Most Expensive Songs: ఇండియన్ సినిమాలో 8 ఖరీదైన పాటలు.. నెం.1 అమీర్, షారుఖ్ కాదు
సినిమాల్లో రకరకాల పాటలు చూస్తుంటాం. కొన్ని పాటలను చాలా సింపుల్గా తీస్తే, మరికొన్నింటిపై కోట్లు ఖర్చుపెట్టి గ్రాండ్గా రూపొందిస్తారు. ఇప్పటివరకు ఇండియన్ సినిమాలో అత్యంత ఖరీదైన పాటలు ఏవో ఇప్పుడు చూద్దాం.
18

Image Credit : instagram
8. ఓ మై ఛమ్మక్ ఛల్లో(రా వన్)
2011లో వచ్చిన షారుఖ్ ఖాన్, కరీనా కపూర్ సినిమా 'రా.వన్'లోని 'ఓ మై ఛమ్మక్ ఛల్లో' పాట సూపర్ హిట్ అయింది. ఈ పాట కోసం మేకర్స్ రూ.3 కోట్లు ఖర్చు పెట్టారు.
28
Image Credit : instagram
7. కిలి మంజారో(రోబో)
రజినీకాంత్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ నటించిన 'ఎంథిరన్' (తెలుగులో రోబో) సినిమాలోని 'కిలిమంజారో' పాటలోని విజువల్స్ అద్భుతంగా ఉంటాయి. 2010లో వచ్చిన ఈ సినిమాలోని పాట కోసం రూ.4 కోట్లు ఖర్చు చేశారు.
38
Image Credit : instagram
6. మలంగ్(ధూమ్ )
2013లో వచ్చిన అమీర్ ఖాన్, కత్రినా కైఫ్ సినిమా 'ధూమ్ 3'లోని 'మలంగ్' పాట కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది. ఈ పాటను మేకర్స్ రూ.5 కోట్లు ఖర్చుపెట్టి తీశారు.
48
Image Credit : instagram
5. పార్టీ ఆల్ నైట్(బాస్)
2013లో వచ్చిన అక్షయ్ కుమార్ సినిమా 'బాస్'లోని ఐటమ్ సాంగ్ 'పార్టీ ఆల్ నైట్' అప్పట్లో తెగ ఫేమస్ అయింది. సోనాక్షి సిన్హాతో చేసిన ఈ పాట కోసం మేకర్స్ రూ.6 కోట్లు ఖర్చు చేశారు.
58
Image Credit : instagram
4. రామ్ చాహే లీలా(రామ్ లీలా)
2013లో వచ్చిన దీపికా పదుకొణె, రణ్వీర్ సింగ్ సినిమా 'గోలియోంకీ రాస్లీలా రామ్-లీలా'లోని 'రామ్ చాహే లీలా' పాట బాగా పాపులర్ అయింది. ప్రియాంక చోప్రాపై చిత్రీకరించిన ఈ పాటను రూ.6 కోట్లతో రూపొందించారు.
68
Image Credit : instagram
3. ఘూమర్(పద్మావత్)
దీపికా పదుకొణె, షాహిద్ కపూర్ నటించిన 'పద్మావత్' సినిమా 2018లో రిలీజైంది. ఈ సినిమాలోని 'ఘూమర్' పాట కోసం మేకర్స్ ఏకంగా రూ.12 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ పాట కోసం చాలా గ్రాండ్గా సెట్ వేశారు.
78
Image Credit : instagram
2. జిందా బందా(జవాన్)
షారుఖ్ ఖాన్, నయనతార నటించిన 'జవాన్' సినిమాలోని 'జిందా బందా' పాట పెద్ద సంచలనం సృష్టించింది. మేకర్స్ ఈ పాటను చాలా గ్రాండ్ లెవెల్లో షూట్ చేశారు. సమాచారం ప్రకారం, ఈ పాట చిత్రీకరణకు రూ.15 కోట్లు ఖర్చయింది. ఈ పాటకి అయిన ఖర్చుతో చిన్న బడ్జెట్లో ఐదు సినిమాలు తీయోచ్చు.
88
Image Credit : instagram
1. యంతిర లోగత్తు సుందరియే(2.0)
2018లో వచ్చిన రజినీకాంత్, అమీ జాక్సన్ సినిమా '2.0'లోని పాటే ఇప్పటివరకు ఇండియాలో అత్యంత ఖరీదైనది. 'యంతిర లోగత్తు సుందరియే' పాట కోసం మేకర్స్ ఏకంగా రూ.20 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ పాటకి అయిన ఖర్చుతో ఆరేడుసినిమాలు తీయోచ్చు. మిడిల్ రేంజ్ హీరోతో రెండు మూడు సినిమాలు చేయోచ్చు.
Latest Videos

