సూర్య - జాన్వీ కపూర్ జంటగా నటించాల్సిన సినిమా ఆగిపోయిందా..? కారణాలు ఏంటి...?
సూర్య జంటగా జాన్వీ కపూర్.. చాలా కాలంగా వినిపిస్తున్న కాంబినేషన్.. దాదాపు సెట్అయినట్టే అన్నారు. ఇక షూటింగ్ తరువాయి అన్నారు.. కాని ప్రస్తుతం ఈ సినిమా ఆగిపోయిందా..? కారణం ఏంటి..? నిజం ఏంత..?
సూర్య - జాన్వీ కపూర్ జంటగా సినిమా..? అది కూడా బాలీవుడ్ లో.. దాదాపు ఫిక్స్ అయ్యింది. ప్రీ ప్రొడక్షన్ కూడా నడిచిందట. ప్రీ ప్రొడక్షన్ కోసం ఓ చిన్న సినిమా అంత బడ్జెట్ కూడా పెట్టారట. ఈ సినిమాలో కర్ణుడిగా సూర్య నటించబోతున్నట్టు తెలిసింది. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా దర్శకత్వంలో.. మెగా బడ్జెట్లో సూర్య, జాన్వీ కపూర్లు నటించాల్సిన కర్ణ ఆగిపోయింది. 350 కోట్ల భారీ వ్యయంతో మహాభారతంలోని కర్ణుడి పాత్ర ఆధారంగా దీన్ని తెరకెక్కించాలని అనుకున్నారు.
ఈ సినిమాలో ద్రౌపది పాత్రలో జాన్వీ కపూర్ తీసుకున్నారన్నది సమాచారం. అలాగే కర్ణ ప్రీ ప్రొడక్షన్ పనుల కోసం చిత్రబృందం 15 కోట్ల రూపాయలు వరకూ ఖర్చు చేసిందట. ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ నిర్మించనున్నట్లు ప్రకటించబడిన ఈ చిత్రం సూర్యకి మొదటి డైరెక్ట్ హిందీ చిత్రం అని కూడా జాన్వీ కపూర్ మరియు అలీ ఫజల్, విజయ్ వర్మ మరియు అవినాష్ తివారీ కూడా ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం.
హీనా ఖాన్ నుంచి గౌతమి, మనీషా కొయిరాలా వరకు..! క్యాన్సర్ తో పోరాడిన హీరోయిన్లు ఎవరంటే..?
హిందీతో పాటు తమిళం, తెలుగుతో పాటు పలు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ సినిమా ఆగిపోయినట్లు తెలుస్తోంది. దాంతో ఈ సినిమాలో నటించాల్సిన నటీనటులు తమ తదుపరి చిత్రాలపై కాన్సంట్రేషన్ పెడుతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
పెళ్ళై వారం కాలేదు.. సోనాక్షి సిన్హా ప్రెగ్నెంట్ అయింది..? హాస్పిటల్ లో కనిపించిన కొత్త జంట..?
ఇదిలా ఉండగా, సూర్య ప్రస్తుతం సిరుత్తై శివ దర్శకత్వంలో ఫాంటసీ యాక్షన్ చిత్రం కంగువలో పని చేస్తున్నాడు. ఈ సినిమా ఈ ఏడాది విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రంలో నటరాజన్ సుబ్రమణ్యం, జగపతి బాబు, యోగి బాబు, రెడిన్ కింగ్స్లీ తదితరులు నటిస్తున్నారు.బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ ఈ సినిమాతో కోలీవుడ్ లో అడుగు పెట్టబోతోంది.
Karthik Subbaraj Suriya starrer film update out
అలాగే కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సూర్య 44 వ సినిమా చేస్తున్నాడు. ఈసినిమాతో పాటు.. బాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాలు కమిట్ అయినట్టు తెలుస్తోంది. అక్షయ్ కుమార్ సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నారు సూర్య.
ఇక జాన్వీ కపూర్ విషయానికి వస్తే.. చివరిగా మిస్టర్ అండ మిసెస్ మహిలో కనిపించింది. తెలుగులో బ్లాక్ బస్టర్ దేవర సినిమాలో ఎన్టీఆర్ జోడీగా నటిస్తోంది. ఈసినిమాతో పాటు.. టాలీవుడ్ లో రామ్ చరణ్ జోడీగా బుచ్చిబాడు డైరెక్ట్ చేయబోయే సినిమా ఆర్సి 16 లో కూడా జాన్వీ నటిస్తోంది. ఎక్కువగా సౌత్ పై దృష్టి పెట్టింది బ్యూటీ.