ప్రమాదంలో ఉన్నాం.. రక్షణ కల్పించండి: రియా చక్రవర్తి
గురువారం తన ఇన్స్టాగ్రామ్ పేజ్లో రియా ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోలో తన ఇంట్లోకి వచ్చేందుకు రియా తండ్రి ప్రయత్నిస్తుంగా మీడియా అతన్ని చుట్టుముట్టింది. కరోనా పరిస్థితిల్లో ఏ మాత్రం నిబంధనలు పాటించకుండా చాలా మంది రియా తండ్రిని చుట్టుముట్టారు.
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఎంతో భవిష్యత్తు ఉన్న యువ నటుడు అర్ధాంతరంగా తనువు చాలించటంతో ఆ కేసు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే ప్రస్తుతం ఈ కేసు సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ హీరోయిన్ రియా చక్రవర్తి చుట్టూనే తిరుగుతుంది.
ఇప్పటికే రియా చక్రవర్తి ప్రభుత్వ రంగ దర్యాప్తు సంస్థలు చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే ముంబై, పాట్నా పోలీసులు విచారణ జరపగా తాజాగా సీబీఐ, ఈడీలతో పాటు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కూడా రియాను ప్రశ్నించేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో రియా తమ కుటుంబం ప్రమాదంలో ఉందంటూ సంచలన ఆరోపణలు చేసింది.
గురువారం తన ఇన్స్టాగ్రామ్ పేజ్లో రియా ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోలో తన ఇంట్లోకి వచ్చేందుకు రియా తండ్రి ప్రయత్నిస్తుంగా మీడియా అతన్ని చుట్టుముట్టింది. కరోనా పరిస్థితిల్లో ఏ మాత్రం నిబంధనలు పాటించకుండా చాలా మంది రియా తండ్రిని చుట్టుముట్టారు.
ఈ వీడియోను పోస్ట్ చేసిన రియా.. `మేం విచారణకు సహకరించేందుకు ప్రయత్నిస్తున్నాం. కానీ మాకు ఎవరూ సహకరించటం లేదు` అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. `నాతో పాటు నా కుటుంబ సభ్యుల జీవితాలు ప్రమాదంలో ఉన్నాయి. ఎవరూ మాకు సాయం చేయటం లేదు. కేవలం విచారణకు వెళ్లేందుకు మాకు రక్షణ కల్పించాలని ముంబై పోలీసులను కోరుతున్నాం` అంటూ తన ఆవేదనను తెలిపింది రియా.
సుశాంత్ సింగ్ రాజ్పుత్ జూన్ 14న ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకొని మరణించిన సంగతి తెలిసిందే. అయితే ముందుగా ఆయన మరణానికి బాలీవుడ్ మాఫియా కారణమన్న వాదన వినిపించినా ఫైనల్గా కేసు మొత్తం రియా చక్రవర్తి మెడకే చుట్టుకుంది.