శ్రీదేవిది హత్యే.. వైరల్ అవుతున్న ఫేక్ పోస్ట్మార్టమ్ రిపోర్ట్
ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద తొలి లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ అందుకున్న అందాల నటి శ్రీదేవి. ఎన్నో అద్బుత చిత్రాలతో అలరించిన ఈ సీనియర్ నటి 2018 ఫిబ్రవరిలో దుబాయ్లో బాత్ టబ్లో పడి మరణించిన సంగతి తెలిసిందే. అయితే అప్పటి నుంచి శ్రీదేవి మృతిపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
భారతీయ సినీ ప్రియుల్లో శ్రీదేవిని ఇష్టపడని వారు ఉండరంటే అతిషయోక్తి కాదు. దాదాపు మూడు తరాల ప్రేక్షకుల్ని అలరించిన ఈ అందాల భామ, 2018లో అర్థాంతరంగా ఈ లోకాన్ని విడిచింది. దుబాయ్లో ఓ ఫ్యామిలీ ఫంక్షన్కు హాజరయ్యేందుకు వెళ్లిన శ్రీదేవి అక్కడే తుది శ్వాస విడిచింది. అయితే ఆమె మృతి మీద ఇప్పటికీ అనేక అనుమానాలు ఉన్నాయి.
శ్రీదేవి దగ్గరి బంధువులు కూడా ఆమె మృతి మీద అనుమానాలు వ్యక్తం చేశారు. బోని కపూర్ ఆర్థికంగా ఇబ్బందులు పాలు కావటంతో శ్రీదేవి మీద ఒత్తిడి పెరిగిందన్న అనుమానాలు వ్యక్తం చేశారు. అదే సమయంలో ఆమె బాత్ టబ్లో పడి మృతి చెందటం కూడా నమ్మశక్యం లేదన్న అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే అప్పట్లో పోస్ట్ మార్టమ్ రిపోర్ట్లో ఆమె ప్రమాదవశాత్తు బాత్టబ్లో పడి మరణించినట్టుగా తేలిందన్న టాక్ వినిపించింది.
బాలీవుడ్ నటుడు బోని కపూర్ బంధువు మోహిత్ మార్వా పెళ్లికి హాజరయ్యేందుకు శ్రీదేవి కుటుంబం దుబాయ్కి వెళ్లింది. అక్కడే ఓ హోటల్లో బస చేసిన ఆమె 2018 ఫిబ్రవరి 24 అనుమానాస్పద స్థితిలో బాత్టబ్లో శవంగా కనిపించింది. అపాస్మారక స్థితిలో నీళ్లలో పడటంతో ఊపిరాడక మరణించిందని డాక్టర్లు ధృవీకరించినట్టుగా కుటుంబ సభ్యులు వెళ్లడించారు.
తాజాగా శ్రీదేవి పోస్ట్ మార్టం రిపోర్ట్ అంటూ ఓ ఫేక్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. శ్రీదేవి మరణం సహజంగా జరగలేదన్నది ఆ రిపోర్ట్ సారాంశం. మృతి చెందిన సమయంలో ఆమె కొకైన్, మధ్యం తీసుకున్నారని, తన శరీరం మీద గాయాలు కూడా ఉన్నాయని ఆ రిపోర్ట్ లో ఉంది. దుబాయ్ ప్రభుత్వం రిలీజ్ చేసిన రిపోర్ట్ అన్న పేరుతో ఆ ఫేక్ పోస్ట్మార్టం రిపోర్ట్ వైరల్ అవుతోంది.
అయితే ఈ రిపోర్ట్ను కంగనా రనౌత్ సోషల్ మీడియాలో షేర్ చేసిందన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై కంగనా స్పందించకపోయినా శ్రీదేవి అభిమానులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో పలు మీడియా సంస్థలు అది ఫేక్ రిపోర్ట్ అని తేల్చాయి.