. దానికి కూడా మహేంద్ర సీరియస్ అవుతాడు. కనపడకుండా పోయి ఒక్కరోజు కూడా కాలేదు కదా, ఏమని కంప్లైంట్ ఇస్తాం..? రాత్రికి రిషి తిరిగి వస్తే, అనవసరంగా కంప్లైంట్ ఇచ్చినవాళ్లం అవుతాం కదా, తనకు ఏదైనా అయ్యిందేమో అని మనం కంగారు పడుతున్నాం. కానీ , ఇంట్లో ఏదైనా గొడవ జరిగినప్పుడు ఒక్కోసారి రెండు, మూడు రోజులు కూడా ఇంటికి రాకుండా ఉండేవాడు రిషి. ఇప్పుడు కూడా అలానే చేసి ఉండొచ్చు అనిపిస్తోందని మహేంద్ర అంటాడు.
![article_image2](https://static-ai.asianetnews.com/images/01hh11w2rey8nv93j8a2nmzfax/7gup2-jpg_300x265xt.jpg)
Guppedantha Manasu
దానికి అనుపమ,‘ అంతకముందు అలా జరిగి ఉండొచ్చు. అది కూడా జగతి లేని సమయంలో జరిగి ఉండొచ్చు. జగతి ఉంటే రిషిని అలా వెళ్లనిచ్చేది కాదు. వెళ్లినా అంత ఈజీగా వదిలేసేది కాదు. బయటకు వెళ్లినవాడు ఇంటికి ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూడటం వేరే, ఎప్పుడు వస్తాడా అని కంగారు పడటం వేరే. ఒవేళ జగతి ఉండి ఉంటే , ఓ తల్లి తన బిడ్డ కోసం ఎంత పరితపిస్తుందో నీకు తేలిసేది. అప్పుడంటే ఒక్కడే ఉండేవాడు. ఇప్పుడు తనకు పెళ్లి అయ్యింది, భార్య కూడా ఉంది. భర్త ఆఫీసుకువెళ్లి సాయంత్రం ఎప్పడు ఇంటికి వస్తాడా అని గుమ్మం దగ్గర ఎదురుచూస్తూ ఉంటుంది. వసుధారను చూడు ఎంత టెన్షన్ పడుతుందో, కంప్లైంట్ చేద్దాం’ అని అనుపమ అంటుంది.
Guppedantha Manasu
అయితే, మహేంద్ర తన కొడుకు విషయంలో ఏం చేయాలో తనకు తెలుసని, 24గంటలు గడిచిన తర్వాత కంప్లైంట్ ఇద్దాం అని, ఏమంటావ్ వసుధార అని అడుగుతాడు. దానికి వసు, మీ ఇష్టం మామయ్య అంటుంది. వసుధార మాత్రం చాలా కంగారుపడుతూ ఉంటుంది. దానికి అనుపమ, ‘నిన్ను ఇలా ఎప్పుడూ చూడలేదు. చాలా పాజిటివ్ గా ఉండేదానికి. కానీ ఇప్పుడు బిక్కముఖం వేసుకున్నావ్. నేను కూడా రిషి గురించి కనుకుంటాను’ అని సపోర్ట్ చేస్తుంది. తర్వాత, లోపలికి వెళ్లి పడుకోమని వసుకి మహేంద్ర చెబుతాడు.
Guppedantha Manasu
వసు గదిలోకి వెళ్లిన తర్వాత కూడా రిషి గురించే ఆలోచిస్తూ ఉంటుంది. తనకు చెప్పకుండా ఎక్కడికీ వెళ్లరని, ఇప్పుడు మాత్రం ఏ పనిమీద వెళ్లారని, ఒకవేళ శైలేంద్రను చూడటానికి హాస్పిటల్ కి వెళ్లారా అని అనుకుంటుంది. వెంటనే ధరణి కి ఫోన్ చేసి.. రిషి సర్ హాస్పిటల్ కి వచ్చారా అని అడిగితే, రిషి రాలేదని చెబుతుంది. రిషి అసలు ఎక్కడికి వెళ్లాడని అని ధరణి అడగగా, తెలీదని, ఉదయం నుంచి కనపడటం లేదని చెబుతుంది. ఆ మాటతో వసుధార ఇంకా భయపడుతుంది. మరోవైపు అనుపమ.. రిషి కోసం తనకు తెలిసిన వాళ్లను అడుగుతూ ఉుంటుంది.
Guppedantha Manasu
రిషి కనిపించకుండా పోవడానికి, శైలేంద్రపై ఎటాక్ కి ఏమైనా సంబంధం ఉందా అని అనుపమ అడుగుతుంది. దానికి మహేంద్రకు చిర్రెత్తుకువస్తుంది. ఏ విషయం అయినా, కొంచెం ముందూ, వెనక ఆలోచించి మాట్లాడమని, చిత్ర కేసు విషయంలోనూ ప్రెస్ ముందు అందరి ముందు ఏదోదో మాట్లాడావ్ అని మహేంద్ర అంటాడు. దానికి అనుపమ.. అందుకేనే హాస్పిటల్ కి కూడా రావద్దు అన్నావ్, ముకుల్ తో కూడా తనకు ఏమీ చెప్పొద్దు అన్నావ్ అని అనుపమ బాధపడుతుంది. తర్వాత రిషి ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాల్సిన బాధ్యత నీదేనని, రిషి ఈ రోజు రాత్రి రాకపోతే, ఉదయాన్నే కంప్లైంట్ చేయమని చెప్పి, అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
Guppedantha Manasu
మరోవైపు హాస్పిటల్ లో శైలేంద్ర ఒంటరిగా కూర్చొని ఉంటాడు. అది దేవయాణి చూస్తుంది. ‘ ఈయనేంటి తెగ ఆలోచిస్తున్నాడు. కొడుకుని ఇలాంటి పరిస్థితిలో చూసి బాధపడుతున్నారా లేక, జగతి కేసులో శైలేంద్ర వాయిస్ విని భయపడుతున్నారా?’అనుకుంటూ భర్త దగ్గరకు వెళ్లుంది. ఏమైందండి.. ఏం ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది. దానిక ఫణీంద్ర ‘ ఏం జరుగుతోందో అర్థం కావడం లేదు దేవయాణి. ఎలా ఉండాల్సిన కుటుంబం ఎలా తయారౌతోంది. కొంతకాలం రిషి ఎక్కడికో వెళ్లిపోయాడు. తర్వాత ఇంటికి వచ్చాడు. అందరం సంతోషించే సమయానికి జగతిని ఎవరో చంపేశారు. మరోవైపు జగతి హత్య కేసులో శైలేంద్ర వాయిస్ వినపడింది’ అంటాడు. ‘అంటే, మన అబ్బాయిని మీరు అనుమానిస్తున్నారా’ అని దేవయాణి అడుగుతుంది. ‘ కళ్ల ముందు ఇలా సాక్ష్యం కనపడుతుంటే ఎవరు ఏం చేస్తారు? చట్టానికి నిజంతో సంబంధం లేదు, సాక్ష్యం ఉంటే చాలు. వాడిపై ఇలా నిందపడుతుండగానే, ఇలా హాస్పిటల్ పాలయ్యాడు.’ అంటాడు. అప్పుడే ధరణి వచ్చి.. వసుధార ఫోన్ చేసిందని, రిషి ఇప్పటి వరకు ఇంటికి రాలేదని, తను కంగారుపడుతోందని చెబుతుంది. ఆ మాటకు ఫణీంద్ర కూడా కంగారుపడి, మహేంద్రకు ఫోన్ చేస్తాడు.
వెంటనే రిషి ఇంకా ఎందుకు ఇంటికి రాలేదు? అసలు ఎక్కడికి వెళ్లాడు అని అడుగుతాడు. తనకు కూడా తెలియదని, కనుక్కుంటాను అని మహేంద్ర చెబుతాడు. ఫోన్ పెట్టేసిన తర్వాత, రిషి ఇక్కడికి రాకుండా, ఎక్కడికి వెళ్లినట్లు? అసలు ఈ మధ్య అన్నీ విచిత్రమైన పనులన్నీ జరుగుతున్నాయని, తన ఆవేదననను దేవయాణితో పంచుకుంటాడు.
Guppedantha Manasu
తెల్లారుతుంది. మహేంద్ర వసుధారను.. రిషి వచ్చాడా అని అడుగుతూ ఉంటాడు. అయితే, వసుధార కూడా కనపడదు. ఇల్లంతా వెతుకుతాడు. ఇంకా నిద్రలేవలేదేమో అనుకొని గదిలోకి వెళతాడు. కానీ, గదిలో కూడా వసుు ఉండదు. సరిగ్గా అదే సమాయానికి అనుపమ ఎంట్రీ ఇస్తుంది. రావడం రావడమే, ఎందుకు కంగారుపడుతున్నావ్ అంటే, వసుధార కనపడటం లేదు అని చెబుతాడు. రిషి ఇంటికి రాలేదని, ఇప్పుడు వసు కూడా కనిపించడం లేదని మహేంద్ర కంగారుపడతాడు. తర్వాత వసుధారకు మహేంద్ర ఫోన్ ప్రయత్నిస్తాడు. వసు స్కూటీ మీద ఎక్కడికో వెళ్తూ ఉంటుంది. కాబట్టి, ఫోన్ లిఫ్ట్ చేయదు. తర్వాత బండి పక్కకు ఆపి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఎక్కడికి వెళ్లావ్ అంటే, బయటకు వచ్చాను అంటుంది. నువ్వు కనపడకపోయేసరికి నా గుండె ఆగినంత పని అయ్యిందని అంటాడు.
Guppedantha Manasu
అయితే, రిషి కోసం వెతకడానికి రాత్రే బయటకు వచ్చేశాను అని చెబుతుంది. అయితే, రాత్రి నుంచి ఎంత వెతికినా రిషి మాత్రం కనపడటం లేదని, చాలా భయంగా ఉందని వసు అంటుంది. తర్వాత, ఇంటికి రమ్మని అడుగుతాడు. కానీ వసు, ఇంకొన్ని ప్లేసుల్లో వెతికిన తర్వాత వస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. అనుపమ మాత్రం పోలీసులకు కంప్లైంట్ చేయమని మహేంద్రను ఫోర్స్ చేస్తుంది.దీంతో, మహేంద్ర వెంటనే ముకుల్ కి ఫోన్ చేస్తాడు. శైలేంద్ర కండిషన్ ఎలా ఉందని ముకుల్ అంటే.. బాగానే ఉంది అంటాడు. ఆ తర్వాత రిషి నిన్నటి నుంచి ఇంటికి రాలేదని, వసుధార రాత్రి నుంచి వెతుకుతోందని, కానీ, ఎక్కడికి వెళ్లాడో తెలియలేదని చెబుతాడు. తనకు కంగారు ఉందంటే, ముకుల్ అక్కడికి వస్తాను అని చెబుతాడు.
మరోవైపు వసు తనకు తెలిసిన అన్ని ప్రదేశాల్లో వెతుకుతుంది అయినా కనపడడు. దీంతో, కొంత మంది కాలేజీ లెక్చరర్స్ కి ఫోన్ చేసి అడుగుతుంది. వాళ్లు కూడా తమకు తెలీదంటారు. దీంతో, ఏం చేయాలో తెలిక వసు ఆలోచనలో పడుతుంది. ఇక్కడితో ఎపిసోడ్ ముగిసింది. మరి, రిషి గురించి తెలియాలంటే, రేపటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.