BrahmaMudi 12th January Episodeస్నేహానికి అర్థం చెప్పిన కళ్యాణ్, వ్రతం మధ్యలో వెళ్లి అప్పూని బతికించాడు
ఇందాకటి నుంచి ఇష్టం వచ్చినట్లు అందరూ మాట్లాడారని, సొంత చెల్లికి యాక్సిడెంట్ అయితే అంత కంటే పెద్ద కారణం ఇంకేమైనా కావాలా..? ఒక అక్కకి వెళ్లడానికి అని రాజ్ అంటాడు.
Brahmamudi
BrahmaMudi 12th January Episode: కావ్య అర్జెంట్ పనిమీద బయటకు వెళ్లడంతో... కావ్య వచ్చే వరకు వ్రతం ఆపుదాం అని కుటుంబ సభ్యులంతా అంటారు. చాలా సేపు కూర్చొని ఎదురుచూసిన తర్వాత అనామికకు విసుగు వచ్చి పైకి లేస్తుంది. ఏమైంది అంటే..కావ్యకు వ్రతం జరగడం ఇష్టం లేదని, తనుకు ఇష్టం లేకుండా.. వ్రతం జరిపించడం అవసరమా అంటుంది. అసలు ఇంట్లో జరిపించే వ్రతం కంటే.. ముఖ్యమైన పని ఉంటుందా..? ఉంటే ఇంట్లో అందరికీ చెప్పే వెళ్లాలి కదా అని అనామిక అంటుంది. అయితే.. భర్తకు చెబితే అందరికీ చెప్పినట్లే అని ఇందిరాదేవి అంటుంది. అంతేకాదు.. రాజ్ బావగారు అవుతారని.. ఇలా అందరి ముందు బావగారిని ప్రశ్నించకూడదు అని ఇందిరాదేవి అనామికకు క్లాస్ పీకుతుంది.
![article_image2](https://static-ai.asianetnews.com/images/01hkrveed2sq6reqtckjtcthyd/10th-jan-brah10-jpg_300x234xt.jpg)
Brahmamudi
అయితే.. ఇందిరాదేవి సపోర్ట్ ఉండటంతో కావ్య చెలరేగిపోతోందని, కొంచెం కూడా బాధ్యతగా ఉండటం లేదని, మీరు మాత్రం ఇంకా వెనకేసుకొస్తున్నారని ధాన్యలక్ష్మి తన అత్తగారు ఇందిరాదేవిని ప్రశ్నిస్తుంది. వెంటనే రుద్రాణి అందుకుంటుంది. ధాన్యం, అనామిక అన్నదాంట్లో తప్పేమి ఉందని, మనసులో చెడు ఉద్దేశం లేకపోతే.. ఎందుకు వెళ్లిపోతుంది అని ప్రశ్నిస్తుంది. సరిగ్గా పూజ మొదలయ్యే టైమ్ కే ఎందుకు వెళ్లింది..? పూజ ఆగాలనే కదా..? మనసులో అంత కళ్లు ఉండకూడదుు అని రుద్రాణి అనేసరికి రాజ్ కి విపరీతమైన కోపం వస్తుంది. వెంటనే అత్తా అని కోపంగా అరుస్తాడు.
Brahmamudi
‘ఎవరు ఇష్టం వచ్చినట్లు వారు కళావతి గురించి తక్కువ చేసి మాట్లాడతారేంటి? కళ్లు అనేది కళావతికి ఎప్పుడూ లేదు. ఎంత అర్జెంట్ అయితే, ఎంత అవసరం అయితే.. ఇంట్లో వ్రతం పెట్టుకొని బయటకు వెళ్లి ఉంటుంది. ఆ మాత్రం కామన్ సెన్స్ లేని వ్యక్తి ఏం కాదు’ అని రాజ్ అంటాడు. మరి.. ఎందుకు వెళ్లింది అని అపర్ణ అడిగితే...బలమైన కారణం ఉందని రాజ్ అంటాడు. ఆ కారణం ఏంటని సుభాష్ అడుగుతాడు.. అయితే కావ్య చెప్పొద్దు అన్నదని రాజ్ అంటే.. చెప్పకపోతే అందరూ నిందలు వేస్తున్నారు కదా అని సుభాష్ అంటాడు.
Brahmamudi
కావ్యను ఎవరూ తక్కువ చేసి మాట్లాడటం తనకు ఇష్టం లేదని ఇందిరాదేవి కూడా అంటుంది.. భార్యను ఎదైనా అంటే అందరి ముందు సీరియస్ అవ్వడం కాదు.. అంత తప్పనిసరి పరిస్థితి ఏం వచ్చింది అని రుద్రాణి వెంటకారంగా అడగగా.. తప్పనిసరి పరిస్థితే వచ్చిందని రాజ్ అంటాడు. చాలా సేపటి తర్వాత అప్పూకి యాక్సిడెంట్ అయ్యిందనే అసలు విషయాన్ని రాజ్ బయటపెడతాడు. హాస్పిటల్ లో జాయిన్ చేశారని, అందుకే కావ్య వెళ్లిందని చెబుతాడు. ఈ విషయం తెలిస్తే.. పూజ ఆగిపోతుందని, అందుకే చెప్పొద్దని అందని, ఇంతకంటే బలమైన కారణం కావాలా అని రాజ్ ఇంట్లో అందరినీ అడుగుతాడు. ఇందాకటి నుంచి ఇష్టం వచ్చినట్లు అందరూ మాట్లాడారని, సొంత చెల్లికి యాక్సిడెంట్ అయితే అంత కంటే పెద్ద కారణం ఇంకేమైనా కావాలా..? ఒక అక్కకి వెళ్లడానికి అని రాజ్ అంటాడు.
Brahmamudi
అది విని కళ్యాణ్ షాకౌతాడు. అప్పూకి యాక్సిడెంట్ అయ్యిందని నాకు ఎందుకు చెప్పలేదని బాధపడతాడు. దానికి అనామిక.. ఇక్కడ ఎవరికీ చెప్పలేదు, స్పెషల్ గా నీ దగ్గర దాయలేదు అంటుంది. కానీ.. కళ్యాణ్ మాత్రం..ఇప్పుడు తెలిసింది కదా... నా ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయితే.. నేను ఇక్కడ ఉండటం ఏంటి? తన పరిస్థితి ఎలా ఉందో.. పద అన్నయ్య వెళ్దాం అని కళ్యాణ్ అంటాడు. కానీ రాజ్ ఆపుతాడు. నువ్వు పూజలో కూర్చోకపోతే.. అందరూ మళ్లీ కళావతినే అంటారని, తనను జీవితాంతం క్షమించరని, వాళ్ల తిప్పలు వాళ్లు పడతారు.. మీరు వ్రతం చేయండి అని రాజ్ చెబుతాడు.
కానీ, కళ్యాణ్ వినడు. అప్పూకి యాక్సిడెంట్ అయితే మనం ఇక్కడ ఉండటం ఏంటి? ఎలా ఉండగలుగుతాం అని అంటాడు... రాజ్ నచ్చచెబుతాడు. కావ్య అన్నీ చూసుకోగలదని, ఎదైనా అవసరం అయితే ఫోన్ చేయమని చెప్పానని రాజ్ అంటాడు. ఇంట్లో అందరూ కూడా కళ్యాణ్ కి సర్ది చెప్పాలని చూస్తారు. ఏదైనా అవసరం అయితే.. తామంతా ఉన్నామని, ఇలా పూజ వదిలేసి వెళ్లడం కరెక్ట్ కాదు అని చెబుతూ ఉంటారు.
Brahmamudi
వెంటనే స్వప్న.. అప్పూ నా చెల్లెలే కదా.. కనీసం అయ్యో అని కూడా అనడం లేదు, నీకు మీ అమ్మ కి మీరు బాగుంటే చాలు అని రాహుల్ పై కౌంటర్ వేస్తుంది. మరి, నువ్వు పరిగెత్తుకుంటూ ఎందుకు వెళ్లలేదు అని రాహుల్ అంటాడు. నిన్ను చేసుకుంటే నా పరిస్థితి అంతేనని, కనీసం ఆటోకి కూడా డబ్బులు ఇవ్వలేవు అని కౌంటర్ ఇస్తుంది. కానీ.. తాను వెళ్లను అని.. తన చెల్లికి బాలేనప్పుడు నేను సంతోషంగా పూజలో కూర్చోలేనని చెబుతుంది. అనామిక, కళ్యాణ్ లను పూజలో కూర్చోమని చెబుతుంది. ఇప్పుడు నువ్వు పూజ చేయకుండా అప్పూ కోసం వెళితే.. నీ భార్య సూట్ కేసు సర్దుకొని పుట్టింటికి వెళ్లినా వెళ్తుందని చాలా కరెక్ట్ గా స్వప్న మాట్లాడుతుంది. ఆ నిందలు కూడా మాకెందుకులే అని స్వప్న అంటుంది.
Brahmamudi
తర్వాత... కావ్య వ్యక్తిత్వాన్ని సుభాష్ మెచ్చుకుంటాడు. కావ్యను తిట్టిన వారందరికీ కౌంటర్లు వేస్తాడు.తర్వాత.. కళ్యాణ్ ని పూజకు కూర్చోమని చెబుతాడు. అందరూ చెప్పడంతో కళ్యాణ్ పూజకు కూర్చుంటాడు. మరోవైపు కావ్య.. బ్లడ్ కోసం అందరికీ ఫోన్లు చేస్తూ ఉంటుంది. కానీ... ఎక్కడా అప్పూ బ్లడ్ గ్రూప్ బ్లడ్ దొరకదు. అందరూ, అన్ని ప్రయత్నాలు చేసినా బ్లడ్ దొరకదు. అయితే.. వెంటనే బ్లడ్ ఎక్కించకపోతే.. పేషెంట్ కోమాలోకి వెళ్లిపోతుందని డాక్టర్ వచ్చి వార్నింగ్ ఇస్తుంది.
Brahmamudi
ఇప్పుడు ఉన్న పరిస్థితిలో రాజ్ తప్ప మరెవరూ మనకు సహాయం చేయరని.. రాజ్ కి ఫోన్ చేయమని కనకం అంటుంది. చేస్తానమ్మా అని కావ్య పక్కకు వెళ్లుంది. కళ్యాణ్ పేరుకు పూజలో కూర్చుంటాడు తప్ప.... మనస్ఫూర్తిగా చేయలేడు. సరిగ్గా అప్పుడే రాజ్ కి ఫోన్ వస్తుంది.
Brahmamudi
అయితే.. రాజ్ దగ్గర ఫోన్ లాక్కొని కళ్యాణ్ మాట్లాడతాడు. కావ్య.. రాజ్ అనుకొని.. అప్పూకి రక్తం కావాలి అనే విషయాన్ని చెబుతుంది. తాను మొత్తం ప్రయత్నించినా.. బ్లడ్ దొరకలేదని, ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ కావాలి అని అంటుంది. అది విన్న కళ్యాణ్.. సేమ్ తనది కూడా ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అని.. నేను వస్తాను అని చెబుతాడు. తర్వాత.. అందరికీ చెబుతాడు.. రాజ్, ధాన్యలక్ష్మి ఆపాలని చూసినా కళ్యాణ్ వినడు. తాను రక్తం ఇవ్వాల్సిందే అంటాడు. ఇప్పటి వరకు ఆగింది కూడా కేవలం అనామికను బాధపెట్టకూడదని చెబుతాడు. పాప పుణ్యాలు దేవుడు చూసుకుంటాడు అని చెప్పి కళ్యాణ్ వెళ్లిపోతాడు. అనామిక ఆపాలని చూసినా కళ్యాణ్ ఆగడు.
Brahmamudi
కళ్యాణ్ వెళ్లగానే.. ఇప్పడైనా అర్థమైందా అత్తయ్య అని ధాన్యలక్ష్మి మళ్లీ కావ్య, అప్పూలదే తప్పు అన్నట్టుగా మాట్లాడాలని చూస్తుంది. కానీ.. మనలో ఎవరికీ మానవత్వం లేదని ఇందిరాదేవి అంటుంది. సుభాష్ కూడా కళ్యాణ్ చేసిన పనిని సమర్థిస్తాడు. ఇంటి కోడలికి కష్టం వస్తే.. ఒక్కరు కూడా స్పందించలేదని.. కళ్యాణ్ బంధువులా కాకుండా.. ఆత్మ బంధువులా వెళ్లాడని అప్పూకి ప్రాణాలు పోసి తిరిగి వస్తాడని, ఇది ఎవరి ఇష్టాలకు సంబంధించిన విషయం కాదని, ఒక ప్రానానికి సంబంధించిన విషయం అని, కళ్యాణ్ వచ్చేవరకు ఎదురుచూద్దాం అని అంటాడు.
కళ్యాణ్ హాస్పిటల్ కి చేరుకుంటాడు. అప్పూకి ఎలా ఉందని అడుగుతాడు. రక్తం అవసరం అని.. ప్రాణ దానం చేయమని, కాళ్లు పట్టుకుంటామని మూర్తి అంటాడు. తర్వాత కళ్యాణ్ ని రక్తం ఇవ్వడానికి లోపలికి తీసుకువెళ్తుంది కావ్య. పూజ ఆగిపోతే అనామిక బాధపడుతుందని కావ్య అంటే.... దేవుడు ఎక్కడికీ పోడని, పూజ ఈ రోజు కాకుంటే.. రేపు అయినా చేసుకోవచ్చు అంటాడు. కానీ.. అప్పూకి ఈ రోజే అవసరం ఉందని.. తాను ఇప్పుడు రక్తం ఇవ్వకుంటే.. తమ స్నేహానికే అర్థం ఉండదు అంటాడు. కళ్యాణ్ రక్తం ఇవ్వగానే.. అప్పూకి ఎక్కిస్తారు.
Brahmamudi
తర్వాత దూరం నుంచి అప్పూని చూస్తూ.. కళ్యాణ్ ఎమోషనల్ అవుతాడు. తిట్టడానికైనా త్వరగా కోలుకోని రమ్మని అంటాడు. మరోవైపు దుగ్గిరాల ఇంట్లో అందరూ పూజ దగ్గగర కళ్యాణ్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అక్కడ కూడా రుద్రాణి రచ్చ చేయాలని చూస్తుంది. అనామికలో విషం నింపాలని చూస్తుంది. కావ్యను అందరూ బతకమ్మలా మెస్తారని..అనామికను మాత్రం అనామకురాలిని చేశారు అంటూ దెప్పొ పొడుస్తుంది. ఇదంతా కావ్య కూడా కావ్య ప్లానేనని అర్థం వచ్చేలా రుద్రాణి అంటుంది. ధాన్యలక్ష్మి కూడా.. నిజంగా ఇది కావ్య ప్లానే అని మాట్లాడుతుంది. వెంటనే అపర్ణ కూడా వత్తాసు పలుకుతుంది.
మరోసారి రాజ్.. కావ్యకు సపోర్ట్ గా మాట్లాడతాడు. మీ కళ్ల ముందే కదా.. కావ్య నాకు ఫోన్ చేసిందని...కళ్యాణ్ ఫోన్ లాక్కొని మాట్లాడాడని.. రేర్ బ్లడ్ గ్రూప్ కాబట్టి.. ఎక్కడా దొరకకపోవడం వల్లే ఫోన్ చేసిందని, రక్తం ఇవ్వడానికి కళ్యాణ్ వెళ్లాడని.. అంతా చూసిన తర్వత కూడా కావ్యపై నిందలు వేయడం కరెక్ట్ కాదని రాజ్ అంటాడు. సుభాష్.. వెంటనే ఆడవారి అందరినీ కుక్క తోకతో పోల్చి సెటైర్ వేస్తాడు. ఇందిరాదేవి.. కళ్యాణ్ ని మెచ్చుకుంటుంది. ప్రాణదానం చేయడానికి వెళ్లాడని, దేవుడి ఆశీస్సులు ఉంటాయి అని, ఇంతకన్నా గొప్ప దైవ కార్యం మరోటి లేదని అంటుంది. తర్వాత పంతులుగారు.. పూజ సమయం అయిపోయింది అని చెప్పి వెళ్లిపోతాడు.
Brahmamudi
మరోవైపు... అప్పూకి ప్రమాదం తప్పిందని డాక్టర్లు చెబుతారు. కమింగప్ లో కావ్య, కళ్యాణ్ లు ఇంటికి చేరుకుంటారు. అప్పూ ప్రమాదం నుంచి బయటపడిందని చెబుతారు. తర్వాత.. ఎప్పటిలాగానే కావ్య కారణంగానే పూజ ఆగిపోయిందని.. ధాన్యలక్ష్మి కావ్యను తిడుతుంది.