చిరంజీవి, ఎన్టీఆర్ లను కలిసిన తెలంగాణ మంత్రి పువ్వాడ... సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్
తెలంగాణా రాష్ట్ర ట్రాన్స్ పోర్ట్ మినిస్టర్ పువ్వాడ అజయ్ కుమార్ చిరంజీవి, ఎన్టీఆర్ లను తమ తమ నివాసాలలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. పువ్వాడ అజయ్ కుమార్ కుమారుడైన నయన్ పువ్వాడ బర్త్ డే నేపథ్యంలో చిరంజీవి, ఎన్టీఆర్ లను వీరు కలిసినట్లు తెలుస్తుంది.
మొదట ఎన్టీఆర్ నివాసానికి వెళ్లిన పువ్వాడ అజయ్ కుమార్ పూల గుచ్ఛం చేతికి ఇచ్చి, శాలువా వేసి సత్కరించారు. కుమారుడు నయన్ తో ఎన్టీఆర్ ప్రేమగా ముచ్చటించడం జరిగింది.
ఎన్టీఆర్ 30వ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న కొరటాల శివ కూడా వీరితో ఉన్నారు. అధికార పార్టీ మంత్రి సినీ ప్రముఖులను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
అనంతరం చిరంజీవి నివాసానికి చేరుకున్న పువ్వాడ అజయ్ కుమార్ అక్కడ నయన్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. నయన్ బర్త్ డే కేక్ కట్ చేయడం జరిగింది.
మంత్రి కుమారుడు నయన్ కి కేక్ తినిపించిన చిరంజీవి బెస్ట్ విషెష్ తెలియజేశారు. అలాగే చిరంజీవిని మంత్రి అజయ్ కుమార్ సత్కరించినట్లు సమాచారం.
టాలీవుడ్ కి చెందిన చిరంజీవి, ఎన్టీఆర్ లను మాత్రమే మంత్రి అజయ్ కుమార్ కలవడం ఆసక్తి రేపుతోంది.
మరో వైపు ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. రెండు సాంగ్స్ మినహా షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తుంది.
అలాగే చిరంజీవి ఆచార్య షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఆచార్య చిత్రీకరణ సైతం చివరి దశలో ఉండగా, సాధారణ పరిస్థితులు ఏర్పడిన వెంటనే విడుదల కానుంది.