`అమ్మోరు` సినిమాని సౌందర్య ఎవరికి డెడ్కేట్ చేసిందో తెలుసా?.. అరుదైన విషయాలు చెప్పిన అద్భుత నటి..
సౌందర్య అద్బుతమైన నటిగా ఆకట్టుకుంది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. కానీ ఆమెకి మాత్రం `అమ్మోరు` మాత్రం చాలాస్పెషల్ అట. ఆ విషయాలను పంచుకుంది.
సౌందర్య మన నుంచి దూరమై 20ఏళ్లు అవుతుంది. కానీ ఆమె మాత్రం ఇప్పటికీ మన మధ్యలోనే ఉందనే ఫీలింగ్ని కలిగిస్తుంది. ఆమె సంబంధించిన సినిమాలు కావచ్చు, ఆమె వీడియోలు కావచ్చు, ఆమెకి సంబంధించిన విషయాలు కావచ్చు, ఏదో రూపంలో కనిపిస్తూ, వినిపిస్తూ, అలరిస్తూనే ఉంది.
సౌందర్య కర్నాటక చెందిన నటి. కానీ ఆమె తెలుగులో ఎక్కువ సినిమా చేయడం వల్ల తెలుగు నటిగానే గుర్తిండిపోతుంది. అయితే ఆమె కన్నడలో హీరోయిన్గా కెరీర్ ని ప్రారంభించింది. కొన్ని సినిమాల అనంతరం తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగుకి కమిట్ అయిన తొలి చిత్రం `అమ్మోరు`. మొదట ఈ మూవీ షూటింగ్లోనే పాల్గొంది. అందుకే ఈ సినిమాని చాలా స్పెషల్ గా భావిస్తుంది
ఈ సినిమా గురించి సౌందర్య ఓపెన్ అయ్యింది. ఆరుదైన విషయాలను పంచుకుంది. `అమ్మోరు` లాంటి మూవీ తన కెరీర్ ప్రారంభంలో దొరికినందుకు చాలా ఆనందంగా, లక్కీగా భావిస్తున్నట్టు చెప్పింది సౌందర్య. అలాంటి గొప్ప పాత్ర దొరికినందుకు అదృష్టంగా భావిస్తున్నాను. నేను కూడా నటించగలనని నిరూపించినందుకు, ఆడియెన్స్ కి చూపించినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పింది సౌందర్య.
`అమ్మోరు` సినిమా విడుదలైన తర్వాతనే తనకు పర్ఫెర్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ రావడం ప్రారంభమైనట్టు తెలిపింది సౌందర్య. నటిగా తనకు కాస్తో, కూస్తో వచ్చిందే ఈ సినిమాతో అని, నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పుకోవాలని, ఎందుకంటే ఈ సినిమాని నేను మా నాన్నకి అంకితం చేస్తాను. అలాంటి గొప్ప సినిమాని నాకు అందించిన నిర్మాతకు రుణపడి ఉంటాను అని వెల్లడించింది సౌందర్య. ఓ ఇంటర్వ్యూలో సౌందర్య ఈ విషయాను పంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్లో ట్రెండ్ అవుతుంది.
సౌందర్య తెలుగులో అనేక సినిమా చేసింది. కానీ ఆమె మొదటి మూవీ `అమ్మోరు` ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. ఫీమేర్ ఓరియెంటెడ్ రోల్లో అద్భుతమైన నటనతో మెప్పించింది. ఇందులో ఆమెకి జోడీగా సురేష్ నటించడం విశేషం. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సౌందర్య, సురేష్లతోపాటు రమ్యకృష్ణ, రామిరెడ్డి కీలకపాత్రలు పోషించారు. 1995లో ఈ మూవీ విడుదలైంది.
సహజ నటిగా, సహజమైన అందంతో మెప్పించే సౌందర్య అద్భుతమైన నటనతో తెలుగు ఆడియెన్స్ కి బాగా దగ్గరయ్యింది. దశాబ్దం పాటు తెలుగు ఆడియెన్స్ ని అలరించింది. సౌందర్య.. 2004లో ఎన్నికల ప్రచారం చేస్తూ వస్తూ విమాన ప్రమాదంలో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆ ఘటన దేశాన్ని కదిలించింది. సౌందర్య లాంటి స్టార్ హీరోయిన్ మరణించడంతో అభిమానులు భోరున విలపించారు. ఆ తర్వాత ఆమె ఆస్తి కోసం చాలా గొడవలు జరిగాయి. ఆమె ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.