గుండుపై ఉన్న శ్రద్ధ బాలుపై లేదా...మెగాస్టార్ టార్గెట్ గా శ్రీరెడ్డి బూతుపురాణం
ఫైర్ బ్రాండ్ శ్రీరెడ్డి టాలీవుడ్ పెద్దలపై ఫైర్ అయ్యారు. లెజెండరీ సింగర్ బాలు అంత్యక్రియలకు హాజరు కాకపోవడంపై ఆమె ఘాటు విమర్శలు చేశారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవిని టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కరోనా కారణంగా ప్రాణాలు విడిచిన ఎస్పీ బాలు అంత్యక్రియలు చెన్నైలో గత శనివారం ముగిశాయి. బాలు అంత్యక్రియలకు కోలీవుడ్ నుండి కానీ టాలీవుడ్ నుండి కానీ ప్రముఖులు ఎవరు హాజరు కాలేదు. విజయ్, దేవిశ్రీ మరియు మను వంటి అతికొద్ది మంది ప్రముఖులు మాత్రమే పాల్గొన్నారు.
దశాబ్దాలు చిత్ర పరిశ్రమకు సేవ చేసిన బాలు అంత్యక్రియలకు టాలీవుడ్ ప్రముఖులు హాజరు కాకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదే విషయంపై శ్రీరెడ్డి టాలీవుడ్ ప్రముఖులపై విమర్శల దాడికి దిగారు. బాలు మరణం తరువాత అన్నయ్యా వెళ్ళిపోయా అంటూ కొందరు దొంగ కన్నీళ్లు కార్చారు అన్నారు. ఆ పాటల వలన స్టార్స్ గా ఎదిగిన వీరు ఆ తరువాత ఆయన్నే ఇబ్బంది పెట్టారు అన్నారు.
బాలు అంత్యక్రియలకు హాజరు కావాలనే ఉద్దేశమే ఉంటే చిరంజీవి రాలేరా అన్నారు. ఆ గుండు ఫోటోలపై ఉన్న శ్రద్ధ బాలుగారిపై లేదా అన్నారు. మేనళ్లను, కొడుకును ప్రమోట్ చేసుకోవడానికి సమయం దొరకగా, చిరుకు బాలును చివరికి చూపు చూడడానికి సమయం దొరకలేదా అన్నారు.
మా అసోసియేషన్ సభ్యులు కూడా బాలు అంత్యక్రియలకు హాజరు కాకపోవడాన్ని శ్రీరెడ్డి గట్టిగా విమర్శించారు. టాలీవుడ్ నుండి ఒక్కడు కూడా రాకపోవడంపై కోలీవుడ్ వాళ్ళు ఉమ్మేస్తున్నారు అన్నారు.
చెన్నైలో నా పరువు పోయిందన్న శ్రీరెడ్డి.... తానూ బాలు అంత్యక్రియలకు వెళ్లానని, కానీ అది టాలీవుడ్ తరుపున కాదు, కోలీవుడ్ తరపున అని ఆక్రోశం వ్యక్తం చేశారు.