సుశాంత్ ఆత్మహత్య కేసు: సంచలన విషయాలు వెల్లడించిన ఆంబులెన్స్ స్టాఫ్
బాడీని తరలించిన ఆంబులెన్స్ టీం టైమ్స్ నౌ ఛానల్తో మాట్లాడుతూ కీలక విషయాలను వెల్లడించారు. ఆసుపత్రికి వెళ్లే సమయానికి సుశాంత్ బాడీ ఎల్లో కలర్లోకి మారిపోయిందని ఆంబులెన్స్ స్టాఫ్ వెల్లడించారు. సుసైడ్ చేసుకున్న సందర్భాల్లో శరీరం అలా ఎల్లో కలర్కి మారటం తాము గతంలో ఎప్పుడూ చూడలేదని వారు వెల్లడించారు.
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య వ్యవహారం రోజుకో ములుపు తిరుగుతుంది. తాజాగా సుశాంత్ డెడ్ బాడీని ఆసుపత్రికి తరలించిన ఆంబులెన్స్ స్టాఫ్ సంచలన విషయాలను వెల్లడించారు. సుశాంత్ ఆత్మహత్య వ్యవహారాన్ని గుర్తించిన పోలీసులు ఆయన డెడ్ బాడీని ఆటాప్సీ కోసం ఆర్సీ కూపర్ ఆసుపత్రికి తరలించారు.
అయితే ఆ సమయంలో బాడీని తరలించిన ఆంబులెన్స్ టీం టైమ్స్ నౌ ఛానల్తో మాట్లాడుతూ కీలక విషయాలను వెల్లడించారు. ఆసుపత్రికి వెళ్లే సమయానికి సుశాంత్ బాడీ ఎల్లో కలర్లోకి మారిపోయిందని ఆంబులెన్స్ స్టాఫ్ వెల్లడించారు. సుసైడ్ చేసుకున్న సందర్భాల్లో శరీరం అలా ఎల్లో కలర్కి మారటం తాము గతంలో ఎప్పుడూ చూడలేదని వారు వెల్లడించారు.
అంతేకాదు సుశాంత్ మోకాళ్లు వంగిపోయాయని, ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నవారికి అలా జరగటం ఎప్పుడూ చూడలేదని చెప్పారు. అంతేకాదు ఆత్మహత్య చేసుకున్నట్టైయితే తాడు మెడ మీదుగా ఒత్తుకున్నట్టుగా ఉండాలని కానీ సుశాంత్ కేసులో మెడ చుట్టూ బలంగా లాగీనట్టుగా ఉందన్న అనుమానం వ్యక్తం చేశారు.
అయితే ఈ విషయాలపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్మామి స్పందించారు. ఈ వ్యాఖ్యల ఆధారంగా సీబీఐ ఆర్సీ కూపర్ ఆసుపత్రి డాక్టర్లను ప్రశ్నించవచ్చన్నారు. ముఖ్యంగా సుశాంత్ డెడ్ బాడీకి అటాప్సీ చేసిన ఐదుగురు డాక్టర్లను సీబీఐ ప్రశ్నించాలని ఆయన సూచించారు.
ఆంబులెన్సస్ స్టాఫ్ చెప్పిన ప్రకారం సుశాంత్ కాలు మెలిక పడి ఉంది. అంటే ఆయన కాలు విరిగిందా..? అలా ఎందుకు జరిగింది అన్న అనుమానం వ్యక్తం చేశారు సుబ్రమణ్య స్వామి. అంతేకాదు సుశాంత్ విసేరాను ఫోరెన్సిక్కు ఎందుకు పంపలేదని ఆయన ఆసుపత్రి వర్గాలను ప్రశ్నించారు.
గతంలో సుశాంత్ ది తాను ఆత్మహత్య కాదు అని ఎంతో భావిస్తున్నారో వివరిస్తూ 26 రీజన్స్ను వెల్లడించారు సుబ్రమణ్యస్వామి. సుశాంత్ గొంతు మీద ఉన్న మార్క్ ఉరి వేసుకున్నట్టుగా లేదని, ఆయన శరీరంగాపై గాయాలు ఉన్నాయని, అవన్ని చూస్తే ఇది ఆత్మహత్య అనిపించటం లేదని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.