Republic Day Celebrations : ‘జెండా’ వందనం చేసిన టాలీవుడ్ స్టార్స్..
గణతంత్ర దినోత్సవ వేడుకలను సినీ తారాలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా టాలీవుడ్ స్టార్ జెండా వందనం చేశారు.
మెగా ఫ్యామిలీ నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘జనసేన’ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతీయ గీతాన్ని ఆలపించారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్కు, గాంధీ, భారత మాత చిత్రాలకు నమస్కరించారు.
ఇక మెగా స్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్ రావడంతో తను స్వీయం నిర్బంధంలోనే ఉన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు, మెగా ఫ్యామిలీ కోరుకుంటోంది.
రామ్ చరణ్ మాత్రం జాతీయ జెండాకు వందనం చేశారు. ఆయనతో పాటు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ తమ సోషల్ మీడియా ఖాతాలో జాతీయ జెండా చిత్రాన్ని పోస్ట్ చేసి సెల్యూట్ చేశారు.
కరోనా కారణంగా ఎక్కుగా సెలబ్రేటీలు బయటికి రావడం లేదు. అందుకే తమ సోషల్ మీడియా ఖతాల్లో దేశభక్తిని చాటుతూ ఫొటోలు షేర్ చేస్తున్నారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధులు, రాజ్యాంగ నిర్మాతను గుర్తు చేసుకున్నారు.
సూపర్ స్టార్ ‘మహేశ్ బాబు’ కూడా తన ట్విట్టర్ తో అభిమానులకు గణతంత్ర దినోత్స శుభాకాంక్షలు తెలిపారు. 75 ఏండ్ల స్వాతంత్ర్య దేశం కోసం ఎంతో మంది ధీరులు అమరులైనారని గుర్తు చేశారు. ఎల్లప్పుడూ దేశంలో శాంతియుతంగా ఉండాలని, అందరూ శ్రేయస్సు ను కలిగి ఉండాలని ఆకాంక్షించారు.
ఇక ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ కూడా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొంది. ఈ సందర్భంగా శాంతి సూచించేలా తెలుపు రంగు దుస్తులు ధరించి జాతీయజెండాను చేతులతో పైకెత్తింది. మరోవైపు మంచు వారి ఫ్యామిలీ నుంచి కూడా మంచు లక్ష్మి కూడా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.