బాలు అంతిమ వీడ్కోలులో తమిళ సూపర్ స్టార్ విజయ్.. కన్నీటి నివాళి
సుమధుర గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం అంత్యక్రియలు పూర్తయ్యాయి. అభిమానులు కన్నీటి పర్యంతమయ్యారు. అంతిమ సంస్కారాల్లో సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్, దర్శక, నిర్మాత, నటుడు భారతీరాజా పాల్గొన్నారు. వీరితో పాటు యాక్షన్ కింగ్ అర్జున్, తమిళ సూపర్ స్టార్ విజయ్ కూడా పాల్గొన్నారు.
![article_image2](https://static-ai.asianetnews.com/images/01ek4p63twpapg2js8anwhk0xt/whatsapp-image-2020-09-26-at-12-21-19-pm-jpeg_300x399xt.jpg)
విజయ్ స్వయంగా చివరి వరకు ఉండి బాలు భౌతిక కాయానికి నివాళ్ళు అర్పించారు.
బాలు అంత్యక్రియలు పూర్తయ్యేంత వరకు ఉన్న ఏకైక నటుడు విజయ్. అన్ని కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు.
విజయ్ కాసేపు బాలు తనయుడు ఎస్పీ చరణ్తో ముచ్చటించారు. కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. విజయ్ నటించిన చాలా సినిమాలకు బాలు పాటలు పాటారు.