- Home
- Entertainment
- Highest Paid Actress : ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ ఎవరో తెలుసా? ఎన్ని కోట్లంటే?
Highest Paid Actress : ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ ఎవరో తెలుసా? ఎన్ని కోట్లంటే?
హీరోయిన్ల రెమ్యునరేషన్లు చాలా తక్కువ ఉంటాయనుకుంటారు.. కానీ ఓటీటీ ప్రాజెక్ట్స్ కే ఈ స్టార్ హీరోయిన్లు తీసుకుంటున్న పారితోషికాల గురించి తెలిస్తే నోరెళ్లబెట్టడం మనవంతు అవుతుంది.

చిత్ర పరిశ్రమలోకి ఓటీటీల ఎంట్రీ తర్వాత ముఖ్యంగా హీరోయిన్ల కెరీర్లు మలుపు తిరుగుతున్నాయి. దాంతో సినిమాల ఆఫర్లు పెరుగుతున్నాయి. దీంతో ముద్దుగుమ్మలు థియేట్రికల్ ప్రాజెక్ట్స్ కంటే.. డిజిటల్ ప్రాజెక్ట్స్ లో తమ రెమ్యునరేషన్లను భారీగా పెంచేస్తున్నారు. ఈ వరసలో టాప్ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్ (Kareena Kapoor Khan) ఒక్కో ఓటీటీ ప్రాజెక్ట్ కు రూ.10 నుంచి రూ.12 కోట్లు తీసుకుంటోంది.
కరీనా కపూర్ ఖాన్ తర్వాత సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu) అత్యధికంగా డిజిటల్ ప్రాజెక్ట్స్ కు పారితోషికం అందుకుంటోంది. త్వరలో రాబోతున్న ‘సిటాడెల్’ కోసం రూ.10 కోట్లు వసూలు చేస్తోందని నివేదికలు అందుతున్నాయి. సాధారణంగా సమంత సినిమాకు రూ. 4 నుండి 4.5 కోట్లు ఛార్జ్ చేస్తుంటుంది.
సెన్సేషనల్ హీరోయిన్ రాధికా ఆప్టే (Radhika Apte) – ఒక్కో వెబ్ సిరీస్కు రూ. 4 కోట్ల వరకు తీసుకుంటోంది.
బాలీవుడ్ నటి సుస్మితా సేన్ (Sushmitha Sen) వరుస సిరీస్ లతో అలరిస్తోంది. ఈమె కూడా ఒక్కో వెబ్ సిరీస్కు రూ. 2 కోట్ల వరకు తీసుకుంటున్నారు.
టాలీవుడ్ నటి ప్రియమణి (Priyamani) పైవారంతా కాకపోయినా గట్టిగానే ఛార్జ్ చేస్తున్నారు. ప్రాజెక్ట్ మొత్తానికి అని కాకుండా... ఎపిసోడ్ కు పారితోషికం తీసుకుంటోంది. ఇలా ఒక్కో ఎపిసోడ్కు 10 లక్షలు అందుకుంటున్నారంట.
శంకర్ దాదా ఎంబీబీఎస్ లో ఐటెం సాంగ్ లో నటించిన గౌహర్ ఖాన్ Gauahar Khan ఒక్కో ఎపిసోడ్కు రూ.3 లక్షలు చార్జ్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇండియాలోనే టాప్ లో కరీనా కపూర్, సమంత ఉండటం విశేషం.