సౌందర్యకి ఆ ఒక్క కోరికే మిగిలిందట.. అమితాబ్, రజనీ, చిరు, వెంకీ, శ్రీదేవి, రమ్యకృష్ణలతో రేర్ పిక్స్
నేటితరం (అభినవ) సావిత్రిగా పేరుతెచ్చుకున్న సౌందర్య వర్థంతి సందర్భంగా అమితాబ్, రజనీ, చిరు, వెంకీ, శ్రీదేవి, రమ్యకృష్ణలతో ఉన్న అరుదైన ఫోటోలు హల్చల్ చేస్తున్నాయి. అంతేకాదు ఆమెకి మిగిలిపోయిన ఓ కోరిక కూడా వైరల్గా మారింది.
సినిమా తారలు ఎంతమంది ఉన్న కొంతమంది హీరోయిన్లు సినిమా పరిశ్రమ పై తమ ముద్ర వేస్తారు. అలాంటి హీరోయిన్స్ లో ఒకరు సౌందర్య. అందం అభినయానికి పెట్టింది పేరు సౌందర్య. పేరుకు తగ్గట్టు సౌందర్యం ఆమె సొంతం. పాత్రలో పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రతో మన్నలి జర్నీ చేయించడం ఆమె స్టయిల్. ఆమె ప్రతిభ. సహజ నటిగా, సహజ అందం కలిగిన సౌందర్య సినిమాని, ఈ లోకాన్ని వదిలేసి 17ఏళ్లు అవుతుంది.
తమిళ, కన్నడ, హిందీ, తెలుగు భాషల్లో 100కు పైగా సినిమాల్లో నటించిన సౌందర్య 17వ వర్థంతి నేడు(శనివారం) ఈ సందర్భంగా ఆమెకి సంబంధించిన పలు రేర్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అదే సమయంలో ఆమె గురించి పలు ఆసక్తికర విషయాలు చక్కర్లు కొడుతున్నాయి. సౌందర్య అసలు పేరు సౌమ్య. పుట్టింది కర్ణాటకలో అయినా తెలుగులోనే అత్యధిక సినిమాలు చేసింది. చనిపోయేవరకు సౌందర్య టాప్ హీరోయిన్గా కొనసాగింది.
రోజా, రమ్యకృష్ణ, మీనా లాంటి అగ్రహీరోయిన్లు తమ గ్లామర్తో గట్టిపోటీ ఇచ్చినా.. సౌందర్య మాత్రం సంప్రదాయపు అమ్మాయిగానే నటించింది. ఎక్కువగా చీరలోనే కనిపించే సౌందర్య ఆ చీరకే అందాన్ని తీసుకొచ్చింది.
సౌందర్య తండ్రి సత్యనారాయణ పలు కన్నడ చిత్రాలకు నిర్మాతగా, రచయితగా పనిచేశారు. 1992లో 'గంధర్వ' అనే కన్నడ చిత్రంతో సౌందర్య సినీ రంగ ప్రవేశం చేసింది. తెలుగులో `రైతు భారతం`తో ఎంట్రీ ఇచ్చింది. ఇది విజయం సాధించలేదు, ఆమెకి పేరు రాలేదు. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్ హీరోగా వచ్చిన `రాజేంద్రుడు గజేంద్రుడు`, `మాయలోడు` మంచి గుర్తింపును ఇచ్చాయి.
వెంకటేష్, సౌందర్య జోడికి వెండితెరపై మంచి క్రేజ్ ఉంది. చిత్ర పరిశ్రమలోనూ ఈ జంట కోసం దర్శక, నిర్మాతలు పోటీ పడేవారు. వీరిద్దరు కలిసి నటించిన `ఇంట్లో ఇల్లాలు- వంటింట్లో ప్రియురాలు`, `పవిత్రబంధం`, `పెళ్ళిచేసుకుందాం`, `రాజా`, `జయం మనదేరా` వంటి సినిమాలు బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్లుగా నిలవడమే కారణం. `పవిత్ర బంధం`లో సౌందర్య నటన అబ్బురపరుస్తుందని చెప్పొచ్చు.
బాలీవుడ్లో సౌందర్య నటించిన తొలి చిత్రం `సూర్యవంశ్`. తెలుగులో వచ్చిన `సూర్యవంశం`కిది రీమేక్. హిందీలో మొదటి సినిమాతోనే అమితాబ్ బచ్చన్ సరసన నటించి మెప్పించింది. వీరితోపాటు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, శ్రీకాంత్, జగపతిబాబు, విక్రమ్, రజనీకాంత్ ఇలా దాదాపు స్టార్ హీరోలందరితోనూ నటించిన ఘనత సౌందర్య సొంతం.
సినిమాల్లో ఏనాడు ఎక్స్ పోజింగ్ చేయని సౌందర్య అందాల ఆరబోతపై ఆమనితో ఇలా పంచుకుందట. ఓ సారి అమని, సౌందర్య షూటింగ్లో ఉన్నప్పుడు ఆమె ఎక్స్ పోజింగ్ గురించి అడిగితే, `ఎందుకే ఎక్స్పోజ్ చేయాలి? రేపు పెళ్లై భర్త పక్కనే ఉన్నపుడు మన సినిమాలు చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? మన ఫ్యామిలీకి ఎలా అనిపిస్తుంది? డబ్బుల కోసం ఇలా చేస్తే రేపు ఎలా?` అని తిరిగి తననే ప్రశ్నించేదని ఆమని చెప్పుకొచ్చింది.
సౌందర్య అరుదైన ఫోటోలు.
ఆమె చనిపోయే నటికి ఆమె వయసు 31 సంవత్సరాలే. అంతేకాకుండా ఆ సమయంలో రెండు నెలల గర్భవతి కావడంతో ఇక సినిమాలకు గుడ్బై చెప్పాలని నిర్ణయించుకుందట. కానీ అందలోనే ఘోరం జరిగిపోయింది.
వెంకీతో సౌందర్య.
చిరంజీవితో `చూడాలని వుంది`లో సౌందర్య.