BrahmmaMudi 13th January Episode:కళ్యాణ్ దగ్గర మాట తీసుకున్న అనామిక, బిల్లు చూసి షాకైన కనకం, మూర్తి
ఎన్నో చోట్ల ట్రై చేసి చివరకు మీ బావగారికి ఫోన్ చేస్తే.. కవి గారికి తెలిసి అక్కడికి వచ్చారు. మీ పూజ పూర్తి కాకుండానే వచ్చారని తెలిసి నిజంగానే బాధపడ్డాను’ అని కావ్య చాలా మంచిగా చెబుతుంది.
Brahmamudi
BrahmmaMudi 13th January Episode: ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న అనామికు అర్జెంట్ గా రక్తం కావాల్సి వచ్చింది. అది రేర్ బ్లడ్ గ్రూప్ కావడం, తనది కూడా సేమ్ గ్రూప్ కావడంతో.. వ్రతంలో కూర్చున్నప్పటికీ దానిని వదిలేసి మరీ హాస్పిటల్ కి పరిగెత్తుతాడు. వెంటనే రక్తం ఇచ్చి.. అప్పూని ప్రమాదం నుంచి బయటపడేస్తాడు. అప్పూ ప్రమాదం నుంచి బయటపడటంతో.. కనకం, మూర్తిలు చేతులు నమస్కరించి మరీ కళ్యాణ్ కి థ్యాంక్స్ చెబుతారు. మీరు దేవుడిలా వచ్చి మా అమ్మాయిని కాపాడారు అని వాల్లు అంటే... కాదని, ఆ దేవుడు తన ఫ్రెండ్ ని కాపాడుకునే అవకాశం ఇచ్చాడు అని కళ్యాణ్ అంటాడు. అయితే.. పూజ మధ్యలో వచ్చారని, అది కూడా అప్పూకోసం వచ్చారని.. అనామిక బాధపడుతుందని కళ్యాణ్ ని వెళ్లమని కనకం అంటుంది. కానీ.. కళ్యాణ్ తాను చెప్పే వచ్చానని.. అర్థం చేసుకునేవాళ్లు చేసుకుంటారు అని అంటాడు.
కానీ, కనకం మాత్రం..గండం గట్టెక్కింది కదా, ఇక్కడ మేం ఉంటాం కదా అని కళ్యాణ్ ని వెళ్లమని కనకం చెబుతుంది. కావ్యను కూడా ఇంటికి వెళ్లమని మూర్తి అంటాడు. సరే అని.. కళ్యాణ్ తో కావ్య ఇంటికి వెళదాం అని చెబుతుంది. సరే అని.. ఏదైనా అవసరం ఉంటే చెప్పమని మరీ మరీ చెప్పి.. కళ్యాణ్ , కావ్యలు అక్కడి నుంచి బయలుదేరుతారు.
![article_image2](https://static-ai.asianetnews.com/images/01hm0dnw6kbb16v7syrzzet5rg/13jan-brah2-jpg_300x210xt.jpg)
Brahmamudi
దుగ్గిరాల ఇంట్లో అందరూ కూర్చొని ఎదురుచూస్తూ ఉంటారు. అప్పుడే కావ్య, కళ్యాణ్ లు వస్తారు. అది చూసి రుద్రాణి.. వచ్చింది మన ఇంటి మహాలక్ష్మి అని సెటైర్ వేస్తుంంది. తర్వాత.. ఇందిరాదేవి అప్పూకి ఎలా ఉంది అని కావ్యను అడుగుతుంది. ‘ క్షమించండి అమ్మమ్మ. సడెన్ గా ఫోన్ వచ్చేసరికి నా కాళ్లు, చేతులు ఆడలేదు. అందరితో చెప్పి బాధపెట్టడం ఎందుకులే అని వెళ్లిపోయాను’అని కావ్య అంటుంది. ‘ పర్వాలేదమ్మా.. ఎలా ఉంది అప్పూకి’ అని ఇందిరాదేవి అడుగుతుంది. ‘ కళ్యాణ్ గారు వచ్చి సమాయానికి అప్పూ ప్రాణాలు నిలపెట్టారు’ అని చెబుతుంది. ఆ మాటకు ఇంట్లో కొందరు సంతోషిస్తే.. కొందరి ముఖాలు మాత్రం మాడిపోతాయి. అనామిక ఫేస్ అయితే చాలా కోపంగా ఉండటంతో.. కావ్య అర్థం చేసుకొని అనామిక దగ్గరకు వెళ్తుంది. ‘ క్షమించు అనామిక , అక్కడ అప్పూకి బ్లడ్ అవసరం అవుతుందని నాకు తెలీదు. ఎన్నో చోట్ల ట్రై చేసి చివరకు మీ బావగారికి ఫోన్ చేస్తే.. కవి గారికి తెలిసి అక్కడికి వచ్చారు. మీ పూజ పూర్తి కాకుండానే వచ్చారని తెలిసి నిజంగానే బాధపడ్డాను’ అని కావ్య చాలా మంచిగా చెబుతుంది.
Brahmamudi
కానీ.. కావ్య వ్యతిరేక సంఘం ఊరుకోదు కదా. వెంటనే ధాన్యలక్ష్మి అందుకుంటుంది. ‘ నువ్వు సారీ చెబుతున్నావ్ ఏంటి..? ఈ ఇంట్లో ఏదైనా తలపెడితే.. నువ్వు అందులో తలపెడతావ్ కదా. అలా తలదూర్చి అన్నీ చెడగొట్టడం నీ జన్మ హక్కు కదా’ అని పుల్లవిరుపుడు గా మాట్లాడుతుంది. ‘ చిన్న అత్తయ్య అదేంటి.. అన్నీ తెలిసిన మీరే అలా మాట్లాడుతున్నారా.? అవతల మా చెల్లి ప్రాణాపాయంలో ఉంటే వెళ్లకుండా ఎలా ఉంటాను. అది కూడా తప్పు అంటే ఎలా?’ అని కావ్య ధీనంగా అడుగుతుంది. ధాన్యం మాత్రం.. ‘ నువ్వు మాట్లడకు. పూజ మొదలుకాకముందే దీపపు కుందు కిందపడేసి అపశకునం కలిగేలా చేశావ్, అప్పుడే అనుకున్నాను.’ అని తన అక్కసు మొత్తం మాటల్లో చూపిస్తుంది.
Brahmamudi
వెంటనే కళ్యాణ్.. ‘మమ్మీ.. వాంటెడ్ గా వదిన ఏమీ చేయలేదు. అక్కడ అప్పూ పూర్తిగా కోలుకోకముందే.. వదిన నన్ను బలవంతంగా తీసుకువచ్చింది’ అని కళ్యాణ్ చెబుతాడు. దానికి ధాన్యం.. ‘ ఓహో..ఈవిడ గారు బలవంతంగా తీసుకురాకపోయి ఉంటే., నువ్వు ఇంకా అక్కడే వార్డు బాయ్ లాగా ఉండిపోయేవాడివి అన్నమాట’ అని అంటుంది. వెంటనే రుద్రాణి అందుకోవాలని చూస్తుంది కానీ.. స్వప్న ఆపేస్తుంది. ‘ నువ్వు ఆపు.. ఇప్పటికే చాలా మాట్లాడావ్ , ఇంకొక్క మాట మాట్లాడితే.. అత్త వి అని కూడా చూడను. అసలు.. ఈ ఇంట్లో నీకే విలువ లేదు.. నీ మాటకు విలువ ఉంటుంది అనుకుంటున్నావా? నీకు నీ, కొడుక్కి మనుషుల్ని అర్థం చేసుకోవడం కూడా తెలుసా?’ అని అంటుంది. రుద్రాణి కోపంగా అరవబోతుంటే.. ఇందిరాదేవి ఆపుతుంది.
Brahmamudi
‘ ఇక్కడితో ఈ విషయాన్ని వదిలేస్తే మంచిది. జరిగింది ఏంటో అందరికీ తెలుసు. అక్కడ కళ్యాణ్ అవసరం ఉందని కూడా తెలుసు. పూజ ఈరోజు కాకపోతే ఇంకోసారి చేసుకోవచ్చు. కానీ ఒక మనిషి ప్రాణం పోతే తిరిగి వస్తుందా..? మానవత్వం చచ్చిపోయి మనుషులు మనుషులుగా మాట్లాడుకోవడం కూడా మానేస్తున్నారు. ఏం మనుషులు మీరు ’ అని ఇందిరాదేవి సీరియస్ అవుతుంది.
Brahmamudi
వెంటనే కళ్యాణ్ వెళ్లి అనామికకు సారీ చెబుతాడు.. నీ మనసు బాధపెట్టాను అంటాడు. దానికి అనామిక.. లోపల కోపంగా ఉన్నా బయటకు మాత్రం.. ‘ అయ్యో అలాంటిదేమీ లేదు కళ్యాణ్.. ఈ రోజు నువ్వు ఓ ప్రాణం నిలపెట్టావ్. నాకు అది చాలా సంతోషంగా ఉంది.’అని అంటుంది. వెంటనే ఇందిరాదేవి.. అనామికను మెచ్చుకుంటుంది. వాళ్లకు తొలిరాత్రి ఏర్పాట్లు చేయమని చెబుతుంది.
Brahmamudi
మరోవైపు హాస్పిటల్ లో.. కనకం, మూర్తి మాట్లాడుకుంటూ ఉంటారు. కళ్యాణ్ కి దూరంగా ఉండాలని అప్పూ అనుకుంటూ ఉంటే.. ఆ దేవుడు మరింత దగ్గర చేస్తున్నాడు అని కనకం ఫీలౌతుంది. మూర్తి.. అసలు అక్కడ కావ్య ఇంట్లో ఎంత గొడవ జరుగుతుందో అని భయపడతాడు. అదే సమయానికి స్వప్న.. దూరంగా వచ్చి కనకం కి ఫోన్ చేస్తుంది. అప్పూకి ఎలా ఉంది అని అడుగుతుంది. పర్వాలేదని డాక్టర్లు చెప్పారు అంటే... ‘ ఈ మాత్రం దానికి కావ్యకు ఫోన్ చేసి హడావిడి చేయాలా?’ అని అడుగుతుంది.
Brahmamudi
యాక్సిడెంట్ జరిగింది నీ చెల్లికే..కాస్త అయినా కనికరం చూపించు అని కనకం అంటుంది. ‘ నేను కనికరం చూసినా.. ఇక్కడ మా వాళ్లు కావ్యపై కారాలు, మిర్యాలు నూరుతున్నారు.’ అని చెబుతుంది. ఏమైంది అని కనకం అడిగితే.. పూజ ఆగిపోయిందని.. కావాలనే కావ్య ఇదంతా చేసింది అని తిడుతున్నారని, ఇలాంటివి ఏమైనా జరిగితే.. కాస్త చూసుకొని కావ్యకు చెప్పండి.. ఇక్కడ అందరూ దానినే తప్పు పడుతున్నారు అని , అప్పూని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి స్వప్న ఫోన్ పెట్టేస్తుంది.
Brahmamudi
ఏమైంది కనకం అని మూర్తి అడిగితే.. మీరు భయపడిందే జరిగిందని, కళ్యాణ్ ఇక్కడికి రావడానికి కావ్యే కారణం అని అందరూ తప్పు పడుతున్నారంట అని కనకం చెబుతుంది. కళ్యాణ్ వచ్చి అప్పూ ప్రాణాలు కాపాడాడని సంతోషపడాలో, లేక మన వల్ల కావ్య ఇబ్బందుల్లో పడుతుందని బాధపడాలా అని మూర్తి బాధపడతాడు. వెంటనే నర్స్ వచ్చి.. మిమ్మల్ని డాక్టర్ పిలుస్తున్నారని చెబుతుంది. సరే అని కనకం, మూర్తి వెళతారు.
‘పేషెంట్ కండిషన్ ఇప్పుడు నార్మల్ అయ్యింది. డిశ్చార్జ్ చేస్తున్నాం. ఫీజు కట్టి తీసుకువెళ్లండి’ అని డాక్టర్ చెబుతుంది. మా అమ్మాయిని కాపాడినందుకు థ్యాంక్స్ అని కనకం చెబుతుంది. నాకు కూడా.. రక్తం ఇఛ్చిన అబ్బాయికి చెప్పండి అని డాక్టర్ చెప్పి.. రెండు రోజుల తర్వాత.. కట్లు విప్పుతాం , అప్పుడు హాస్పిటల్ కి తీసుకురమ్మని చెబుతుంది. సరే అంటారు.
Brahmamudi
సీన్ కట్ చేస్తే... అనామిక తన బెడ్రూమ్ లో కూర్చొని కోపంగా ముఖం తిప్పుతూ ఉంటుంది. అప్పుడే కళ్యాణ్ వస్తాడు. కానీ.. అనామిక అలిగి పక్కకు తిరిగి పడుకుంటుంది. ‘నాకు తెలుసు అనామిక. అందరి ముందు నన్ను బాధపెట్టకూడదని నువ్వు సపోర్ట్ చేసినా, నీ మనసులో బాధ ఉందని నాకు తెలుసు’ అని కళ్యాణ్ అంటాడు. ‘ బాధపడకుండా ఎలా ఉంటాను కళ్యాణ్. ప్రతి అమ్మాయి జీవితంలో జరిగే వ్రతం ఇది. దీనినే వదిలేసి వెళ్లిపోయావ్’ అని అనామిక అంటుంది. తనను మళ్లీ పట్టించుకోవడం లేదని సీరియస్ అవుతుంది. తనకు మాత్రమే ప్రయారిటీ ఇవ్వలేదని కాసేపు రాద్దాంతం చేస్తుంది. వెంటనే వాళ్ల అమ్మ మాటలు గుర్తొచ్చి ఆగిపోతుంది. నీ మొగుడిని నీ కొంగున కట్టుకోమని వాళ్ల అమ్మ చెప్పిన మాట గుర్తొచ్చి.. వెంటనే మంచిదానిలా మారినట్లు మాట్లాడుతుంది. పూజ మళ్లీ చేసుకుందాం అని కళ్యాణ్ అంటే.. నాకు కావాల్సింది అది కాదని.. ప్రతి విషయంలోనూ నువ్వు నాకు ఇంపార్టెన్స్ ఇవ్వాలని అడుగుతుంది. కళ్యాణ్ సరేనని.. మాట ఇస్తాడు. నాకు నవ్వు తప్ప.. ఇంకెవరూ ముఖ్యం కాదు అని కళ్యాణ్ చెబుతాడు. ఈ ఒక్కదానితో.. అప్పూకి నిన్ను దూరం చేస్తాను అని అని అనామిక అనుకుంటుంది.
Brahmamudi
ఇక, కనకం, మూర్తి హాస్పిటల్ బిల్ కట్టడానికి వెళ్తారు. బిల్ చూసి వీళ్ల గుండె ఆగినంత పని అవుతుంది. రూ.లక్షా,20వేలు అని చెబుతారు. కావ్యను అడుగుదామా అని కనకం అంటే... ఇప్పటికే కావ్య పడుతున్న బాధలు చాలని, వద్దు అని మూర్తి అంటాడు. మరి బిల్ ఎలా కట్టాలని వాళ్లు బాధపడుతూ ఉంటారు.
మరోవైపు రాజ్ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. కావ్య రాగానే.. మళ్లీ మాట్లాతాను అని పెట్టేస్తాడు. దానికి కావ్య నానా రాద్దాంతం చేస్తుంది. నా ముందు ఫోన్ మాట్లాడుకోకూడదా అని ఏవేవో మాట్లాడుతుంది.కావ్య ఎందుకు ఇలా మాట్లాడుతుందో.. రాజ్ కి అర్థం కాదు. పూజ ఆగిందని ఆ ఉక్రోశం మొత్తం నా మీద చూపిస్తున్నావ్ కదా అని రాజ్ అంటాడు. అయితే.. ఇది ఇక్కడి ఉక్రోశం కాదని.. మళ్లీ భారీ డైలాగులు కొడుతుంది. శ్వేతను ఉద్దేశించి..కావ్య అలా మాట్లాడుతుంది. విసుగగుపుట్టి.. రాజ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
Brahmamudi
బిల్ ఎలా కట్టాలని కనకం ఆలోచిస్తూ ఉంటుంది. అంత డబ్బు మా ఆయన ఎలా తెస్తాడా అని ఎదురుచూస్తూ ఉంటుంది. కానీ.. ఎక్కడ ప్రయత్నించినా డబ్బులు దొరకలేదని మూర్తి చెబుతాడు. ఎవరూ అప్పూ ఇవ్వలేదని మూర్తి బాధగా చెబుతాడు. ఉన్న బంగారం కూడా స్వప్న కోసం అమ్మేశానని కనకం ఫీలౌతుంది. ఇంతలో వాళ్లని అప్పూ పిలుస్తుంది. కళ్యాణ్ కి ఎందుకు చెప్పారు అని అడుగుతుంది. కావాలని చెప్పలేదని.. రాజ్ కి చెబుతుంటే.. కళ్యాణ్ విని రక్తం ఇవ్వడానికి వచ్చాడని మూర్తి చెబుతాడు. ఎంత దూరంగా ఉందామన్నా.. మళ్లీ కలిసేలా దేవుడు చేస్తున్నాడని.. అక్కడ కావ్య అక్క మాటలు పడుతుందేమో అని అప్పూ బాధపడుతుంది. మనకు ఎంత అవసరం , కష్టం వచ్చినా.. ఇక నుంచి కళ్యాణ్ కి మాత్రం చెప్పొద్దు.. మన చావు ఏదో మనమే చద్దాం అని అప్పూ అంటుంది. అయితే.. ఇవన్నీ ఆలోచించొద్దు అని మూర్తి చెబుతాడు.
అప్పుడే నర్స్ వచ్చి.. డిశ్చార్జ్ రాశారు కదా ఇంకా ఎందుకు వెళ్లలేదు? అని అడుగుతుంది. బిల్ కట్టలేదు అని కనకం అంటే... మీ అల్లుడు రాజ్ వచ్చి మేనేజర్ ని పంపి కట్టారని నర్స్ చెబుతుంది. ఆ మాట విని కనకం సంతోషపడుతుంది.
కమింగ్ అప్ లో.. ‘ నా కొడుకు, కోడలు సంతోషంగా ఉండాలంటే.. వాళ్ల శోభనం విషయంలో తలదూర్చుకు అని ధాన్యలక్ష్మి కావ్య దగ్గర మాట తీసుకుంటుంది. కానీ.. అనామిక తన మీద కోపంతోనే ఈ పనులు ఏమీ చేయడం లేదు అని తిట్టుకుంటుంది’ మళ్లీ ఈ తంతు కమింగ్ ఎపిసోడ్ లో చూద్దాం..