బిగ్ బాస్ షోలో అవకతవకలు... నాగార్జునను కలుస్తా అంటున్న శివాజీ, ఏం జరగనుంది?
బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన శివాజీ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నాడు. ఈ క్రమంలో సంచలన కామెంట్స్ చేస్తున్నాడు. షోలో అవకతవకలు జరుగుతున్నాయన్న శివాజీ, నాగార్జునని కలిసి కంప్లైంట్ చేస్తాను అంటున్నాడు.
Sivaji
బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన శివాజీ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నాడు. ఈ క్రమంలో సంచలన కామెంట్స్ చేస్తున్నాడు. షోలో అవకతవకలు జరుగుతున్నాయన్న శివాజీ, నాగార్జునని కలిసి కంప్లైంట్ చేస్తాను అంటున్నాడు.
![article_image2](https://static-ai.asianetnews.com/images/01hka8xvx7j9t84qpxgmc4s27q/amardeep--11--jpg_300x157xt.jpg)
బిగ్ బాస్ తెలుగు 7 ముగిసింది. కంటెస్టెంట్ శివాజీ పెద్దన్నగా వ్యవహరించాడు. ఆయన ఫస్ట్ వీక్ నుండి టైటిల్ ఫేవరేట్ గా ప్రచారం పొందారు. మెచ్యూరిటీ గేమ్ ఆడుతూ ఆడియన్స్ ని మెప్పించారు. చివరి వారాల్లో సమీకరణాలు మారిపోయాయి. టైటిల్ రేసులోకి అమర్ దీప్, పల్లవి ప్రశాంత్ దూసుకొచ్చారు.
హౌస్ నుండి బయటకు వచ్చాక శివాజీ ఇదే విషయం మీద ఆరోపణలు చేస్తున్నారు. చివరి వారాల్లో నన్ను తప్పుగా చూపించారు. ఎడిటింగ్ ద్వారా నన్ను విలన్ ని చేశారనేది శివాజీ ప్రధాన ఆరోపణ. కొందరిని లేపి, నన్ను తొక్కేశారని అంటున్నారు.
Bigg Boss Telugu 7
ఓ మీడియా ఛానల్ డిబేట్ లో పాల్గొన్న శివాజీ.. శోభ శెట్టితో జరిగిన గొడవ గురించి మాట్లాడాడు. ఆమె ఓవర్ గా మాట్లాడింది. నేను ఇన్ని వారాలు హౌస్లో ఉన్నాను. నేను మాట్లాడేది కరెక్ట్ అనుకుంది. ఆమె పరిధి దాటి మాట్లాడటంతో నేను నా ఇంట్లో ఆడపిల్ల అయితే పీక మీద కాలేసి తొక్కేవాడిని అన్నాను, అని వివరణ ఇచ్చారు.
సీరియల్ బ్యాచ్ ని స్టార్ మా కాపాడింది అనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై మీ అభిప్రాయం ఏమిటని అడగ్గా... స్టార్ మా తప్పు చేసిందంటే నేను నమ్మను. వాళ్ళ ప్రమేయం ఏమీ లేదు. అంతా బిగ్ బాస్ షో నిర్వాహకులే.
Sivaji
చివరి వారాల్లో ఒక వ్యక్తిని బాగా లేపుతున్నారు. నాకు అర్థం అయ్యింది. నేను గారెలు చేసినా ఒక్కసారి కూడా మెచ్చుకోలేదు. ఏమీ చేయకపోయినా ఆ వ్యక్తిని బాగా లేపారు. బిగ్ బాస్ ఎక్కువగా మాట్లాడుతూ ఉండేవాడు. తను చేసిన చిన్న చిన్న విషయాలను మెచ్చుకునేవాడు.
బిగ్ బాస్ షో టీమ్ లో ఉన్న ఒకరు ఇదంతా చేశారు. ఈ విషయం నేను బాబు గారి(నాగార్జున)తో చెప్పాలి అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఎంత మందికో జీవితం ఇచ్చారు. అలాంటి వ్యక్తికి చెడ్డపేరు రాకూడదు.
shivaji
బిగ్ బాస్ గొప్ప షో. మనుషులను మార్చేస్తుంది. నాలో కూడా చాలా మార్పు వచ్చింది. నాలో సహనం పెరిగింది. మీడియా సమావేశాల్లో కూడా కూల్ గా మాట్లాడుతున్నాను, అని శివాజీ చెప్పుకొచ్చాడు. మరి శివాజీ ఆరోపణలపై నాగార్జున రియాక్షన్ ఏంటో చూడాలి..