కళ్లు చెదిరేలా కియారా అద్వాని కొత్త లగ్జరీ కారు, కాస్ట్ ఎంతో తెలిస్తే.. షాక్ అవుతారు.
ఫిల్మ్ స్టార్ సెలబ్రిటీలే ఏవైనా లగ్జరీ ఐటమ్స్ కొంటే.. నెటిజన్ల కళ్లన్నీ వాటిపైనే ఉంటాయి. ఎవరైనా ఏదైనా కాస్ట్లీ వస్తువు కొంటే చాలు దాన్ని వైరల్ చేస్తుంటారు. ఈక్రమంలోనే.. హీరోయిన్ కియారా అద్వాని అదరిపోయే కారుతో ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చింది.
బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా కంటీన్యూ అవుతోంది కియారా అద్వానీ. బాలీవుడ్ లో మొదటి రెండు సినిమాలతోనే తానేంటో నిరూపనించుకున్న కియారా అద్వాని.. ఆతరువాత తెలుగులో కూడా ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. భరత్ అనే నేను సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈబ్యూటీ.. ఆతరువాత రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ సినిమాలో నటించి.. అది ప్లాప్ అవ్వగానే టాలీవుడ్ లో కనిపించకుండా పోయింది.
టాలీవుడ్ లో అవకాశాలు వస్తున్నా.. వద్దనుకుని తిరిగి బాలీవుడ్ కు మకాం మార్చేసింది బ్యూటీ. బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ.. స్టార్ ఇమేజ్ సాధించి కియారా.. ప్రస్తుతం పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో మారోసారి రామ్ చరణ్ జంటగా తెరకెక్కుతోన్న గేమ్ చేంజర్ లో హీరోయిన్ గా నటిస్తోంది. రామ్ చరణ్ 15వ సినిమా తెరకెక్కుతోన్న ఈమూవీపై భారీగా అంచనాలు ఉన్నాయి.
Kiara Advani'
ఆమధ్య బాలీవుడ్ యంగ్ హీరో.. సిద్దార్ధ్ మల్హోత్రాను ప్రేమించి పెళ్ళాడింది కియారా అద్వాని. పెళ్లి తరువాత ఎవరి షూటింగ్స్ లో వారు ఫుల్ బిజీ అయిపోయారు. అటు మ్యారెజ్ తర్వాత ఇటు కెరీర్ ను బ్యాలెన్స్ చేస్తుంది. పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. రామ్ చరణ్ సినిమా తర్వాత మరో టాలీవుడ్ మూవీలోనూ నటిస్తుందని టాక్.
తాజాగా ఈ అమ్మడు ఓ కాస్ట్లీ కారు కొన్నది. బాలీవుడ్ ముద్దుగుమ్మ ఖరీదైన మెర్సిడెజ్ బెంజ్ కారును కొనుగోట్లు తెలుస్తోంది. కారు విలువ ఇండియన్ మార్కెట్లో దాదాపు 3 కోట్ల వరకూ ఉంటుందని టాక్. ఈ కారును మే 26న రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముంగిచేసినట్టు తెలుస్తోంది.
మెర్సిడెస్ మేబ్యాచ్ ఎస్-580 4 మ్యాటిక్ మోడల్ కారులో దర్జాగా ముంబయ్ లో చక్కర్లు కొడుతుంది కియారా. ఈ ఖరీదైన కారులో ముంబైలోని డబ్బింగ్ స్టూడియోకు వెళ్లింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక కారును ఆమె తన అసలు పేరు అలియా అద్వానీ పేరుతో రిజిస్టర్ చేసుకుంది.