Guppedantha Manasu 12th January Episode:రిషి పై మరో ఎటాక్, చితకబాదిన చక్రపాణి, అత్తకు చుక్కలు చూపించిన ధరణి
చక్రపాణి మాత్రం.. కూతురికి సపోర్ట్ చేస్తూ.. చాలా ధైర్యం చెబుతాడు. తన అల్లుడి కోసం ఏమైనా చేస్తాను అంటాడు. తర్వాత వసుని లోపలికి పంపించేస్తాడు. చక్రపాణి మాత్రం గుమ్మం దగ్గరే కాపలా కాస్తాడు.
Guppedantha Manasu
Guppedantha Manasu 12th January Episode: పెద్దయ్య చేతిలో శైలేంద్ర తన్నులు తిన్న విషయం తెలిసిందే. అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత.. శైలేంద్రకు కొన్ని అనుమానాలు వస్తాయి. వసు ముఖంలో రిషి కనిపించడం లేదనే బాధ కనిపించడం లేదు అనుకుంటాడు. అంటే.. రిషి కచ్చితంగా వసు దగ్గరే ఉన్నాడని.. అది కూడా తన తండ్రి గారి ఇంట్లోనే అనే అభిప్రాయం శైలేంద్రకు వస్తుంది. అంతే.. వాళ్లు ఉండే ఇంటికి రౌడీలను పంపుతాడు.
లోపల రిషి ఉన్నాడా లేదా అనే విషయం తెలుసుకోవడానికి వాళ్లు వస్తారు. వసుని ఎవరైతే కిడ్నాప్ చేస్తారో.. ఆ ఇద్దరే చక్రపాణి ఇంట్లోకి వెళతారు. కానీ.. అప్పటికే ఇంటికి చక్రపాణి కాపలాగా ఉంటాడు. ఆ ఇద్దరు రౌడీలను కింద పడేలా చేస్తాడు. తర్వాత.. ఇద్దరు రౌడీలను పారిపోయేదాకా చితకబాదుతాడు. ఆ దెబ్బలు తినలేక రౌడీలు పారిపోతారు. మళ్లీ వస్తే.. చంపేస్తాను అని వార్నింగ్ ఇస్తాడు. ఆ శబ్దాలకు వసుు బయటకు వస్తుంది.
![article_image2](https://static-ai.asianetnews.com/images/01hky944mkcthsjq5es5bcy7mc/12-jan-gup2-jpg_300x271xt.jpg)
Guppedantha Manasu
ఏమైంది నాన్న అని అడుగుతుంది. రౌడీలు వచ్చారని, నేను ఉండగా ఈ ఇంటికి ఎవరూ రాలేరు అని చక్రపాణి అంటాడు. దీంతో భయపడిన వసు... సర్ ని మనం జాగ్రత్తగా చూసుకోవాలని, పగలు,రాత్రి అనే తేడా లేకుండా సర్ పై ఎటాక్ చేయాలని చూస్తున్నారని ఇంకా జాగ్రత్తగా ఉండాలని భయపడుతుంది. దీంతో.. చక్రపాణి కూతురికి ధైర్యం చెబుతాడు. తాను ఉండగా అల్లుడి జోలికి రానివ్వను అని, శైలేంద్ర ఎన్ని కుట్రలు చేసినా.. అల్లుడు గారిని తాకనివ్వను అంటాడు. ఆ శైలేంద్రే స్వయంగా వస్తే.. ఈ పెరట్లోనే పాతేస్తాను అని, తెల్లారేవరకు ఈ గడప దగ్గరే కాపలా ఉంటాను అంటాడు. నువ్వు నిద్రపోవా నాన్న అంటే.. అల్లుడు గారు కోలుకునే వరకు గుమ్మం దగ్గరే ఉండి కాపలా కాస్తాను అంటాడు. వసమ్మా.. నీ సంతోషం కోసం ఏమైనా చేస్తానని.. నిద్ర వచ్చినా నీళ్లతో కడుక్కోని అయినా.. మీ దాకా ఎవరినీ రానివ్వను అని అంటాడు. తండ్రి ప్రేమకు వసు బాధపడుతుంది. చక్రపాణి మాత్రం.. కూతురికి సపోర్ట్ చేస్తూ.. చాలా ధైర్యం చెబుతాడు. తన అల్లుడి కోసం ఏమైనా చేస్తాను అంటాడు. తర్వాత వసుని లోపలికి పంపించేస్తాడు. చక్రపాణి మాత్రం గుమ్మం దగ్గరే కాపలా కాస్తాడు.
Guppedantha Manasu
చక్రపాణి దెబ్బలకు రౌడీలు భయంతో పారిపోతారు. తర్వాత.. సర్ కి ఏం చెబుదాం అనుకుంటారు. రిషి అసలు ఇక్కడ లేడు అని చెబుదాం అని ఇద్దరూ డిసైడ్ అవుతారు. తర్వాత ఫోన్ చేసి అదే విషయం శైలేంద్రకు చెబుతారు.
Guppedantha Manasu
నిజం చెప్పమని శైలేంద్ర అంటే.. నిజంగానే అంటారు. మీరు అబద్దం చెబుతున్నారంటే.. నిజంగానే వసుధార, వాళ్ల నాన్న తప్ప మరెవరూ ఆ ఇంట్లో లేరని చెబుతారు. అయితే.. రిషి అక్కడ కూడా లేడుు అంటే.. మరి ఎక్కడ ఉన్నాడా అని శైలేంద్ర ఆలోచిస్తూ ఉంటాడు.
Guppedantha Manasu
మరోవైపు ముకుల్, వసుధార కలుసుకొని మాట్లాడుకుంటారు. ఇంటిపై ఇద్దరు వచ్చి ఎటాక్ చేయాలని చూస్తున్నారని, పెద్దమ్మ, పెద్దయ్యలకు కూడా ముందే విషయం చెప్పాం కాబట్టి.. వాళ్లు కూడా మనకు సహాయం చేశారు అని వసుధార అంటుంది. నిజమేనని.. శైలేంద్ర మూర్ఖుడని, రిషి సర్ కి ప్రమాదం చేయాలని చూస్తున్నాడని ముకుల్ అంటాడు. రిషి పూర్తి ఆరోగ్యంగా ఉండి ఉంటే.. మనం కాపలా కాయాల్సిన అవసరం లేదని, రిషి మామూలుగా ఉంటే.. ఆయన కళ్లలోకి చూసే ధైర్యం కూడా శైలేంద్ర చేయలేడని వసు చెబుతుంది. ఇప్పుడు సర్ పరిస్థితి సరిగా లేకపోవడంతో.. ఇలా రెచ్చిపోతున్నాడని అంటుంది. రిషి సర్ ని కాపడుకోవడానికి తన శక్తి సరిపోవడం లేదని, ఎక్కడ ఉంటే ఆయన సేఫ్ గా ఉంటారో అర్థం కావడం లేదని వసు భయపడుతుంది. ముకుల్ ధైర్యం చెబుతాడు.
Guppedantha Manasu
త్వరలోనే శైలేంద్ర గుట్టు రట్టు అవుతందని, మనం అందరం కలిసి రిషి సర్ ని కాపాడుకుందాం అని ముకుల్ అంటాడు. తర్వాత వసు.. ఎలాగైనా రిషి సర్ ని సేఫ్ ప్లేస్ కి మార్చాలి అని , ఆ విషయం నేను ఆలోచిస్తాను అని అంటుంది. ముకుల్ సరే అంటాడు.
Guppedantha Manasu
ఇక.. ధరని ఇంట్లో చీరలు మడత పెడుతూ ఉంటుంది. కోడలిని కాకాపట్టడానికి దేవయాణి జ్యూస్ తీసుకొని మరీ వస్తుంది. అది చూసి నేను పనిలో పడి జ్యూస్ చేయడం మర్చిపోయానని, మీరే చేసుకున్నారు కదా.. తాగేయండి అంటుంది. కానీ.. నా కోసం కాదు.. నీకోసం నేనే ప్రేమగా చేసి తీసుకువచ్చాను అని చెబుతుంది. అత్తయ్యగారు ప్రేమగా మాట్లాడుతన్నారు.. దేని కోసమో అని ధరణి మనసులో అనుకుంటుంది. కానీ..దేవయాణి జ్యూస్ తాగమని అడిగితే.. తాను కాఫీ తాగుదాం అనుకుంటున్నానని.. జ్యూస్ వద్దు అని చెబుతుంది. అయితే.. దేవయాణి కాఫీ నేనే కలిపి తీసుకువస్తాను అంటుంది. దొరికింది ఛాన్స్ అని ధరణి.. నవ్వుకుంటూ సెటైర్లు వేస్తుంది. ప్రేమగా మాట్లాడారు.. అది చాలని , కాఫీ వద్దు అంటుంది. దేవయాణి.. ఇంకా నటిస్తూనే ఉంటుంది. ఇంత ప్రేమగా మాట్లాడుతూ ఉందంటే.. నాతో ఏదో పని ఉండే ఉంటుంది అని అనుకుంటుంది.
నెమ్మదిగా.. వసుధార, మహేంద్ర టాపిక్ తీసుకువస్తుంది. ఒకప్పుడు రిషి కోసం వెతికినట్లుగా.. ఇప్పుడు రిషి కోసం ఎందుకు వెతకడం లేదు..? సడెన్ గా వసుధార వాళ్ల నాన్న ఇంటికి ఎందుకు వెళ్లింది..? మహేంద్ర ఇంత కూల్ గా ఎందుకు ఉంటున్నాడు..? రిషి వసు దగ్గరే ఉన్నాడా అని అడుగుతుంది. మీ నాటకం వెనక అసలు కుట్ర ఇదా అని ధరని మనసులో అనుకొని.. నాకేం తెలుసు అత్తయ్యగారు అంటుంది. ఏదైనా తెలిస్తే.. మీకే తెలుస్తుంది కానీ.. నాకు ఎలా తెలుస్తుంది అని ధరణి అంటుంది. ఒకసారి వసుధారకు ఫోన్ చేసి.. రిషి అక్కడ ఉన్నాడ లేదో కనుక్కోమని అంటుంది. నిజమేనని.. అయితే.. ఆ ఫోన్ నేనే ఎందుకు చేయాలి..? మీరు చేయవచ్చు కదా అని దేవయాణి అంటుంది.
Guppedantha Manasu
నాకు నిజంగానే వసు, రిషి లు సంతోషంగా ఉండాలనే అనుకుంటాను. కానీ, ఇప్పుడు వాళ్లకు ఫోన్ చేస్తే నాకేం వస్తుంది..? ఏమీ రాదు కదా అందుకే చెయ్యను. అయినా నేను దేవుడిని ఎప్పుడూ ఒకటే కోరుకుంటాను.. మంచివాళ్లకు ఎప్పుడూ మంచే జరగాలని, చెడ్డవాల్లకు వాళ్లు చేసిన పాపాలకు శిక్ష పడాలి అని కోరుకుంటాను అని చెప్పి.. అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ధరని వెళ్లగానే శైలేంద్ర వస్తాడు. ఇద్దరూ కలిసి.. తమ ప్లాన్ ప్లాప్ అయినందుకు ఫీలౌతారు. రిషి గురించి ఏమైనా చెప్పిందా.. చెప్పలేదు అంటుంది. దరణి కి అన్ని విషయాలు తెలుసు అని.. అయినా కూడా చెప్పట్లేదు అని , ఈ మధ్య ధరణి బాగా తెలివిమీరింది అని అనుకుంటుంది.
ఇక, మహేంద్ర, అనుపమ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. రిషిని వసు బాగానే చూసుకుంటుందని కానీ, నా దగ్గర ఉంటే ఆ ధైర్యం మరోలా ఉండేది అంటాడు. రౌడీలు మళ్లీ ఎటాక్ చేయాలని చూశారని మహేంద్ర అంటాడు.
Guppedantha Manasu
ఇంతలో భద్ర వచ్చి.. ఉద్యోగం మానేద్దాం అని అనుకుంటున్నాను అంటాడు. ఎందుకు అంటే.. నాకు మీరు ఏ పని చెప్పడం లేదని, అందుకే మానేద్దాం అనుకుంటున్నాను అని చెబుతాడు. ఖాళీ గా కూర్చొని డబ్బులు తీసుకోవడం తనకు ఇష్టం లేదని భద్ర అంటాడు. వసుధార మేడమ్ కి సెక్యూరిటీగా ఉండాలని మీరు చెప్పారని, ఇప్పుడు మేడమ్ లేరు కదా అని భద్ర అంటాడు. మేడమ్ ఉన్న దగ్గరే తాను కూడా ఉండి.. ఆమెకు సెక్యూరిటీగా ఉంటాను అని అడుగుతాడు.అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.