పింక్ అందాలతో పిచ్చెక్కిస్తున్న తమన్నా.. సరికొత్త లుక్ లో మైండ్ బ్లాక్ చేస్తున్న మిల్కీ బ్యూటీ
మిల్కీ బ్యూటీ తమన్నా అందాల భామగా టాలీవుడ్లో పేరుతెచ్చుకుంది. నడుమందాలకు కేరాఫ్గా నిలిచే తమన్నా కమర్షియల్ హీరోగా స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుని దూసుకుపోతుంది.
తమన్నా(Tamanna) తాజాగా పింక్ అందాలతో మెస్మరైజ్ చేస్తుంది. అందాలు కనిపించకుండా డ్రెస్ వేసుకుని సరికొత్త లుక్లో కనువిందు చేస్తుంది. పింక్ డ్రెస్లో హోయల పోయింది తమన్నా. మెల్బోర్న్ లో దిగిన పిక్స్ ని తాజాగా ఆమె షేర్ చేసింది. హాట్ పోజులిస్తూ కుర్రాళ్ల మతిపోగొడుతుంది.
తమన్నా(Tamannaah) నిండైన దుస్తులు ధరించి ఆకట్టుకుంటుంది. స్కీన్ షో చేయకపోయినా, ఆమె అందాలు హాట్నెస్ మాత్రం ఓవర్లోడ్ అనేలా ఉండటం విశేషం. ప్రస్తుతం తమన్నా నయా పిక్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు తమన్నా ఫోటోలపై హాట్ కామెంట్లు పెడుతున్నారు.
తమన్నా గ్లామర్ సైడ్ ప్రతి ఆడియెన్స్ కి సుపరిచితమే. కానీ ఎంతగా హాట్ షో చేసినా ఏదో సమ్ థింగ్ స్పెషల్ అనిపించుకోవడం ఆమె ప్రత్యేకత. అందుకే ఆమె వెంటపడుతుంటారు మేకర్స్. ఆమె అందాలను సరికొత్తగా ఆవిష్కరించేందుకు తపిస్తుంటారు. దాన్ని సినిమాకి క్యాష్ చేసుకుంటారు.
అయితే ఇటీవల మాత్రం అందాల ఆరబోతకంటే పాత్రలకే ప్రయారిటీ ఇస్తున్నట్టు కనిపిస్తుంది తమన్నా. ఆమె ఎంపిక చేసుకుంటున్న సినిమాలు చూస్తుంటే ఆ విషయం అర్థం అవుతుంది. ఆమె బలమైన పాత్రలకు ప్రయారిటీ ఇస్తుంది. తమన్నా చివరగా తెలుగులో `మ్యాస్ట్రో` చిత్రంలో నటించింది. ఇందులో ఆమె నటిగా గ్లామర్ రోల్ చేసింది. అదే సమయంలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించడం విశేషం. అద్భుతమైన నటనతో మెస్మరైజ్ చేసింది తమన్నా.
అంతకు ముందు స్టార్ హీరోల సరసన కమర్షియల్ హీరోయిన్గా మెరిసింది. మూడు లవ్ సీన్లు, ఆరు పాటల్లో వచ్చే అమ్మాయిగా కనిపించి ఆకట్టుకుంది. అంతేకాదు ఐటెమ్ సాంగ్స్ కూడా చేసింది. కానీ నటిగా మరింత కాలం కెరీర్ ఉండాలంటే నటనకు స్కోప్ ఉన్న పాత్రలు చేయడం కూడా ముఖ్యమే అనే విషయాన్ని తెలుసుకుంది తమన్నా. అందుకే ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తుంది.
తమన్నా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో `భోళాశంకర్` చిత్రంలో నటిస్తున్నారు. `సైరా`లో కీలక పాత్రలో మెరవగా, ఇందులో ఏకంగా హీరోయిన్గానే ఛాన్స్ కొట్టేసింది. మరోవైపు సత్యదేవ్తో చేసిన `గుర్తుందా శీతాకాలం` మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియని పరిస్థితి. కానీ హిందీలో మాత్రం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. తెలుగు కంటే బాలీవుడ్పైనే ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తుంది.