ఈ హీరోయిన్లు ఓవర్ నైట్ స్టార్స్.. త్రిష, సమంత, రష్మిక, సాయిపల్లవి, కృతి శెట్టి..
సినిమా హిట్ అంటే ఓవర్నైట్లో తారల కెరీర్ మారిపోతుంది. స్టార్ ఇమేజ్ వచ్చేస్తుంది. `ఏ మాయ చేసావె`తో సమంత ఓవర్నైట్లో స్టార్గా ఎదిగింది. ఇలా త్రిష, సాయిపల్లవి, రష్మిక మందన్నా, కృతి శెట్టి, ఆర్తి అగర్వాల్, శ్వేత బసు ప్రసాద్ వంటి తారలు ఓవర్నైట్లో స్టార్స్ గా మారిపోయారు.
సమంత నేడు తన 34వ పుట్టిన రోజుని జరుపుకుంటోంది. దీంతో ఈ అమ్మడి సందడే సోషల్ మీడియా మొత్తం రన్ అవుతుంది. అయితే ప్రస్తుతం అగ్ర నటిగా, స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న సమంత ఓవర్ నైట్లో స్టార్ ఇమేజ్ని సొంతం చేసుకుంది.
అవును సమంత నటించిన తొలి చిత్రం `ఏ మాయ చేసావె` చిత్ర సక్సెస్ ఆమెని ఓవర్నైట్లో స్టార్ని చేసింది. ఆ సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీ చూపుని తనవైపు తిప్పుకుంది. ఎన్టీఆర్, మహేష్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించే అవకాశాలు అందుకుంది.
సమంతతోపాటు రష్మిక మందన్నా, సాయిపల్లవి, కృతి శెట్టి, త్రిష, ఆర్తి అగర్వాల్, శ్వేత బసు ప్రసాద్ కూడా తెలుగులో ఓవర్ నైట్లో స్టార్స్ అనిపించుకున్నారు. ఆ విశేషాలేంటో చూద్దాం.
సమంత మాదిరిగానే టాలీవుడ్, శాండల్ వుడ్, కోలీవుడ్, బాలీవుడ్ క్రేజీ బ్యూటీ రష్మిక మందన్నా. ఈ అమ్మడు తెలుగులోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందు కన్నడలో రెండు సినిమాలు చేసింది. అక్కడ మంచి గుర్తింపు వచ్చింది. తెలుగులోకి వచ్చిన `ఛలో` చిత్రంతోనే అందరి దృష్టిని ఆకర్షించింది.
ఇక తెలుగులో చేసిన రెండో చిత్రం `గీతగోవిందం`తో ఈ అమ్మడి రేంజే మారిపోయింది. ఒక్కసారిగా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంది. ఇందులో అద్భుతమైన నటనతో మెప్పించింది రష్మిక. విజయ్ దేవరకొండతో దీటుగా నటించింది. ఇంకా చెప్పాలంటే సినిమా మొత్తం ఈ అమ్మడి చుట్టూతే తిరుగుతుంది. అంతగా ఆకట్టుకుని టాలీవుడ్ ఆడియెన్స్ ని ఫిదా చేసింది.
మహేష్, అల్లు అర్జున్ వంటి స్టార్స్ తో చేసే అవకాశాలను అందుకుంది. అంతటితో ఆగలేదు. ఏకంగా బాలీవుడ్ ఆఫర్స్ ని కొల్లగొట్టింది. ఇప్పుడు బాలీవుడ్లో మూడు సినిమాలు చేస్తుండటం విశేషం.
సాయిపల్లవి కూడా ఓవర్ నైట్ స్టార్ జాబితాలో చేరుతుంది. ఈ అమ్మడు తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన సినిమా `ఫిదా`. ఈ సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడి, అదిరిపోయే స్టెప్పులేసి సినిమా సూపర్ హిట్ అవ్వడంలో భాగమైంది. `ఫిదా` సక్సెస్తో ఓవర్ నైట్లో స్టార్ ఇమేజ్ని సొంతం చేసుకుంది.
వరుసగా అనేక అద్భుతమైన సినిమాల్లో భాగమవుతుంది. `ఎంసీఏ`, `పడి పడి లేచే మనసు`లతో ఆకట్టుకుంది. ఇప్పుడు `లవ్ స్టోరి`, `విరాటపర్వం`,`శ్యామ్ సింగరాయ్` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
ఓవర్ నైట్లో స్టార్, తొలి సినిమాతోనే స్టార్ ఇమేజ్ని సొంతం చేసుకున్న హీరోయిన్కి పర్ఫెక్ట్ అర్థం కృతి శెట్టి. `ఉప్పెన` సినిమాలో అత్యద్బుతమైన నటనతో మెస్మరైజ్ చేసింది. సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంలో కీలక పాత్ర పోషించింది. ఓవర్ నైట్ లో స్టార్ అయ్యింది.
దీంతో ఈ అమ్మడికి వరుసగా అవకాశాలు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో `శ్యామ్ సింగరాయ్`, `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`, రామ్ చిత్రాల్లో నటిస్తుంది. మరికొన్ని సినిమాలకు చర్చలు జరుగుతున్నాయి.
వీరే కాదు త్రిష కూడా ఓవర్ నైట్ స్టార్ కేటగిరిలోకే చేరుతుంది. ఈ అమ్మడు తెలుగులోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందు పలు తమిళ సినిమాలు చేసింది. కానీ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన తొలి చిత్రం `వర్షం`తోనే సూపర్ హిట్ అందుకుంది. ప్రభాస్ సరసన నటించిన ఈ సినిమా సక్సెస్ కావడంతో తెలుగులో ఓవర్ నైట్లో స్టార్ అయిపోయింది.
ఆ తర్వాత తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ స్టార్ హీరోలందరితోనూ చేసింది. ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూ బిజీగా ఉంది. నటిగా తానేంటో నిరూపించుకునే పనిలో బిజీగా ఉంది.
ఒకప్పుడు స్టార్ గా వెలిగి అర్థాంతరంగా కాలం చేసిన ఆర్తి అగర్వాల్ సైతం ఓవర్ నైట్ స్టార్ జాబితాలో చేరుతుంది. ఆమె తెలుగులోకి వెంకటేష్ సరసన `నువ్వు నాకు నచ్చావ్` చిత్రంలో నటించింది.
తొలి సినిమా సక్సెస్ కావడంతో ఎన్టీఆర్, ప్రభాస్, చిరంజీవి, వెంకటేష్, మహేష్, తరుణ్ వంటి సూపర్ స్టార్లతో చేసే అవకాశాలు అందుకుంది. కొన్నాళ్లపాటు టాలీవుడ్ని ఓ ఊపు ఊపింది.
`కొత్త బంగారులోకం` చిత్రంతో ఓవర్ నైట్లో స్టార్గా మారింది శ్వేత బసు ప్రసాద్. ఈ బ్యూటీకి ఆ సినిమా సక్సెస్తో వచ్చిన క్రేజ్, ఇమేజ్ అంతా ఇంతా కాదు. యూత్ డ్రీమ్ గర్ల్ గానూ మారింది. అంతగా టాలీవుడ్ ఆడియెన్స్ ని మెస్మరైజ్ చేసింది.
ఆ తర్వాత ఆమె చేసిన కొన్ని సినిమాలు సరిగా ఆడకపోవడం, ఈ క్రమంలో రాంగ్ మూవీస్ సెలక్షన్, రాంగ్ రూట్ ఈ అమ్మడి కెరీర్ని దెబ్బ తీశాయి. మ్యారేజ్ లైఫ్ కూడా వర్కౌట్ కాలేదు. ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి హిందీలో రాణించే ప్రయత్నం చేస్తుంది.