Guppedantha Manasu Serial 4th January Episode:ముకుల్ ఎంట్రీతో వసుధార సేఫ్.. జస్ట్ తప్పించుకున్న శైలేంద్ర
ఇదంతా శైలేంద్ర కుట్రేనని.. ఇప్పుడు వచ్చి, కాలేజీ తనకు అప్పగించినట్లు అగ్రిమెంట్ పేపర్ల మీద సంతకం పెట్టమని అడిగితే ఏం చేయాలి అని అనుకుంటూ ఉంటుంది.
Guppedantha Manasu
Guppedantha Manasu Serial 4th January Episode:వసుధారను రౌడీలు కిడ్నాప్ చేసేస్తారు. ఓ ఇంట్లో బంధీగా కట్టిపడేస్తారు. అదంతా వీడియో కాల్ చేసి శైలేంద్రకు కూడా చూపిస్తారు. శైలేంద్ర చూడటానికి కూడా వస్తున్నాడు. ఈ లోగా.. రిషి ఎవరికి ఫోన్ చేస్తే వసుని కాపాడొచ్చా అని ఆలోచిస్తూ ఉంటాడు.
![article_image2](https://static-ai.asianetnews.com/images/01hk957e8rtaex23qw6wyhcry6/4th-jan-gup1-jpg_300x219xt.jpg)
Guppedantha Manasu
మీ నాన్నగారికి చేయమని పెద్దాయన సలహా ఇస్తాడు. డాడ్ కి చెబితే కంగారుపడి, ఆయన కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉందని రిషి బయపడతాడు. అందుకే వెంటనే ఆలోచించి ముకుల్ కి ఫోన్ చేస్తాడు. వసుధార ఫోన్ నెంబర్ నుంచి ఫోన్ రావడంతో.. వసు అనుకొని ముకుల్ మాట్లాడుతూ ఉంటాడు. కానీ.. అటు నుంచి రిషి మాట్లాడటంతో ముకుల్ కూడా షాకౌతాడు. ముకుల్ కి కూడా డౌట్లు వస్తాయి. దీంతో.. రిషి జరిగిందంతా ముకుల్ కి చెబుతాడు.
Guppedantha Manasu
వసుధారను ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మీరు మాత్రమే కాపాడగలరు అని రిషి అడుగుతాడు. వసుధార చేసిన పనికి ముకుల్ కి కోపం వచ్చినా కూడా.. తాను వసుధారను కాపాడతాను అని, భయపడవద్దని హామీ ఇస్తాడు. దీంతో.. రిషి కాస్త ఊపిరి పీల్చుకుంటాడు.
Guppedantha Manasu
మరోవైపు మత్తుమందు ఇచ్చి వసుధారను కిడ్నాప్ చేయడంతో.. చాలా సేపటికి వసుకి మెళకువ వస్తుంది. మరోవైపు వసుధారను చూడటానికి శైలేంద్ర వస్తూ ఉంటాడు. వసు ఏమో... ఈ రౌడీల నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇదంతా శైలేంద్ర కుట్రేనని.. ఇప్పుడు వచ్చి, కాలేజీ తనకు అప్పగించినట్లు అగ్రిమెంట్ పేపర్ల మీద సంతకం పెట్టమని అడిగితే ఏం చేయాలి అని అనుకుంటూ ఉంటుంది.
Guppedantha Manasu
ఈలోగా.. ముకుల్ ఎంట్రీ ఇస్తాడు. ముకుల్ ని చూసి వసు సంతోషిస్తుంది. రౌడీలు షాకౌతారు. ముకుల్ ని కొట్టడానికి ప్రయత్నిస్తారు. కానీ.. ముకుల్ రౌడీలు అందరినీ చితకబాదుతాడు. తన చేతిలో తుపాకీ బయటకు తీయడంతో.. రౌడీలంతా బయపడిపోతారు. కదిలితే కాల్చిపడేస్తా అని వార్నింగ్ ఇచ్చి.. వసుధార కుట్లు విప్పేస్తాడు. తనను కాపాడినందుకు వసు థ్యాంక్స్ చెబుతుంది. బయట పోలీసు కారు ఉందని.. రిషి సర్ దగ్గరకు వెళ్లిపోమ్మని వసుకి ముకుల్ చెబుతాడు.
ఈ రౌడీల సంగతి తాను చూసుకుంటానని, వీళ్లు ఎవరు చెబితే ఈ కిడ్నాప్ చేశారో తాను కనుక్కుంటానని.. వసుని అక్కడి నుంచి పంపించేస్తాడు. తర్వాత.. వసుధారను ఎవరు కిడ్నాప్ చేయమన్నారో చెప్పమని అడుగుతాడు. అయితే.. అతను ఎవరో తమకు తెలీదని, కేవలం తమకు ఓ టాస్క్ ఇచ్చాడని , తాము కిడ్నాప్ చేశామని, అతని పేరు, ఎలా ఉంటాడో తమకు తెలీదు అని చెబుతారు.
Guppedantha Manasu
సరిగ్గా అదే సమయానికి శైలేంద్ర ఆ రౌడీకి ఫోన్ చేస్తాడు. స్పీకర్ ఆన్ చేసి మాట్లాడతాడు. ఆ వాయిస్ ని ముకుల్ వినేస్తాడు. అది శైలేంద్ర వాయిస్ అని ముకుల్ గుర్తుపట్టేస్తాడు. కానీ.. ఈసారి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటాను అని ముకుల్ అంటాడు. అయితే.. శైలేంద్ర కారులో వెళ్తుండగా.. ధరణి ఫోన్ చేస్తుంది. కానీ.. శైలేంద్ర కట్ చేస్తాడు. ఏ అరాచకం చేస్తాడో అనే భయంతో శైలేంద్రను ఆపాలని ధరణి.. కంటిన్యూస్ గా ఫోన్ చేస్తూ ఉంటుంది. కానీ.. శైలేంద్ర కట్ చేస్తూనే ఉంటాడు. వెంటనే దేవయాణి వచ్చి.. శైలేంద్రకు ఫోన్ చేస్తున్నావా అని అడుగుతుంది. అవునని, కానీ ఎన్నిసార్లు చేసినా ఫోన్ కట్ చేస్తున్నాడని చెబుతుంది. దానికి దేవయాణి.. పని మీద వెళ్లినప్పుడు ఎందుకు పదే పదే ఫోన్ చేస్తున్నావ్ అని తిడుతుంది. దానికి ధరణి.. ఆయన తన భర్త అని.. ఏ పనిమీద వెళ్లారో తెలుసుకుందాం అని చేశాను అని ధరణి చెబుతుంది. కానీ, దేవయాణి తిడుతుంది. పనిమీద వెళ్లినప్పుడు వాడు ఫోన్ మాట్లాడడు అని నీకు తెలీదా అని అరిచి, వెళ్లి వంట పని చెయ్యమని చెబుతుంది.
Guppedantha Manasu
ఈలోగా ఫణీంద్ర ఎంట్రీ ఇస్తాడు. ధరణి మీద ఎందుకు అరుస్తున్నావ్ అని అడుగుతాడు. దేవయాణి సమాధానం చెప్పకుండా నసుగుతుంటే.. ధరణిని ఏం జరిగిందని ఫణీంద్ర అడుగుతాడు. దీంతో ధరణి.. హడావిడిగా ఆయన బయటకు వెళ్లారని, ఎక్కడికి వెళ్తున్నారని అడిగితే చెప్పలేదని, ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదని, తనకు కంగారు గా ఉందని చెబుతుంది. అత్తయ్యగారు మాత్రం.. ఎందుకు అన్ని సార్లు ఫోన్ చేసి విసిగిస్తావ్ అంటున్నారు అని ఫణీంద్ర ముందు దేవయాణి ని ఇరికిస్తుంది.
‘ నీకు అది విసిగించడంలా కనపడుతుందా? తన భర్త మీద తనకు ఉన్న ప్రేమ కనిపించడం లేదా? అసలు శైలేంద్ర ఎక్కడికి వెళ్లాడు?’ అని అడుగుతాడు. తనకు తెలీదని దేవయాణి చెప్పినా ఫనీంద్ర నమ్మడు. కానీ.. దేవయాణి.. నిజంగానే తనకు తెలీదని తెలిస్తే చెబుతాను కదా అంటుంది. సరే అని.. శైలేంద్ర ఫోన్ కి ధరని నెంబర్ నుంచి కాల్ చేస్తాడు. ఈ సారి శైలేంద్ర లిఫ్ట్ చేస్తాడు. నిజంగా ధరణి అనుకొని తిట్టేస్తూ ఉంటాడు. ఫణీంద్ర అని తెలియగానే కూల్ అయ్యి.. డాడ్ మీరా.. మీరు అనుకోలేదు అని మాట్లాడతాడు. అంతే.. ఫణీంద్ర.. తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతాడు. ధరణి ఫోన్ చేస్తే ఎందుకు మాట్లాడట్లేదు అని అడుగుతాడు. తర్వాత నువ్వు ఎక్కడ ఉన్నావ్ అని అడుగుతాడు. ఏ పని మీద వెళ్లావ్ అంటే... మీటింగ్ ఉంటే వచ్చానని.. ఫారిన్ నుంచి ఫ్రెండ్స్ వచ్చారని మాట్లాడి వచ్చేస్తాను అని, ఒక గంటలో ఇంటికి వచ్చేస్తాను అని చెబుతాడు. ఇదే విషయం .. ధరణికి కూడా చెప్పొచ్చు కదా, తాను టెన్షన్ పడుతోందని ఫణీంద్ర అడుగుతాడు. ఈసారి నుంచి చెబుతాను అని శైలేంద్ర చెబుతాడు. తర్వాత.. మళ్లీ బయలుదేరి వెళతాడు.
Guppedantha Manasu
వసుధారను వెతుకుతూ భద్ర కూడా ఆ కిడ్నాప్ గ్యాంగ్ ప్లేస్ కి చేరుకుంటాడు. కానీ అక్కడ.. వసుధార ప్లేస్ లో ముకుల్ ఉండటం భద్ర చూస్తాడు. వెంటనే శైలేంద్రకు ఫోన్ చేస్తాడు. శైలేంద్ర చాలా ఆనందంగా వసుధార దొరికిపోయిందని చెబుతాడు. కానీ.. ఇక్కడ సీన్ చూసిన భద్ర.. వస్తే మీరు దొరికిపోతారని, అక్కడ వసు లేదని, ముకుల్ ఉన్నాడని అసలు విషయం చెప్పేస్తాడు. కానీ శైలేంద్ర నమ్మడు. కానీ.. భద్ర మరోసారి క్లారిటీగా చెబుతాడు. మీరు వస్తే.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటాడని చెబుతాడు. వెంటనే యూటర్న్ తీసుకోని వెనక్కి వెళ్లిపోమ్మని చెబుతాడు. ముకుల్ ఉండటం తాను చూశానని, కానీ.. ఆ ముకుల్ కి నేను దొరకలేదు అని చెబుతాడు. దీంతో.. శైలేంద్ర.. చివరి వరకు వచ్చి.. వెనక్కి వెళ్లిపోతాడు.
ఇక రౌడీలు మాత్రం.. తమను వదిలేయమని అడుగుతూ ఉంటారు. ముకుల్ తుపాకీ చూపిస్తూ.. మీ బాస్ ఎవరు అని అడుగుతాడు. వాళ్లు తమకు తెలీదని చెబుతూ ఉంటారు. మరోసారి ఫోన్ చేయడానికి ట్రై చేస్తే.. శైలేంద్ర ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుంది. ఈ లోగా.. భద్ర.. ఆ రౌడీలు పారిపోయేలా చేస్తాడు.
Guppedantha Manasu
ఇక.. వసుధార రిషి దగ్గరకు చేరుకుంటుంది. రిషిని కారు ఎక్కించుకొని తీసుకొని వెళ్తుంటుంది. సమయానికి ముకుల్ వచ్చి కాపాడాడని, లేకపోతే తాను ఏమైపోయేదాన్నో అంటుంది. ముకుల్ వచ్చి కాపాడగలడు అనే నమ్మకంతోనే తాను ముకుల్ కి ఫోన్ చేశాను అని , ఆ టైమ్ కి మా దగ్గర నీ ఫోన్ ఉండటం కూడా ప్లస్ అయ్యిందని రిషి అంటాడు. ఇక, చాలా కాలం తర్వాత.. మీతో కలిసి ప్రయాణం చేస్తున్నాను అని వసు సంతోషిస్తుంది. గతంలో జరిగిన విషయాలను గుర్తు చేసుకొని.. అన్ని రిషితో పంచుకుంటుంది.
తర్వాత మీరు అసలు ఎలా మిస్ అయ్యారు..? ఆరోజు మెసేజ్ మీరే పంపారా అని అడుగుతుంది. ‘ నువ్వు కారు దిగి వెళ్లిన తర్వాత, నేను కారు పార్కింగ్ చేస్తుండగా ఏదో తెలియని నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది. శైలేంద్ర ఇన్వెస్టిగేషన్ లో మీకు అక్కడ ఏ విషయాలు తెలియవు. మీకు పూర్తి వివరాలు తెలియాలంటే.. హాస్పిటల్ పక్కన ఉన్న ఓల్డ్ బిల్డింగ్ కి రమ్మని ఫోన్ లో చెప్పారు. నేను అక్కడికి వెళ్లే సరికి.. వెనక నుంచి వచ్చి ఎవరో ఎటాక్ చేసి, కిడ్నాప్ చేశారు’ అని రిషి చెబుతాడు. అక్కడి నుంచి తప్పించుకునే క్రమంలో చాలా మంది నా వెంట పడ్డారని, అప్పుడే ఫోన్ మిస్ అయ్యిందని, వాళ్లతో ఫైట్ చేసేటప్పుడే అడవిలో పడిపోయాను అని చెబుతాడు. అక్కడితో ఎపిసోడ్ ముగిసింది.