త్రిష అన్నం మానేసి అందం తింటుందా.. నగలకే అందం తెస్తూ హోయలు పోయిన సీనియర్ బ్యూటీ.. చీరలో కత్తిలా ఉందిగా
త్రిష రెండు దశాబ్దాలు దాటింది ఆమె ఇండస్ట్రీలోకి వచ్చింది. అయినా తన గ్లామర్ షోతో నెటిజన్ల మైండ్ బ్లాక్ చేస్తుంది. మొదటి సినిమాకి ఎలా ఉందో, ఇప్పుడు ఇరవై ఏళ్ల తర్వాత కూడా అలానే ఉంది. ఇంకా చెప్పాలంటే ఇప్పుడే అందంగా ఉంది. కత్తిలాగ మారింది. యంగ్ బ్యూటీస్కి కూడా పోటీనిస్తుంది.
ఇప్పటికీ వన్నె తగ్గని క్రేజ్, అందం, అభినయంతో మెప్పిస్తుంది. ఇటీవల `పొన్నియన్ సెల్వన్`లో కుందవై పాత్రలో రాజకుమారిలా మెరిసిపోయింది. స్వయంగా దేవ లోకం నుంచి దేవ కన్య తప్పిపోయి భూమిపైకి దిగి వచ్చిందా అనేంత అందంగా కనిపించింది.
![article_image2](https://static-ai.asianetnews.com/images/01hgjj4d0j563ngaa3je4351g8/snapinsta-app-358031204-316989324547358-1159518226134366463-n-1080-jpg_300x373xt.jpg)
ఓ పక్కన ప్రపంచ సుందరి ఐశ్వర్యా రాయ్ ఉన్న కూడా అదే తన నాజుకూ అందంతో, అభినయంతో ఆమెనే డామినేట్ చేసింది. సినిమాలో తనొక కీలక భూమిక పోషించింది. సినిమా రిజల్ట్ పక్కన పెడితే ఈ సినిమాతో త్రిష నెక్ట్స్ లెవల్ అప్రిషియేషన్స్ అందుకుంది.
ఆ తర్వాత వరుసగా సినిమా అవకాశాలను అందుకుని మళ్లీ స్వింగ్లోకి వచ్చింది. అదే సమయంలో గ్లామర్ ఫోటో షూట్లతోనే అలరిస్తుంది. ఇటీవల గ్లామర్ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుని ఆకట్టుకుంటుంది. తనుకూడా యంగ్ హీరోయిన్లతో పోటీ పడుతుంది.
నాలుగు పదుల వయసులోనూ వన్నెతగ్గని అందంతో మైమరపిస్తుంది. తన అభిమానులను అలరిస్తుంది. తాజాగా మరోసారి మెరిసింది. గ్రీన్ బీడ్స్ నగలతో మెరిసింది. పలుచని చీర కట్టి హోయలు పోయింది. ఓ జ్యూవెల్లరీ ప్రమోషన్స్ కోసం ఆమె ఈ ఫోటో షూట్ చేసింది. కానీ అందంతో మాత్రం మంత్రముగ్దుల్ని చేసింది.
త్రిష అన్నం తినడం మానేసి అందం తింటుందా అనే అనుమానాలను కలిగిస్తుంది. మరోవైపు తన గ్రేస్ బ్యూటీతో ఆమె యంగ్ హీరోయిన్లకి పోటీ ఇస్తుంది. తనకంటే సగం ఏజ్ ఉన్న హీరోయిన్లకి సైతం ఆమె అందంలో, ఫిట్నెస్లో కాంపిటీషన్గా నిలుస్తుండటం విశేషం. ప్రస్తుతం ఈ బ్యూటీ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక త్రిష ఇటీవల వార్తల్లో నిలిచింది. ఆమెపై తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆమెకి ఇండస్ట్రీ మొత్తం అండగా నిలిచింది. చిరంజీవి సైతం సపోర్ట్ చేశారు. ఆమె కూడా తీవ్రంగా ఖండించింది. ఆ తర్వాత మన్సూర్ క్షమాపణలు చెప్పారు. అదే సమయంలో పరువు నష్టం దావా కూడా వేస్తానంటూ హెచ్చరించారు. దీంతో గత రెండు వారాలుగా త్రిష వార్తల్లో హాట్ టాపిక్ అవుతుంది. ఇప్పుడిప్పుడే దాన్నుంచి బయటపడుతుంది.
Trisha
ఇక ఇటీవల `లియో` చిత్రంతో హిట్ అందుకున్న త్రిష ప్రస్తుతం `విడా ముయర్చీ`, `రామ్ పార్ట్ 1`లో నటిస్తుంది. తెలుగులో ఆమె ఓ సినిమా చేయబోతుందని, బన్నీతో జోడీ కడుతుందని సమాచారం. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.