`అల్లుగాడి కెరీర్ అయిపోయే రోజు వచ్చింది`.. శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. ఇంతకి ఎవరిని ఉద్దేశించినట్టు?
వివాదాస్పద నటి శ్రీరెడ్డి మరోసారి బాంబ్ పేల్చింది. ఈ సారి `అల్లు` వారిని టార్గెట్ చేసింది. `అల్లుగాడి కెరీర్ అయిపోయే రోజు వచ్చింది` అని సంచలన కామెంట్ చేసింది. సోషల్ మీడియా వేదికగా `అల్లు`వారిపై విరుచుకుపడింది.
శ్రీరెడ్డి అంటే వివాదాస్పద కామెంట్లే గుర్తుకొస్తాయి. అంతగా ఆమె తెలుగు చిత్ర పరిశ్రమలో పాపులర్ అయ్యింది. టాలీవుడ్కి చెందిన కొందరిని టార్గెట్ చేసి తన సంచలన కామెంట్లు చేస్తూ వార్తల్లో నిలించింది.
ముఖ్యంగా ఆ మధ్య మెగా ఫ్యామిలీ, వారిలో పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసి అనేక సార్లు కామెంట్లు చేసింది. విమర్శలు చేసింది. వాళ్ల సినిమాలపైన కూడా విమర్శలు చేసుకుంటూ వస్తుంది.
తాజాగా `అల్లు` వారిని టార్గెట్ చేసినట్టు కనిపించింది. ఫేస్బుక్లో ఆమె పెట్టిన సంచలన కామెంటే అందుకు నిదర్శనం. తాజాగా ఈ హాట్ భామ అల్లుగాడి పని అయిపోయిందంటూ పేర్కొంది.
`అల్లు గాది కెరీర్ అయిపోయే రోజు వచ్చిందని నా సిక్త్స్ సెన్స్ చెప్తుంది. నా సిక్త్స్ సెన్స్ ఎప్పుడు తప్పు అవ్వలే సుమీ. నాకేం కోపం లేదు రా వాడంటే కానీ ఎందుకో ఇలా అనిపిస్తుంది రా మరి. తప్పుగా అనుకోకండి జాగ్రత్త` అంటూ `శ్రీరెడ్డి భవిష్యవాణి` అని పేర్కొంది.
శ్రీరెడ్డి ఎవరిని ఉద్దేశించి అన్నదనేది ఇప్పుడు ఆసక్తికరంగా,సస్పెన్స్ గా మారింది. అయితే శ్రీరెడ్డి పోస్ట్ కి కొందరు నెటిజన్లు స్పందిస్తూ అల్లు అర్జున్ ఫోటోస్ పెడుతున్నారు. అయితే వాటిలో ఒకటి రెండింటికి శ్రీరెడ్డి `హా.. హా.. ` అని `హి.. హి.. `అంటూ పోస్ట్ పెట్టడం గమనార్హం.
అంటే అల్లు అర్జున్ని టార్గెట్ చేసిందా? లేక అల్లు శిరీన్ని ఉద్దేశించి అన్నదా? వీరిద్దరు కాకుండా అల్లు అరవింద్ని టార్గెట్ చేసిందా? అన్నది సస్పెన్స్ గా మారింది.
మరోవైపు బన్నీ ఫ్యాన్స్ మాత్రం ఓ రేంజ్లో శ్రీరెడ్డిని ఆడుకుంటున్నారు. రకరకాలు మీమ్స్, కామెంట్లతో ఆమెని ట్రోల్ చేస్తున్నారు. దీంతో ఇప్పుడిది వైరల్గా మారింది.
మొన్నటి వరకు మెగా ఫ్యామిలీపై విరుచుపడ్డ శ్రీరెడ్డి ఇప్పుడు అల్లు వారిని టార్గెట్ చేయడం వెనకాల అసలు ఉద్దేశం ఏంటనేది వెతికే పనిలో పడ్డారు. మెగా ఫ్యామిలీని, అల్లు ఫ్యామిలీని వేరు చేసి చూస్తూ ఇలాంటి కామెంట్ చేసిందా? అన్నది సస్పెన్స్.