Guppedantha Manasu january 5th Episode: తన తండ్రి చెంతకు రిషిని చేర్చిన వసు, ప్లాన్ మిస్ అయిన కోపంలో శైలేంద్ర
ఇప్పుడు వసుధార ఎక్కడ ఉంది? ఏం చేస్తూ ఉంటుది. తన నెక్ట్స్ స్టెప్ ఏం అయ్యి ఉంటుంది.. ఇవన్నీ ఆలోచిస్తుంటే నా బుర్ర బద్దలయ్యేలా ఉంది’ అని శైలేంద్ర అనుకుంటూ ఉంటాడు.
Guppedantha Manasu
Guppedantha Manasu january 5th Episode: రిషిని కారులో తీసుకొని వసు ఇంటికి బయలు దేరుతూ ఉంటుంది. ఆ సమయంలో అసలు రిషి కిడ్నాప్ ఎలా జరిగింది అనే విషయాన్ని అడుగుతుంది. రిషి జరిగింది మొత్తం వివరిస్తాడు. తనను ఓ డార్క్ రూమ్ లో కిడ్నాప్ చేసి పడేశారని, అక్కడి నుంచి తప్పించుకుంటుంటే ఫోన్ మిస్ అయ్యిందని, వాళ్లతో ఫైట్ చేసే సమయంలో ఫారిస్ట్ లో కాలు జారి పడిపోతే, పెద్దమ్మ వాళ్లు తీసుకొని వచ్చారు అని చెబుతాడు. దీంతో.. వసు మీకు ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాల్సిందని, కానీ, ఇప్పుడు మీరు తన పక్కనే ఉన్నారని, మిమ్మల్ని మళ్లీ మామూలుగా మార్చుకుంటాను అని వసు చెబుతుంది
![article_image2](https://static-ai.asianetnews.com/images/01hkbp7gadjnzcbxan1tw5q1fs/5th-jan-gup4-jpg_300x257xt.jpg)
Guppedantha Manasu
ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అని రిషి అడుగుతాడు. అయితే.. మన ఇంటికి అయితే కాదు అని వసు చెబుతుంది. ఆ తర్వాత, ఆ పెద్దయ్య వాళ్లు చాలా మంచివారని.. వాళ్లకు ఏదో ఒక విధంగా సహాయం చేయాలని రిషి అంటాడు.. వసు సరే అంటుంది. తర్వాత వసు స్వయంగా రిషికి సీటు బెల్టు పెట్టి మరీ తీసుకొని వెళ్తుంది.
Guppedantha Manasu
శైలేంద్ర ఇంట్లో చాలా కోపంగా అటూ ఇటు తిరుగుతూ ఉంటాడు. వసు తప్పించుకుందని ఫీలౌపోతూ ఉంటాడు. ముకుల్ ఉన్నాడనే విషయం భద్ర తనకు చెప్పకపోయి ఉంటే..‘ ఒక్క సెకన్ లో తన బండారం మొత్తం బయటపడేది, ఇన్ని రోజులు నేను వేసుకున్న ముసుగు తొలగిపోయేది, నా కలులు, ఆశలుు అన్నీ సర్వ నాశనం అయిపోయేవి. అసలు అలా ఎలా జరిగింది, ముకుల్ ఎలా వచ్చాడు? నాకు ఏమీ అర్థం కావడం లేదు. ఇప్పుడు వసుధార ఎక్కడ ఉంది? ఏం చేస్తూ ఉంటుది. తన నెక్ట్స్ స్టెప్ ఏం అయ్యి ఉంటుంది.. ఇవన్నీ ఆలోచిస్తుంటే నా బుర్ర బద్దలయ్యేలా ఉంది’ అని శైలేంద్ర అనుకుంటూ ఉంటాడు.
Guppedantha Manasu
అప్పుడే ధరణి ఎంట్రీ ఇఛ్చి.. ‘ఏమైంది అండి.. అంత టెన్షన్ గా తిరుగుతూ ఉన్నారు, ఈ రోజు చావు దాకా వెళ్లి వచ్చినట్లున్నారా అండి ’ అని అడుగుతుంది. శైలేంద్ర అవునని, మృత్యుదేవతను ముద్దాడేవాడినని, ఆల్ మోస్ట్ పాడేమీద పడుకోబోయేవాడిని అని చెబుతాడు. ఆ మాటలకు ధరని షాకై.. ఏం మాట్లాడుతున్నారు అని అమాయకంగా అడుగుతుంది. దానికి శైలేంద్ర.. ‘ అవును ధరణి, మచ్చల పులి ముఖం మీద గాండ్రిస్తేఎలా ఉంటుందో తెలుసా? మండు వేసంగి గొంతులో దిగితే ఎలా ఉంటుందో తెలుసా?’ అని అడుగుతాడు. దానికి ధరణి తెలుసండి అంటుంది. ఎలా ఉంటుది అని మళ్లీ శైలేంద్ర అడిగితే.. అరవింద సమేతలో.. ఎన్టీఆర్, జగపతిబాబు మీద దాడి చేస్తే ఎలా ఉంటుదో.. అలా ఉంటుది అని చెబుతుంది. తర్వాత.. ‘మీరు మీటింగ్ కి వెళ్లానని మామయ్యకు చెప్పారు కదా. అక్కడ ఉంది మీ ఫ్రెండ్సే కదా..? అక్కడ ఏమైనా జరిగిందా? మీరు వెళ్తున్నప్పుడే చెప్పా కదండి.. మీరు ఒంటరిగా వెళ్లొద్దు.. నేను వస్తాను అని. కానీ మీరే నా మాటవినకుండా వెళ్లిపోయారు. తీరా ఇప్పుడు ఇంటికి వచ్చి కంగారు పడుతూ ఏవేవో చెబుతున్నారు’ అంటుంది. అసలు ఏమైంది అని ధరణి మళ్లీ అడగగా, ఏమీ లేదు అని శైలేంద్ర టాపిక్ డైవర్ట్ చేయాలని చూస్తాడు. కానీ ధరణి వదిలిపెట్టకుండా అడుగుతూనే ఉంటుంది. సమాధానం చెప్పకుండా విసుక్కుంటూ.. ఇక్కడి నుంచి వెళ్లమంటాడు. ధరణి మాత్రం.. తాను వెళ్లనని నిద్ర వస్తోంది పడుకోవాలి అని చెప్పి పడుకుంటుంది.
పడుకున్న తర్వాత.. మీరు కూడా పడుకోండి అంటుంది. శైలేంద్ర కోపంగా చూస్తే... మీ ఇష్టం నేనైతే పడుకుంటున్నాను అని వెళ్లి పడుకుంటుంది. శైలేంద్రకు కనపడకుండా కళ్లు తెరచి.. ఈయన ఏదో ప్లాన్ వేశాడు.. అది తిప్పికొట్టింది.. అందుకే ఇలా కంగారుపడుతున్నారు. ఈయన ఇలా ఉన్నారు అంటే వాళ్లకు ఏమీ కాలేదు అని అర్థం అని మనసులో అనుకుంటుంది.
Guppedantha Manasu
మరోవైపు మహేంద్ర ఇంట్లో ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఫణీంద్ర ఫోన్ చేస్తాడు. వసుధార గురించి ఆరా తీస్తాడు.. ఇంకా ఇంటికి రాలేదని, ఫోన్ కూడా కలవడం లేదు అని మహేంద్ర చెబుతాడు. తెలిసిన వాళ్లను కనుక్కోమని ఫణీంద్ర అంటే.. అలా కూడా చేశానని అంటాడు. అసలే రిషి కనిపించడం లేదంటే.. ఇప్పుడు వసు కూడా కనిపించకపోవడం ఏంటి ఫణీంద్ర అంటాడు. తర్వాత.. ఏదైనా పనిమీద వెళ్లిందేమో వస్తుంది లే అని ధైర్యం ఇస్తాడు. తర్వాత.. వసుధార ఇంటికి వస్తే చెప్పమని అడుగుతాడు సరేనని మహేంద్ర అంటాడు.
Guppedantha Manasu
అది విన్న దేవయాణి.. ఏంటి వసుధార కనిపించడం లేదా అనుకుంటూ వస్తుంది. ఇప్పటి వరకు ఇంటికి రాలేదు అంటే.. తనకు ఏమైనా అయ్యిందేమో అని అంటుంది. ఆ మాటకు ఫణీంద్రకు విపరీతంగా కోపం వస్తుంది. నీ పాపపు నోటితో అలాంటి మాటలు మాట్లాడొద్దు అని తిడతాడు. తర్వాత వసుధార కనిపించడం లేదని నాకు ఎందుకు చెప్పలేదు అని అడుగుతుంది. నీకు ఎందుకు అని ఫణీంద్ర తిడతాడు. ఆ తర్వాత.. దేవయాణి.. ధరణిని పిలిచి... వసుధార కనిపించడం లేదు అని చెబుతుంది. ధరనిని వసుకి ఫోన్ చేసి క్షేమ సమాచారాలు కనుక్కోమని అంటుంది. ఫణీంద్ర ధరణిని వద్దు అని చెప్పి, వసు పనిమీద వెళ్లి ఉంటుంది.. నువ్వు వెళ్లి పడుకోమ్మా అని చెబుతాడు. దేవయాణికి కూడా పనిలో పనిగా వార్నింగ్ ఇచ్చి.. ఫణీంద్ర అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
శైలేంద్ర.. టెన్షన్ గుర్తొచ్చి.. ఆయన టెన్షన్ పడింది వసుధార కోసమా అని అనుకుంటుంది. ఆయన వసుధారను ఏమైనా చేసి ఉంటాడా అని భయపడుతుంది. ఈ విషయం ఎలాగైనా చిన్న మామయ్యకు చెప్పాలి అని అనుకుంటుంది. తర్వాత... గాయాలతో ఉన్న రిషిని.. వసు తన పుట్టింటికి తీసుకువెళ్తుంది. రిషి అలా ఉన్నాడేంటి అని వసు వాళ్ల నాన్న కంగారుపడతాడు. ముందు.. మంచినీళ్లు తెమ్మని వసు అంటుంది. ఆయన తెచ్చి ఇస్తారు. ఈలోగా రిషిని.. బెడ్రూమ్ లో పడుకోబెడుతుంది.
Guppedantha Manasu
మన ఇంటికి వెళ్లేవాళ్లం కదా, అనవసరంగా మీ నాన్న గారికి ఇబ్బంది ఎందుకు అని రిషి అంటాడు.. దానికి వసు తండ్రి చక్రపాణి..తనకు ఏం ఇబ్బంది ఉంటుంది బాబు అంటాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ సేఫ్టీ ముఖ్యం అని, ఎక్కడ ఉన్నారని కాదని.. క్షేమంగా ఉండటం ముఖ్యమని.. ఇక్కడికి తీసుకువచ్చాను అని చెబుతుంది. మీకు అడుగడుగునా ప్రమాదం పొంచి ఉంది.. ఏ క్షణంలో ఏం జరుగుుతందో తెలీదు.. మనం మన ఇంటికి వెళితే.. ఇంకా ఎక్కువ ప్రమాదం జరుగుతుందని.. ఇక్కడైతే అనుమానం రాదు అని చెబుతుంది.
రిషి కూడా వసు కి జాగ్రత్తలు చెబుతాడు. ఆ మాటలు చూసి చక్రపాణి కంగారుపడతాడు. ఏమైంది అని అడుగుతాడు. అప్పుడు.. జరిగిన విషయం మొత్తం తన తండ్రికి వసు వివరిస్తుంది. అదంతా విని చక్రపాణి కంగారుపడతాడు. ఇంత జరిగినా తనకు చెప్పలేదని, ఈ నాన్న ను మర్చిపోయావా అని ఫీలౌతాడు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక చెప్పలేదని అంటుంది. తర్వాత... చక్రపాణి.. రిషికి ఏమీ కాదని ధైర్యం చెబుతాడు. మీకు ఏం కావాలన్నా నేను చూసుకుంటాను అని చెబుతాడు.
Guppedantha Manasu
రాత్రికి.. రిషికి వసు భోజనం తినిపిస్తూ ఉంటుంది.కొంచెం తిన్న తర్వాత.. రిషి చాలు అంటాడు. మీకు ఏమైనా కావాలని అనిపిస్తే అడగండి అని వసు అంటే.. నాకు నీ దగ్గర మొహమాటం ఎందుకు? నిన్ను కాక ఇంకెవరిని అడుగుతాను అంటాడు. ఆ మాటకు వసు ఏడుస్తుంది. రిషి.. ఆ కన్నీరు తుడిచి.. నువ్వుఏడిస్తే నేను తట్టుకోలేనని చెబుతాడు.
అయితే.. రిషిని ఇలాంటి పరస్థితుల్లో చూడలేకపోతున్నానని, కన్నీళ్లు ఆగడం లేదని వసు అంటుంది. రిషి మాత్రం.. వసుకి జీవిత పాఠాలు వివరిస్తాడు. వసు మాత్రం.. మీకు ఏదైనా జరిగడానికి ముందే తన ప్రాణం పోతుందని.. అది నిజమని, తన మనసుకు తెలుసని మీరు క్షేమంగా ఉన్నారని, ఏదో ఒక రోజు మనం కలుస్తామని, ఆ ధైర్యంతోనే మీకోసం ఎదురుచూస్తూ ఉన్నాను అని చెబుతుంది. మనది రిషిధారల బంధం అని, మనకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూడా మన ప్రేమ మనకు అండగా ఉంటుంది అని రిషి అంటాడు. తర్వాత. రిషి చేతిని పట్టుకొని వసు ఐలవ్ యూ చెప్పగా... రిషి కూడా లవ్ యూ టూ చెబుతాడు.
తర్వాత.. చక్రపాణి వచ్చి అల్లుడు గారు భోజనం చేశారా అని అడుగుతాడు. చాలా కొంచమే తిన్నాడని వసు చెబుతుంది. దానికి చక్రపాణి.. ఎలా ఉండాల్సిన అల్లుడుగారు ఎలా అయిపోయాడని, అంత డబ్బు ఉండి కూడా కడుపు నిండా భోజనం కూడా చేయలేని పరిస్థితి అని బాధపడతాడు. మరి చక్రపాణి మందుల గురించి అడిగితే.. ఇప్పటి వరకు ఏమీ వాడలేదని వసు చెబుతుంది. కేవలం పసరు మందు మాత్రమే పోశారని చెబుతుంది. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.