రవి మోహన్, ఆర్తి విడాకులకు ధనుష్ కారణమా? మరో వివాదం రేపిన సుచిత్ర
నటుడు రవి మోహన్, ఆయన భార్య ఆర్తి విడాకులు తీసుకోవడానికి నటుడు ధనుష్ కారణమని గాయని సుచిత్ర తెలిపారు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
గాయని సుచిత్ర ఇంటర్వ్యూ
గాయని సుచిత్ర ఇటీవల కాలంలో పలు వివాదాస్పద విషయాల గురించి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు. గత సంవత్సరం కోలీవుడ్లో జరిగే డ్రగ్స్ పార్టీ గురించి మాట్లాడిన ఆమె, ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉన్న రవి మోహన్ - ఆర్తి రవి విడాకుల గురించి హైవుడ్ ఎంటర్టైన్మెంట్ అనే యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో, వారి విడాకులకు నటుడు ధనుష్ కారణమని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు సుచిత్ర.
పార్టీ ద్వారా ఆర్తికి పరిచయమైన ధనుష్
ఆర్తి రవి పెళ్లికి ముందు రవి మోహన్ను ప్రేమించే వరకు వేరే అమ్మాయిలా ఉండేదని, పెళ్లి తర్వాత పూర్తిగా మారిపోయిందని సుచిత్ర తెలిపారు. జయం రవి షూటింగ్కి వెళ్ళిన తర్వాత ఆర్తి పార్టీలకు వెళ్లేదని, అలా పార్టీకి వెళ్ళినప్పుడు ధనుష్తో పరిచయం ఏర్పడి ఇద్దరూ దగ్గరయ్యారని, ఈ విషయం అంతా రవి మోహన్కు తెలిసిన తర్వాతే ఆయన ఆర్తిని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నారని సుచిత్ర ఆ ఇంటర్వ్యూలో చెప్పారు.
పిల్లలను చూడలేక బాధపడుతున్న రవి మోహన్
ప్రస్తుతం ఆర్తి తన పిల్లలను ఉపయోగించుకొని జయం రవిని బ్లాక్మెయిల్ చేస్తుందని సుచిత్ర తెలిపారు. ఇటీవల రవి మోహన్ తన ప్రకటనలో కూడా తాను ఆర్తిని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నానని, తన పిల్లలను కాదని పేర్కొన్నారు. తన పిల్లలను ఆర్తి చూడనివ్వడం లేదని, పాఠశాల ద్వారా పిల్లలను చూడటానికి ప్రయత్నించారని రవి మోహన్. ఈ విషయం తెలుసుకున్న ఆర్తి, బాడీగార్డ్లతో పిల్లలను పాఠశాలకు పంపుతున్నారట.
యూట్యూబర్లకు డబ్బులిస్తున్న ఆర్తి రవి
ఆర్తి ప్రకటన విడుదల చేసి సానుభూతి కోసం ప్రయత్నించడమే కాకుండా, పలు యూట్యూబ్ ఛానెళ్లకు డబ్బులిచ్చి రవి మోహన్ - కేనిషా గురించి అపవాదులు ప్రచారం చేస్తుందని సుచిత్ర అన్నారు. కేనిషా చాలా అమాయకురాలని, ఆమె రవి మోహన్ పరిస్థితిని తనతో చెప్పి బాధపడిందని కూడా సుచిత్ర చెప్పారు. వారు ఇద్దరూ ప్రస్తుతం రిలేషన్షిప్లో ఉన్నారని ఆ ఇంటర్వ్యూ ద్వారా ధృవీకరించారు. రవి మోహన్ - ఆర్తి విడిపోవడానికి ధనుష్ కారణమని సుచిత్ర చెప్పడం కోలీవుడ్ వర్గాల్లో కలకలం రేపింది.