Ayodhya : లావణ్య త్రిపాఠి, అనుష్కతో పాటు.. అయోధ్యలో పుట్టిపెరిగిన సెలబ్రెటీలు వీరే.!
జనవరి 22న అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం అంగరంగవైభవంగా జరగబోతోంది. అయితే ఈ పవిత్రమైన ప్రాంతంలో పుట్టిపెరిగిన హీరోయిన్లు, సెలబ్రెటీల గురించి తెలుసుందాం.
టాలీవుడ్ యంగ్ హీరోయిన్, మెగా కోడలు లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) అయోధ్యలోనే పుట్టారు. త్రిపాఠి 15 డిసెంబర్ 1990న ఉత్తర ప్రదేశ్లోని అయోధ్యలో జన్మించింది. ఆమె తండ్రి హైకోర్టు, సివిల్ కోర్టులలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. తల్లి రిటైర్డ్ టీచర్. ఇక గతేడాది వరుణ్ తేజ్ ను పెళ్లి చేసుకొని హైదరాబాద్ లోనే సెటిల్ అయ్యింది.
![article_image2](https://static-ai.asianetnews.com/images/01hme9b1rhpr1spt7368gg265r/anushka-sharma-jpg_300x374xt.jpg)
బాలీవుడ్ స్టార్ హీరోయిన్, రణబీర్ కపూర్ వైఫ్ అనుష్క శర్మ (Anushka Sharma) కూడా రామ జన్మభూమి అయోధ్యలోనే పుట్టారు. 1 మే 1988న ఆర్బీ అధికారి, కల్నల్ అజయ్ కుమార్ శర్మ, అషిమా శర్మ దంపతులకు జన్మించింది.
పూజా బాత్రా (Pooja Batra) బాలీవుడ్ నటిగా మంచి గుర్తింపు పొందారు. 90లో హిందీలో స్టార్ హీరోయిన్ గా పేరుపొందారు. ఈమె కూడా ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య తాలుకాలోనే జన్మించింది. ప్రస్తుతం ఆమె సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. ఫ్యామిలీతోనే సమయం గడుపుతున్నారు.
బాలీవుడ్ డైరెక్టర్ అభిషేక్ చౌబే (Abhishek Choubey) కూడా ఉత్తర ప్రదేశ్లోని అయోధ్యలోనే జన్మించారు. 1977 మార్చిలో ఆనంద్ మోహన్ చౌబే, షీలా చౌబే దంపతులకు రామ మందిరం నెలకొల్సిన ప్రాంతంలో పుట్టారు.