మేకప్ లేకుండా డార్క్ ఛాక్లెట్లా సెగలు కక్కుతున్న ఓజీ భామ.. నడుము కనిపించేలా చిన్నటాప్లో శ్రియా రెడ్డి రచ్చ
`ఓజీ` బ్యూటీ శ్రియా రెడ్డి.. అద్భుతమైన పర్ఫెర్మెన్స్ లతో ఆకట్టుకుంటుంది. ప్రశంసలందుకుంటుంది. ఈ క్రమంలో అదే సమయంలో తన నయా అందాలతో దుమారం రేపుతుంది.
శ్రియా రెడ్డి (Sriya Reddy) చాలా కాలంగానే నటిగా రాణిస్తుంది. తెలుగులో కంటే ఇతర భాషల్లో ఎక్కువగా రాణిస్తుంది. తమిళంలో పాపులర్ అయిన ఈ బ్యూటీకి ఇప్పుడు తెలుగులోనూ పాపులర్ అయిపోయింది. టాలీవుడ్లో గతంలో రెండు సినిమాల్లో మెరిసినా, ఇప్పుడు అనూహ్యంగా ఆమెకి క్రేజ్ నెలకొంది.
అందుకు కారణం.. తెలుగులో ఆమె పవన్ కళ్యాణ్ సినిమాలో చేస్తుండటమే. శ్రియా రెడ్డి.. పవన్ కళ్యాణ్తో `ఓజీ`లో నటిస్తుంది. ఇందులో కీలక పాత్రలో కనిపించబోతుంది. టీమ్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. దీంతో ఒక్కసారిగా ఈ బ్యూటీ తెలుగులో క్రేజ్ని సొంతం చేసుకుంది.
దీంతో ఈ అమ్మడికి సంబంధించిన ప్రతి కదలికని అంతా గమనిస్తున్నారు. ఈ క్రమంలో అందాల నిధి బయటపడింది. ఇన్స్టాగ్రామ్లో ఈ బ్యూటీ అదిరిపోయే ఫోటోలను పంచుకుంటూ ఆకట్టుకుంటుంది. బోల్డ్ లుక్లో మైండ్ బ్లాక్ చేస్తుంది. అసలైన అందాలను ఆవిస్కరిస్తూ పిచ్చెక్కిస్తుంది.
తాజాగా ఈ బ్యూటీ డార్క్ ఛాక్లెట్గా మారిపోయింది. మేకప్ లేకుండా కుర్రాళ్లని టెంప్ట్ చేసే ప్రోగ్రామ్ పెట్టుకుంది. చిన్నదైన టాప్ వేసుకుంది. నడుము కనిపించేలా పోజులిచ్చింది. కసి చూపులతో కుర్రాళ్లని టెంప్ట్ చేస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
తమిళనాడుకి చెందిన ఈ బ్యూటీ తెలుగు చిత్రంతోనే హీరోయిన్గా వెండితెరకి పరిచయమైంది. 2003లో `అప్పుడప్పుడు` అనే చిత్రంలో హీరోయిన్గా నటించింది. ఇందులో రాజా హీరో. ఈ సినిమా పర్వాలేదనిపించుకుంది. కానీ ఈ బ్యూటీ తెలుగులో కంటిన్యూ కాలేకపోయింది. ఆ తర్వాత మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చింది. `బ్లాక్` అనే చిత్రంలో నటించింది.
అట్నుంచి ఓ ఇంగ్లీష్ మూవీ చేసింది. దీంతోపాటు మరో మలయాళ మూవీలో కనిపించింది. మూడేళ్ల తర్వాత `అమ్మ చెప్పింది` అనే చిత్రంతో తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చింది. మళ్లీ కనిపించలేదు. అట్నుంచి సొంత లాంగ్వేజ్ తమిళంలో అవకాశాలు దక్కించుకుంది. వరుసగా కోలీవుడ్లో సినిమాలతో బిజీగా గడిపింది.
2008 తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ బ్యూటీ మళ్లీ పదేళ్ల తర్వాత కోలీవుడ్లోనే రీఎంట్రీ ఇచ్చింది. ఒకటి అర సినిమాలతో కెరీర్ని లాక్కొస్తుంది. ఈ క్రమంలో తెలుగులో రెండు భారీ సినిమాల్లో నటించే అవకాశాలను సొంతం చేసుకుంది. ప్రభాస్ హీరోగా రూపొందుతున్న `సలార్`లో కీలక పాత్ర పోషిస్తుందీ బ్యూటీ.
దీంతోపాటు పవన్ కళ్యాణ్ నటిస్తున్న గ్యాంగ్ స్టర్ మూవీ `ఓజీ`లో కీలక పాత్రలో కనిపించబోతుంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది. సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమాతోపాటు తమిళఃలో `ఆండవ కానమ్` అనే చిత్రంలో శ్రియా రెడ్డి నటిస్తూ బిజీగా ఉంది. గ్లామర్ పాత్రలు కాకుండా నటనకు స్కోప్ ఉన్న బలమైన పాత్రలే చేస్తూ రాణిస్తుందీ బ్యూటీ. అలాంటి చిత్రాలకు ప్రయారిటీ ఇస్తుందీ హాట్ హీరోయిన్.