కుళ్లిపోయిన స్థితిలో నటుడి శరీరం.. రెండు రోజుల క్రితం ఆత్మహత్య
హిందీ సినీ పరిశ్రమలో విషాదాలు కొనసాగుతున్నాయి. మరణాలు కలవర పెడుతుండగా తాజాగా మరో నటుడు ఆత్మహత్య చేసుకోవటం ఇండస్ట్రీ వర్గాలను షాక్కు గురిచేసింది. జ్యోతి, లెఫ్ట్ రైట్ లెఫ్ట్, ఇస్ ప్యార్ కో క్యా నామ్ దో సీరియల్స్లో నటించిన సమీర్ శర్మ ఆత్మహత్య చేసుకొని మరణించాడు.
హిందీ సీరియల్ నటుడు సమీర్ శర్మ ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకొని మరణించాడు. ముంబై మలాడ్ వెస్ట్లోని సీహెచ్ఎస్ బిల్డింగ్లో ఆయన ఉరివేసుకొని మరణించినట్టుగా పోలీసులు గుర్తించారు.
సమీర్ ఆత్మహత్యపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు డెడ్ బాడీని అటాప్సీకి పంపించారు. గత రాత్రి డ్యూటీలో ఉన్న వాచ్మెన్ సమీర్ డెడ్ బాడీని ముందుగా గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
అక్కడున్న పరిస్థితులు సమీర్ డెడ్ బాడీని చూసిన పోలీసులు నటుడు రెండు రోజుల క్రితమే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. స్థానికుల సమాచారం ప్రకారం సమీర్ ఇటీవల తీవ్ర అనారోగ్యంతో ఇబ్బంది పడ్డాడు. అయితే ఈ మధ్యే కోలుకున్న ఆయన కొద్ది రోజులుగా షూటింగ్లకు కూడా హాజరవుతున్నాడు.
సమీర్ రూంలో ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదని పోలీసులు వెల్లడించారు. సమీర్ మృతిపై టెలివిజన్ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ఈ నటుడు పాపులర్ టీవీ సీరియల్స్ కహానీ ఘర్ ఘర్ కీ, క్యోంకి సాస్ బీ కబీ బాహు థీ లలో నటించాడు.