- Home
- Entertainment
- ఫ్రెండ్ ఇంట్లో కిలో బంగారం కాజేసిన తెలుగు నటి, షాకింగ్ డీటెయిల్స్.. మామూలు కిలాడీ కాదుగా
ఫ్రెండ్ ఇంట్లో కిలో బంగారం కాజేసిన తెలుగు నటి, షాకింగ్ డీటెయిల్స్.. మామూలు కిలాడీ కాదుగా
చిత్ర పరిశ్రమలో వర్తమాన నటీమణులు, నటులు అవకాశాలు సరిగ్గా లేక ఇబ్బందులు పడేవాళ్ళు చాలా మంది ఉంటారు. అయినా ఓపిగ్గా ప్రయత్నించి సక్సెస్ అయినవాళ్ళు కూడా ఉన్నారు. కానీ కొందరు నటీమణులు ఆఫర్స్ రాకపోవడంతో అడ్డదార్లు తొక్కుతున్న సంఘటనలు చూస్తున్నాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
చిత్ర పరిశ్రమలో వర్తమాన నటీమణులు, నటులు అవకాశాలు సరిగ్గా లేక ఇబ్బందులు పడేవాళ్ళు చాలా మంది ఉంటారు. అయినా ఓపిగ్గా ప్రయత్నించి సక్సెస్ అయినవాళ్ళు కూడా ఉన్నారు. కానీ కొందరు నటీమణులు ఆఫర్స్ రాకపోవడంతో అడ్డదార్లు తొక్కుతున్న సంఘటనలు చూస్తున్నాం. తాజాగా అలాంటి సంచలన సంఘటన చోటు చేసుకుంది.
వైజాగ్ కి చెందిన తెలుగు నటి తన స్నేహితురాలి ఇంట్లో కిలో బంగారం కాజేసి అడ్డంగా పోలీసులకు బుక్కైంది. వివరాల్లోకి వెళితే ఆమె పేరు సౌమ్య శెట్టి. వైజాగ్ లో ఉంటోంది. యువర్స్ లవింగ్లీ, ది ట్రిప్ లాంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. మంచి నటనే కనబరిచింది. కానీ ఆ చిత్రాల ద్వారా ఆమెకి గుర్తింపు లభించలేదు.
సరైన అవకాశాలు రాలేదు. దీనితో సౌమ్య శెట్టి ఇంస్టాగ్రామ్ రీల్స్ చేస్తూ ఆఫర్స్ వెతుక్కుంటోంది. ఇలా ఆడిషన్స్ ఇస్తున్న సమయంలో సౌమ్య శెట్టి రిటైర్డ్ పోస్టల్ శాఖ ఉద్యోగి ప్రసాద్ బాబు కుమార్తె మౌనికని పరిచయం చేసుకుంది. ఇద్దరూ ఫ్రెండ్స్ గా మారాయి. సౌమ్య తరచుగా వాళ్ళ ఫ్లాట్ కి వెళ్లి వస్తుండేది. వాళ్ళ ఇంట్లో పరిసరాల్ని వస్తువుల్ని బాగా స్కాన్ చేసేసింది. వాళ్ళ ఇంట్లో కిలో బంగారం వరకు ఉన్నట్లు సౌమ్య గ్రహించింది.
ఎలాగైనా కాజేయాలని అనేక ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలో బాత్రూం కి వెళ్లి వస్తానని చెప్పి బెడ్ రూమ్ లో గంటలు గంటలు గడిపేది. ఇలా రెండు ముందుసార్లుగా కొంచెం కొంచెం బంగారం కాజేస్తూ తన చేతివాటం ప్రదర్శించింది. మొత్తంగా కిలో బంగారాన్ని మాయం చేసేసింది. మౌనిక ఏదో ఫంక్షన్ కోసం దాచిన బంగారాన్ని బయటకి తీయడానికి ప్రయత్నించింది. కాని అక్కడ బంగారం లేకపోవడంతో కుటుంబసభ్యులంతా షాక్ అయ్యారు.
వెంటనే ప్రసాద్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు క్లూలు కనిపెడుతూ అనుమానం ఉన్న 11 మందిని విచారించారు.ఈ క్రమంలో సౌమ్య శెట్టి వద్ద 74 గ్రాముల బంగారం లభించింది. సౌమ్య తన నేరం అంగీకరించింది. మిగిలిన బంగారం గోవాలో ఖర్చు చేసేసినట్లు తెలిపింది.
ఆ బంగారం తాను తిరిగి తెచ్చివ్వలేనని.. గట్టిగా అడిగితే సూసైడ్ చేసుకుంటానని బెదిరిస్తోంది. దీనితో పోలీసులు సౌమ్య శెట్టిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు.