MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • జై భీమ్ విషయంలో సూర్య తప్పు చేశాడా..? బాలయ్య షోలో సీక్రెట్ విప్పిన తమిళ స్టార్ హీరో

జై భీమ్ విషయంలో సూర్య తప్పు చేశాడా..? బాలయ్య షోలో సీక్రెట్ విప్పిన తమిళ స్టార్ హీరో

 స్టార్ హీరో  సూర్య 'జై భీమ్' సినిమా గురించి తన మనసుని కదిలించిన ఘటనను పంచుకున్నారు.

2 Min read
Mahesh Jujjuri
Published : Nov 07 2024, 07:39 PM IST| Updated : Nov 07 2024, 07:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
జై భీమ్ సినిమా గురించి సూర్య

జై భీమ్ సినిమా గురించి సూర్య

దర్శకుడు టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో 2021 నవంబర్‌లో రిలీజ్ అయిన సినిమా   'జై భీమ్'. నిజ జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ మూవీలో  సూర్య  హీరోనగా నటించారు. అంతే కాదు ఈసినిమాలో సూర్యతో పాటు  లిజో మోల్, మణికంఠన్ కీలక పాత్రలు పోషించారు.

Also Read:  ఆ హీరోయిన్ భుజంపై చేయి వేయడానికి భయపడిన అక్కినేని నాగేశ్వరావు. కారణం ఏంటి..?

25
జై భీమ్ సినిమా కథ

జై భీమ్ సినిమా కథ

1993లో జరిగిన ఇరుళ జాతికి చెందిన రాజా కణ్ణు, సెంగెణి దంపతులపై పోలీసుల అన్యాయాన్ని ఈ సినిమాలో చూపించారు. చేయని తప్పు ఒప్పుకోమని బాధిస్తుండగా, పోలీసుల దాడిలో రాజా కణ్ణు మరణిస్తాడు. కానీ పోలీసులు అతను పారిపోయినట్లు కథ అల్లుతారు.

Also Read: హీరోయిన్ ను పెళ్లాడబోతున్న నిహారిక మాజీ భర్త, మెగా డాటర్ కు షాక్ ఇచ్చిన చైతన్య ..?

35
జై భీమ్

జై భీమ్

తన భర్తకు న్యాయం జరగాలని సెంగెణి న్యాయవాది చంద్రు సాయంతో పోరాడుతుంది. ఈ కేసులో సెంగెణి గెలుస్తుంది. ఈ సినిమాలో  రాజా కణ్ణుగా మణికంఠన్, సెంగెణిగా లిజో మోల్ నటించారు.

ఇక అసలైన హీరో పాత్ర న్యాయవాది చంద్రుగా సూర్య నటించగా, రజిషా విజయన్, ప్రకాష్ రాజ్, రావు రమేష్, గురు సోమసుందరం, ఎంఎస్ భాస్కర్, జయప్రకాష్, ఇళవరసు, సుజాత తదితరులు నటించారు.

Also Read: ఈ సినిమా చేయను, వెళ్ళిపోతాను.. జూనియర్ ఎన్టీఆర్ డైరెక్టర్ తో గొడవపెట్టుకున్న మూవీ ఏదో తెలుసా..?

45
జై భీమ్ లో సూర్య చేసిన తప్పు

జై భీమ్ లో సూర్య చేసిన తప్పు

ఈ చిత్రానికి ఎస్.ఆర్.కతిర్ ఛాయాగ్రహణం, ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ అందించారు. జ్యోతిక, సూర్యలు 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. కరోనా సమయంలో విడుదలైన ఈ సినిమా అమెజాన్ ఓటీటీలో విడుదలయ్యింది. 

ఓటీటీలోప్రేక్షకులను ఆకట్టుకుంది. దీపావళి సందర్భంగా ఈ సినిమా విడుదలైనప్పుడు, ఒక వృద్ధుడి చర్య 'జై భీమ్' సినిమాలో తాను చేసిన తప్పును ఎత్తి చూపిందని, దాని వల్ల తాను బాధపడ్డానని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో సూర్య చెప్పారు.

 

55
సూర్య భావోద్వేగం

సూర్య భావోద్వేగం

'అన్నాత్త' సినిమా చూడటానికి సూర్య థియేటర్‌కి వెళ్ళినప్పుడు, 'జై భీమ్' సినిమాకి వస్తున్న ఆదరణ గురించి తెలుసుకున్న ఒక వృద్ధుడు ఆ సినిమాకి టికెట్ కావాలని టికెట్ కౌంటర్‌లో అడిగాడట. ఆ సినిమా ఓటీటీలో విడుదలైందని చెప్పినప్పుడు, ఆ వృద్ధుడికి అర్థం కాలేదు. అప్పుడు ఈ సినిమాని ఓటీటీలో విడుదల చేయడం పెద్ద తప్పు చేశామని బాధపడ్డాడట సూర్య. 

ఇక అలాంటి తప్పు చేయకూడదని అనుకున్నానని సూర్య చెప్పారు. థియేటర్లలో రిలీజ్ అయ్యుంటే అందరూ చూసి ఉండేవారు కదా అని సూర్య బాధపడ్డాట. ఈ విషయాన్ని పలు ఇంటర్వ్యూలతో పాటు.రీసెంట్ గా జరిగిన బాలయ్య టాక్ షో అన్ స్టాపబుల్ లో కూడా సూర్య వెల్లడించారట. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved