- Home
- Entertainment
- TV
- రష్మికకు గుండు చేయిస్తానన్న జబర్దస్త్ కమెడియన్... ఆమె మొక్కుల కోసం స్టార్ యాంకర్ బలి
రష్మికకు గుండు చేయిస్తానన్న జబర్దస్త్ కమెడియన్... ఆమె మొక్కుల కోసం స్టార్ యాంకర్ బలి
ఎక్స్ట్రా జబర్దస్త్ షోకి రష్మీ గౌతమ్ ప్రధాన ఆకర్షణ. అమ్మడు ఈ మధ్య డబుల్ మీనింగ్ జోక్స్ తో రచ్చ చేస్తుంది. తాజా ఎపిసోడ్లో ఆమె శోభనం రాత్రి మీద వేసిన జోక్ వైరల్ అవుతుంది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Rashmi Gautam
జబర్దస్త్ లెజెండరీ కామెడీ షో అనడంలో సందేహం లేదు. జబర్దస్త్ సక్సెస్ నేపథ్యంలో ఎక్స్ట్రా జబర్దస్త్ కూడా తెరపైకి తెచ్చారు. ఈ రెండు షోలు బుల్లితెరపై చరిత్ర సృష్టించాయి. అనసూయ, రష్మీ, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, హైపర్ ఆది, రామ్ ప్రసాద్, చమ్మక్ చంద్ర... ఇంకా ఎందరో స్టార్స్ గా ఎదిగారు. కనీస గుర్తింపు లేని వాళ్లకు ఈ షో స్టార్ హోదా తెచ్చిపెట్టింది.
Rashmi Gautam
కాగా జబర్దస్త్ ప్రారంభంలో డబుల్ మీనింగ్ జోక్స్ ఎక్కువగా ఉండేవి. వ్యతిరేకత వ్యక్తం కావడంతో డోసు తగ్గించారు. టీమ్ లీడర్స్ కి అడల్ట్ జోక్స్ లేకుండా చూసుకోవాలని సూచించడం జరిగింది. దాంతో జబర్దస్త్ షోలో చాలా మేరకు డబుల్ మీనింగ్ కంటెంట్ తగ్గించారు.
Rashmi Gautam
జబర్దస్త్ లో ఒకప్పటి స్టార్స్ లేరు. అనసూయ, రోజా, నాగబాబు, హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీనుతో పాటు పలువురు స్టార్స్ షోని వీడారు. ఈ క్రమంలో ఆదరణ తగ్గింది. ఇప్పుడు జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ లో చేస్తున్న కమెడియన్స్ లో చాలా మంది కొత్తవాళ్లే. గతంలో మాదిరి క్వాలిటీ కామెడీ లేదు.
Rashmi Gautam
ఒకప్పుడు టీఆర్ఫీలో టాప్ లో ఉన్న జబర్దస్త్ క్రిందకు పడిపోయింది. మల్లెమాల సంస్థకే చెందిన శ్రీదేవి డ్రామా కంపెనీ సత్తా చాటుతుంది. అక్కడ హైపర్ ఆది ఉండటం ప్లస్ అవుతుంది. జబర్దస్త్ కి ఆదరణ తగ్గుతున్న క్రమంలో అడల్ట్ జోక్స్ మరలా వాడేస్తున్నారనిపిస్తుంది.
Rashmi Gautam
తాజా ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమో గమనిస్తే... కమెడియన్ లక్ష్మణ్ శోభనం స్కిట్ చేశాడు. పక్కన ఉన్న కమెడియన్ 'శోభనం రోజు ఏం చేయాలన్నా?' అని లక్ష్మణ్ ని అడిగాడు. 'ఏం లేదురా పాలు నువ్వు కొంచెం తాగు... ఆమెకు కొంచెం తాగించు. మళ్ళీ నువ్వు కొంచెం తాగు, ఆమెకుతాగించూ..'. అని చెబుతుండగా... మధ్యలో కల్పించుకున్న రష్మీ ఇక తెల్లార్లు అదే చేస్తారా... అని అసహనం వ్యక్తం చేసింది.
Rashmi Gautam
ఆమె కౌంటర్ జోక్ కి కమెడియన్ లక్ష్మణ్... 'నీకు అంత ఆవేశం ఏంటి అక్కా', అని సెటైర్ వేశాడు. జడ్జెస్, జబర్దస్త్ కమెడియన్స్ గట్టిగా నవ్వేశారు. ఈ ఎపిసోడ్లో బుల్లెట్ భాస్కర్, నరేష్ స్కిట్ కూడా డబుల్ మీనింగ్స్ జోక్స్ తో నిండి ఉంది.
ఇక ఆఫ్ స్క్రీన్ కపుల్ రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత ఒక స్కిట్ చేశారు. విపరీతమైన భక్తి కలిగిన భార్యగా సుజాత నటించింది. 'నీ వల్ల కాలనీ వాళ్ళందరూ ఇబ్బందులు పడుతున్నారే... మొన్న రష్మీకు గుండు చేయిస్తానని మొక్కుకుంది' అని రాకింగ్ రాకేష్ అన్నాడు. ఆ డైలాగ్ కి రష్మీ షాక్ అయ్యింది.
Rashmi Gautam
ఈ మధ్య కాలంలో చూస్తున్న జబర్దస్త్ కంటెంట్ లో అడల్ట్ కామెడీ డోస్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. మరోవైపు జబర్దస్త్ షో ఆపేస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. కనీస టీఆర్పీ రాబడుతున్న జబర్దస్త్ షోకి తెరదింపే అవకాశాలు తక్కువే. 2013లో మొదలైన జబర్దస్త్ పదేళ్లు పూర్తి చేసుకుంది..