Guppedantha Manasu December8th Episode:మట్టికొట్టుకుపోతావ్.. శైలేంద్రకు శాపం, దేవయాణి పై చెయ్యి ఎత్తిన వసు..!
నీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్లాడు,అసలు ఎక్కడికి వెళ్లినట్లు. ఒకరోజంతా అంటే 24గంటలు.. అంతసేపు అయినా రాలేదు అంటే, కొంపదీసి జగతికి జరిగినట్లు, రిషికి కూడా..’ అని దేవయాణి అనగానే, వసు.. దేవయాణి మీద కోపం చెయ్యి ఎత్తుతుంది.
Guppedantha Manasu
Guppedantha Manasu December8th Episode: జగతి కి అలా జరగడం, రిషి కనిపించకపోవడం, రీసెంట్ గా శైలేంద్రపై ఎటాక్ ఇవన్నీ చూసి అనుపమ కంగారుపుడుతుంది. అసలు ఇది ఇల్లా లేక ఇంకేమన్నానా..?వరసగా ఇలాంటి సంఘటనే ఎందుకు జరుగుతున్నాయి అని మహేంద్రను ప్రశ్నిస్తుంది. అయితే, మహేంద్ర శైలేంద్ర పేరు చెప్పడానికి ఆలోచిస్తాడు. శైలేంద్రపేరు చెప్పగానే నువ్వు వెళ్లి రచ్చ చేస్తావ్.. అప్పుడు వెంటనే వాళ్లు తప్పించుకుంటారు. ఆ విషయం నీకు చెప్పకూడదు అని మహేంద్ర మనసులో అనుకొని, బయటకు మాత్రం మా ఇంటికి ఓ శని దాపురించింది. అప్పటి నుంచే ఇవన్నీ జరుగుతున్నాయి అంటాడు. శని అంటే నేనేనా అని అనుపమ అంటుంటే, కాదు అని చెబుతాడు.
![article_image2](https://static-ai.asianetnews.com/images/01hh3neh36t78ss2hwyjg0jxpd/8gup3-jpg_300x326xt.jpg)
Guppedantha Manasu
వారు మాట్లాడుకుంటూ ఉండగా, ముకుల్ అక్కడకు వస్తాడు. రిషి కనిపించకపోవడం ఏంటి అని ముకుల్ అడుగుతాడు. హాస్పిటల్ దగ్గరకు వచ్చాడని, కానీ అప్పటి నుంచి కనిపించడం లేదు అని చెబుతాడు. ముందే చెప్పాల్సింది కదా అని ముకుల్ అంటాడు. మీ ఫ్యామిలీలో పెద్ద కుట్ర జరుగుతోందని, అది ఎన్ని అనర్థాలకు దారితీస్తుందో అనిఅంటాడు. తర్వాత.. శైలేంద్ర మీద అనుమానం రాగానే, అతనిని విచారించేలోపు అతనిపై దాడి జరగడం, తర్వాత రిషి కనిపించకపోవడానికి ఏదైనా సంబంధం ఉందేమో అనే అనుమానంగా ఉంది అని ముకుల్ అంటాడు. వెంటనే అనుపమ శైలంద్రను విచారించడం ఏంటి అని అడగగానే, జగతి మేడమ్ కేసులో ప్రధాన నిందితుడు శైలేంద్రే మేడమ్ అని ముకుల్ చెప్పేస్తాడు. అది విని అనుపమ షాక్ అవుతుంది.
శైలేంద్రను ఇంటిరాగేట్ చేద్దాం అనుకునేలోపు తనకు అలా జరిగిందని, హాస్పిటల్ కి వెళితే, వాళ్ల అమ్మ మాట్లాడనివ్వలేదని, డిశ్చార్జ్ అయ్యాక వెళ్లి, మాట్లాడాలని, అతని కండిషన్ తనకు చెప్పమని ముకుల్ అడుగుతాడు. సరే అని మహేంద్ర చెబుతాడు. తర్వాత మహేంద్ర, అనుపమ లు హాస్పిటల్ కి వెళతారు. ముకుల్ కూడా వెళ్లిపోతాడు. వసు మాత్రం స్కూటీ మీద, రిషి కోసం వెతుకుతూనే ఉంటుంది.
Guppedantha Manasu
ఈలోగా మహేంద్ర, అనుపమలు శైలేంద్ర ఉన్న హాస్పిటల్ కి చేరుకుంటారు. అక్కడ వారిని చూసిన దేవయాణి షాకౌతుంది. వామ్మో ఈ అనుపమ వచ్చింది ఏంటి అని మనసులోనే అనుకుంటుంది. తర్వాత ఏమీ ఎరగనట్లు అనుపమ అని జాలిగా పిలిచి.. ఎంత ఘోరం జరిగిందొ చూశావా అని అడుగుతుంది. ఆ మాటకు దేవయాణి కంగుతింటుంది. ఎలా ఉంది అని కదా అడగాలి.. ఎప్పుడు డిశ్చార్జ్ అని అడుగుతావేంటి అంటుంది. అయితే, అనుపమ ‘నేను తన యోగ క్షేమాలు అడిగినంత మాత్రాన, కండిషన్ నార్మల్ అయిపోతుందా? నేను బాగున్నాడు అని అడకపోతే, బాగోనివాడు బాగవుతాడా? లేక బాగైనవాడు.. బాలేకపోతాడా? అలా అని నేను ట్రీట్మెంట్ గురించి అడగకపోతే, ట్రీట్మెంట్ ఆగిపోతుందా? చెప్పండి మిమ్మల్నే అడిగేది ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తున్నారు’ అని అంటుంది. అయితే, డాక్టర్లు ఇంకా ఏం చెప్పలేదు అని దేవయాణి అంటే, మీరు కాన్ఫిడెంట్ గా అడిగి ఉండరు అని కౌంటర్ వేస్తుంది. తర్వాత డాక్టర్ రాగానే, ట్రీట్మెంట్ అంతా అయిపోయిందా? కండిషన్ నార్మల్ గానే ఉందా? ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తున్నారు అని అడుగుతుంది. ఆమె మాటలకు కాస్త డాక్టర్ బెదిరినట్లుగా అనిపించింది. వెంటనే ఈరోజు మధ్యాహ్నం డిశ్చార్జ్ చేస్తాం అంటాడు.
Guppedantha Manasu
తర్వాత ఫణీంద్ర.. మహేంద్ర డల్ గా ఉండటం గమనిస్తాడు. ఏమైందని అడిగితే.. రిషి కనపించడం లేదు కదా అని అనుపమ ఆన్సర్ ఇస్తుంది. ఇంకా రిషి ఇంటికి రాలేదా? అసలు ఎక్కడికి వెళ్లాడు అని ఫణీంద్ర అనుమానం వ్యక్తం చేస్తాడు. దేవయాణి కూడా ఓవర్ యాక్షన్ చేస్తుంది. నా ఇద్దరు బిడ్డలను ఇలా చేశావేంటయ్యా? ఒకరు హాస్పిటల్ లో, మరొకరు అసలు కనిపించడం లేదు అని దొంగ ఏడుపులు ఏడుస్తుంది.
మహేంద్ర కూడా... రిషి ఎక్కడికి వెళ్లాడో తెలియడం లేదని, వసుధార రిషి కోసం రాత్రి నుంచి వెతుకుతోందని చెబుతాడు. ముకుల్ కి కూడా చెప్పానని అంటాడు. ఈలోగా, వసుధార ఫోన్ చేస్తుంది. తాను రిషి సర్ కోసం మొత్తం వెతికానని, ఎక్కడా కనిపించడం లేదని, ఎవరిని అడిగినా తెలీదు అంటున్నారని బాధపడుతుంది. అయితే, తాను ముకుల్ కి చెప్పానని, అతను పట్టుకుంటాడని,నువ్వేమీ కంగారుపడొద్దని ధైర్యం చెబుతాడు. ఇక శైలేంద్ర డిశ్చార్జ్ అవుతున్నాడని, అక్కడికే వసుని కూడా రమ్మని , ముకుల్ కూడా వస్తాడని చెబుతాడు. ముకుల్ ప్రశ్నలకు శైలేంద్ర ఏం సమాధానాలు చెబుతాడో, నువ్వు అక్కడికి వచ్చేయమ్మా అని అడుగుతాడు. దీంతో, వసు సరే అని చెబుతుంది.
Guppedantha Manasu
ఇక, శైలేంద్ర డిశ్చార్జ్ అయ్యి.. ఇంటికి వస్తాడు. అయితే, మహేంద్ర మాత్రం రాకుండా అక్కడే ఆగిపోతాడు. అందరూ మహేంద్ర ఎందుకు రావడం లేదా అని ఆగిచూస్తూ ఉంటారు. ఫణీంద్ర వెళ్లి మరీ అడుగుతాడు.. ఎందుకు లోపలికి రావడం లేదని అడుగుతాడు. గతంలో జరిగిన గొడవ గుర్తొచ్చిఆగిపోయావా? అని అడుగుతాడు. తర్వాత దేవయాణి, అవన్నీ మనసులో పెట్టుకోవద్దని, మీ ప్రశాంతత కోసం, మీ సుఖం కోసం మీరు బయటకు వెళ్లారని, ఇది నీ ఇల్లు...నువ్వు ఎప్పుడైనా రావచ్చు అని అంటుంది. ఫణీంద్ర దగ్గరుండి మహేంద్రను లోపలికి తీసుకువెళ్తుంటే, వసుధార వచ్చేస్తుంది. రిషి ఆచూకీ ఏమైనా తెలిసిందా అని అడిగితే, తెలీదని చెబుతుంది. అందరం కలిసి వెతుకుదాం అని ఫణీంద్ర భరోసా ఇస్తాడు.
తర్వాత శైలేంద్రను లోపలికి తీసుకొని వెళ్లమని ఫణీంద్ర అనగా, దేవయాణి, తన కొడుక్కి దిష్టి తగిలిందని, ఎవరైనా హారతి ఇస్తే బాగుంటుందని అంటుంది. దీంతో, వసుధారను శైలేంద్రకు హారతి ఇవ్వమని అడుగుతారు. చేసేది లేక, వసు వెంటనే శైలేంద్రకు హారతి ఇస్తుంది. ఆ సమయంలో శైలేంద్ర నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని హారతి తీయమ్మా అని దేవయాణి అంటుంది. కానీ, వసు మాత్రం హారతి ఇస్తూ.. ఈ హారతి పళ్లెంలోని అగ్నిసాక్షిగా చెబుతున్నా.. ఎన్నో పాపాలకు ఉడిగట్టిన నువ్వు,దేవతలాంటి జగతి మేడమ్ ని పొట్టనపెట్టుకున్న నువ్వు మట్టి కొట్టుకుపోతావ్ అని శాపం పెడుతుంది. తర్వాత, కావాలనే ఆ హారతి పేట్ దేవయాణి కాలు మీద పడేలా చేస్తుంది.
Guppedantha Manasu
‘అయ్యయ్యో.సారీ మేడమ్.. చెత్తలో పడేయాల్సిన నీళ్లు.. మీ మీదపడినట్లు ఉన్నాయి. కాలు తట్టుకుంది మేడమ్ సారీ’ అని అమాయకంగా అంటుంది వసుధార. దేవయాణికి బాగా కోపం వస్తుంది. కానీ ఏమీ అనలేక ఊరుకుుంటుంది. అందరూ లోపలికి వెళ్లిపోతారు. అందరూ వెళ్లిపోయిన తర్వాత దేవయాణి.. ‘వసుధార.. నువ్వు కావాలని దిష్టినీళ్లు నా మీద పడేలా చేశావ్ అని నాకు తెలుసు’ అని అంటుంది. దానికి వసుధార.. ‘మీ ఇష్టం మేడమ్.. మీకు ఎలా అనిపిస్తే అలా అనుకోండి’ అని పొగరుగా సమాధానం చెబుతుంది.
Guppedantha Manasu
‘ నువ్వు నా మీద దిష్టి నీళ్లు పోశావని సంతోషపడకు. అసలు నీకు ఇలాంటి పరిస్థితి వస్తుందని కూడా ఊహించి ఉండవు కదా, మా అంతు చూస్తాను అన్నావ్ కదా, కానీ, శైలేంద్రకు నీ చేతితో నువ్వు హారతి పట్టావ్. మా గతం బయటపెడతాన్ అన్నావ్ కానీ, మా కొడుక్కి హారతి పట్టి ఇంట్లోకి స్వాగతం పలికావ్. అసలు ఊహించి ఉండవ్ కదా ఇలా జరుగుతుందని. వసుధార.. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే, ముందుముందు చాలా జరుగుతాయ్, ఎందుకంటే, పరిస్థితులను మా చేతుల్లోకి తీసుకోవడం మాకు వెన్నతో పెట్టిన విద్య’ అని దేవయాణి డైలాగులు కొడుతుంది. కానీ, దేవయాణి డైలాగులకు వసు కౌంటర్లు వేస్తూ ఉంటుంది.
Guppedantha Manasu
‘ఏంటి మేడమ్, ఈ మాత్రం దానికే ఇంత మిడిసిపాటు. మీ కొడుకు జస్ట్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ముందుంది ముసల్ల పండగ. ఎన్నాళ్లు తప్పించుకొని తిరుగతారు. అతి తొందరలోనే మీ దుర్మార్గాలు, దారుణాలు బయటపడతాయి’ అంటుంది. ‘రిషి కనిపించడం లేదంట కదా, భర్త పక్కన లేకపోయినా ధైర్యంగా మాట్లాడుతున్నావ్? నీ భర్త ఎక్కడికి వెళ్లాడు..? నీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్లాడు,అసలు ఎక్కడికి వెళ్లినట్లు. ఒకరోజంతా అంటే 24గంటలు.. అంతసేపు అయినా రాలేదు అంటే, కొంపదీసి జగతికి జరిగినట్లు, రిషికి కూడా..’ అని దేవయాణి అనగానే, వసు.. దేవయాణి మీద కోపం చెయ్యి ఎత్తుతుంది. కానీ, తనకు తన మేడమ్ నేర్పిన సంస్కారం అని, అందుకే కొట్టకుండా ఆగిపోయానని చెబుతుంది. తన భర్త గురించి ఇంకోసారి అపశకునంగా మాట్లాడితే ఊరుకోను అని చెబుతుంది. ‘అయినా.. మీకు ఎంతో కాలం లేదులే.. ముకుల్ గారు వస్తున్నారు.. మహా అయితే, గంట, రెండు గంటలు.. ఆల్రెడీ తన దగ్గర సాక్ష్యం ఉంది. మొన్న మీరు కూడా విన్నారు కదా, ఈ మధ్యకాలంలో ఏవేవో డ్రామాలు ఆడి వాయిదా వేశారు కదా. కానీ నిజం బయటపడకుండా ఉండదు. మీరు, మీ కొడుకు శిక్ష అనుభవించే సమయం ఆసన్నమైంది’ అని సీరియస్ వార్నింగ్ ఇచ్చి, అక్కడి నుంచి వెళ్లిపోతుంది.