మైసూర్ శాండల్ సోప్ కు బ్రాండ్ అంబాసిడర్ గా తమన్నా, ఎన్ని కోట్లు తీసుకుందంటే?
హీరోయిన్ తమన్నా భాటియా తదుపరి రెండు సంవత్సరాలకు మైసూర్ శాండిల్ సోప్ బ్రాండ్ అంబాసిడర్గా నియమితులయ్యారు. కొంతమంది నెటిజన్లు ఈ ఎంపికను ప్రశ్నించారు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
కర్ణాటక ప్రభుత్వలోని కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ (KSDL) ఉత్పత్తులకు హీరోయిన్ తమన్నా భాటియా అంబాసిడర్ గా నియమితులయ్యాిరు. నెక్ట్స్ రెండు సంవత్సరాలు మైసూర్ శాండిల్ సోప్కు అంబాసిడర్ గా తమన్నా కొనసాగుతారు.
మైసూర్ శాండిల్ సోప్ ను 1916 లో మైసూర్ రాజు కృష్ణ రాజ వడಯర్ IV బెంగళూరులో ప్రభుత్వ సబ్బుల కర్మాగారాన్ని స్థాపించారు. అప్పటి నుండి తయారు చేయబడుతోంది. మైసూర్ శాండిల్ సోప్ ప్రపంచ స్థాయి నాణ్యతను కలిగి ఉంది.
కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లి.. బ్రాండ్ అంబాసిడర్గా తమన్నా భాటియాను 2 సంవత్సరాల 2 రోజుల అగ్రిమెంట్ తో నియమించారు. ఇందుకుగాను తమన్నాకు 6.20 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వబోతున్నారు. నెక్ట్స్ రెండేళ్లు మైసూర్ సాండల్ సోప్పై తమన్నా ఫోటో ఉంటుంది.
మైసూర్ శాండిల్ సోప్ తయారు చేసే బెంగళూరులోని KSDL సోప్ కర్మాగారం భారతదేశంలోనే అతిపెద్ద కర్మాగారం. సంవత్సరానికి 26,000 టన్నుల సోప్ ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని ఈ కర్మాగారం కలిగి ఉంది.
తమన్నా భాటియాను మైసూర్ శాండల్ సోప్ కు అంబాసిడర్ గా ఎంపిక చేయడంపై కొంతమంది నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మీకు కన్నడ నటీమణులు దొరకలేదా అని ప్రశ్నించారు. మరికొంత మంది మాత్రం ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ సృష్టించడానికి ఇలాంటి స్టార్ సెలబ్రిటీల అవసరం ఉంటుంది. ఇది మార్కెట్ వ్యూహంలో భాగం అని అభిప్రాయపడ్డారు.