స్పెషల్ ఈవెంట్లకే పరిమితమవుతున్న యాంకర్ శ్రీముఖి.. క్రేజ్ తగ్గిందా? గ్యాప్ ఇచ్చిందా?
శ్రీముఖి గ్లామర్ ఫోటోలు పంచుకుని చాలా రోజులవుతుంది. ఆ మధ్య వరుసగా టీవీ షోస్ `బొమ్మ అదిరింది`, అలాగే తాను స్వతహాగా నిర్వహించే టాక్ షో `ఓ వుమానియా` కోసం ట్రెండీగా, సరికొత్తగా ముస్తాబయ్యేది. కానీ ఇప్పుడు ఆ షోస్ శ్రీముఖికి లేవు. దీంతో బోసిపోయింది. శ్రీముఖి మెరుపులు లేవు, అందాలు లేవు.
శ్రీముఖి స్పెషల్ షోస్ కే పరిమితమవుతుంది. ప్రస్తుతం ఆమె జీ తెలుగులో సంక్రాంతి సందర్భంగా చేసిన `సంక్రాంతి సంబరాలు` స్పెషల్ ఈవెంట్ కి హోస్ట్ గా చేస్తుంది.
తాను నిర్వహించే `ఓ వుమానియా`కి కూడా ఫుల్స్టాప్ పెట్టేసినట్టే కనిపిస్తుంది. దీంతో ప్రస్తుతం శ్రీముఖి చేతుల్లో ఒక్క షో కూడా లేదనే చెప్పాలి.
అయితే ప్రస్తుతం ఈ బొద్దు అందాల భామ సినిమా చేస్తుంది. మెయిల్ లీడ్గా యాక్ట్ చేస్తుంది.
`క్రేజీ అంకుల్స్` చిత్రంలో హీరోయిన్గా నటిస్తుంది. రాజారవీంద్ర, మనో ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఫ్యామిలీ లైఫ్ని, యాభై ఏళ్లు దాటిన అంకుల్స్ లో కలిగే కోరికలు, ఓ సెలబ్రిటీ జీవితం వంటి వాటిని ఇందులో చూపించబోతున్నారు.
హాట్ బ్యూటీగా రాణించే శ్రీముఖి అంకుల్స్ తో సినిమా చేయడం పట్ల పలు నెగటివ్ కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.
తనకు షోస్ తగ్గిపోవడానికి ఇది కూడా ఓ కారణమా? అనే సందేహాలు కలుగుతున్నాయి.
యాంకర్ అంటే స్లిమ్గా ఉండాలి, అందాలు ఆరబోయాలి, కంటెస్టెంట్లతో కెమిస్ట్రీ పండించాలి, ఇంకా చాలా చేయాల్సి ఉంటుంది.
ఆ విషయంలో శ్రీముఖి వెనకబడుతుందా అనే సందేహాలు కలుగుతున్నాయి.
మరి శ్రీముఖి తన టాలెంట్ని ఉపయోగించి మళ్లీ అవకాశాలు పొందుతుందా? లేదో చూడాలి. అయితే చిత్ర పరిశ్రమలో ఇలాంటివి కామనే.
కొన్నాళ్లపాటు గడ్డు పరిస్థితులు వస్తుంటాయి. వాటిని తట్టుకుని నిలిస్తేనే రాణించడం సాధ్యం.