శ్రీదేవి చనిపోయిన వెంటనే పెళ్లి.. నటిని దారుణంగా ట్రోల్ చేసిన నెటిజెన్లు
అతిలోక సుందరి శ్రీదేవి మరణం ఆమె కుటుంబాన్నే కాదు, కోట్లాది మంది అభిమానులను కూడా షాక్కు గురి చేసింది. దుబాయ్లో బంధువుల వివాహానికి వెళ్లిని శ్రీదేవి అక్కడే తుది శ్వాస విడిచింది. అయితే ఆమె మరణించిన కొద్ది రోజులకే సోనమ్ కపూర్ వివాహం జరగటంపై అభిమానులు మండిపడ్డారు.
శ్రీదేవి మరణించిన తరువాత వెంటనే సోనమ్ కపూర్ తన పెళ్లి పనులు ప్రారంభించింది. అయితే ఈ విషయాన్ని కప్పిపుచ్చేందుకు కపూర్ ఫ్యామిలీ చాలా ప్రయత్నించిందన్న వార్తలు కూడా వినిపించాయి.
అయితే మీడియా ద్వారా పెళ్లి వార్తలు బయటకు వచ్చాయి. దీంతో కపూర్ ఫ్యామిలీ మీద విమర్శలు మొదలయ్యాయి.
శ్రీదేవి మరణించి మూడు నెలలు కూడా కాకముందే సోనమ్ పెళ్లి ఎందుకు చేసుకుంది? పెళ్లి అంత తొందర ఎందుకు.? శ్రీదేవి మరణం తరువాత కనీసం ఒక్క ఏడాది అయినా ఆగలేకపోయావా అన్న విమర్శలు వినిపించాయి.
అయితే తన పెళ్లి ఏర్పాట్లకు సంబంధించిన ఫోటోలు, వీడియో బయటకు రావటంపై కపూర్ ఫ్యామిలీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సోనమ్ వివాహం కూడా వివాదాస్పమైంది.
చాలా కాలం పాటు ఆనంద్ అహూజాతో రిలేషన్లో ఉన్న సోనమ్ కపూర్ అతడినే వివాహం చేసుకుంది. అయితే వీరి వివాహ వేడుక కపూర్ ఫ్యామిలీకి కనీస మానవత్వం లేదన్న విమర్శలకు కారణమైంది.
కపూర్ కుటుంబానికి శ్రీదేవి ఎంతో ముఖ్యమైన వ్యక్తి. అయినా ఆమె మరణాన్ని పక్కన పెట్టి సోనమ్ కపూర్ నవ్వుతూ పెళ్లి చేసుకోవటంపై శ్రీదేవి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే ఈ సందర్భంగా శ్రీదేవి కూతుళ్ల మీద కూడా విమర్శలు వినిపించాయి. శ్రీదేవి కుమార్తెలు జాన్వీ, ఖుషీలు పెళ్లికి హాజరై కెమెరాకు పోజు ఇవ్వటంపై విమర్శలు వినిపించాయి.
అప్పట్లో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వినిపించాయి. ఇంట్లో కుక్క చచ్చిపోతేనే ఆ బాధ చాలా కాలం ఉంటుంది. కానీ కపూర్ ఫ్యామిలీని పోషించిన శ్రీదేవి మరణించినా వాళ్లు వెంటనే వేడుకల్లో మునిగిపోయారు అంటూ కామెంట్లు చేశారు.
అయితే అప్పట్లో కొన్ని రూమర్స్ కూడా వినిపింంచాయి. సోనమ్ గర్భవతి అని అందుకే పెళ్లి విషయంలో హడావిడి చేశారన్న టాక్ వినిపించింది. కానీ తరువాత అవన్నీ రూమర్స్ అని తేలిపోయింది.
సోనమ్ పెళ్లి వేడుకకు కపూర్ కుటుంబ సభ్యులంతా ఆనందంగా హజరయ్యారు. అయితే శ్రీదేవి అభిమానులు మాత్రం ఈ ఘటనను జీర్ణించుకోలేకపోయారు.