చిరంజీవి, ఎన్టీఆర్ని తన ట్రాప్లోకి లాగిన శ్రీరెడ్డి.. చిరుకంటే ఎన్టీఆరే తోపు అట..
వివాదాస్పద నటి శ్రీరెడ్డి తరచూ పవన్ కళ్యాణ్పై కామెంట్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంది. ఈ సారి చిరంజీవి, ఎన్టీఆర్లను టార్గెట్ చేసింది. తన ట్రాప్లోకి వారిద్దరిని లాగింది. `ఆచార్య` సినిమాని అందుకు వేదిక చేసుకుంది. తాజాగా చిరంజీవిపై శ్రీరెడ్డి చేసిన కామెంట్లు వైరల్గా మారుతున్నాయి.
ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, స్టార్ హీరోలపై కామెంట్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంది నటి శ్రీరెడ్డి.
ఇటీవల చిరంజీవి నటించిన `ఆచార్య` చిత్ర టీజర్ విడుదలైంది. ఈ టీజర్ పది మిలియన్స్ కిపైగా వ్యూస్తో దూసుకుపోతుంది. లక్షల లైక్స్ తో దూసుకుపోతుంది.
ఇందులో చిరంజీవి చెప్పిన డైలాగులు పాపులర్ అవుతున్నాయి. అదే సమయంలో డైలాగ్ డెలివరి సరిగా లేదనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై శ్రీరెడ్డి స్పందించింది.
చిరంజీవి నటనపైనే కామెంట్ చేసింది. ఎన్టీఆర్ నటనతో పోల్చితే చిరంజీవి నటన అంతగా లేదని విమర్శించింది. డైలాగ్ డెలివరీ అస్సలు బాగాలేదని తెలిపింది.
`అబ్బే.. ఎంతైనా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటన ముందు చిరంజీవి కూడా సరిపోడు.. `ఆచార్య` టీజర్లో డైలాగ్ డెలివరీ అస్సలు బాగోలేదు` అని ట్వీట్ చేసింది.
అంతటితో ఆగలేదు. `ఆచార్య` సినిమా కథ కూడా తనకు తెలుసని చెప్పింది. తనకు తెలిసిన కథని ట్వీట్ చేసి రివీల్ చేసిందీ అమ్మడు.
`ఆచార్య` కథ నాకు తెలిసిపోయింది. చిరంజీవి ఎక్కడి నుంచో ఓ ఊరికి వస్తాడు. ఆ ఊర్లో వాళ్లకి దేవుడిలా వాళ్ల కష్టాలు తీరుస్తాడు.. అంతే` అని చెప్పింది.
దీంతో అనేక విమర్శలు ఎదుర్కొంటుంది. నటన పరంగా తిరుగులేని ప్రశంసలందుకున్న చిరంజీవినే కామెంట్ చేయడం ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఏకి పారేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆమెని ట్రోల్ చేస్తున్నారు. బూతు పదాలతో విమర్శలు గుప్పిస్తున్నారు.
అంతేకాదు శ్రీరెడ్డి వ్యాఖ్యలు మెగా ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య వివాదాలు పెట్టేలా ఉన్నాయని అంటున్నారు. ఏదేమైనా శ్రీరెడ్డి ఏదో రకంగా వార్తల్లో నిలవాలనే ప్రయత్నం గట్టిగానే చేస్తుంది.
మరి ఈ విమర్శలు ఆమెకి అవకాశాలు తెచ్చిపెడతాయా? అనేది చూడాలి. ఎందుకంటే అవకాశాల కోసమే ఈ అమ్మడు ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుందనే విమర్శలున్నాయి.