బెడ్ రూంలో ఆ రూల్ని స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్న హాట్ బ్యూటీ
సిల్వర్ స్క్రీన్ అందాల భామలు పబ్లిసిటీ కోసం రకరకాల స్టంట్స్ చేస్తుంటారు. ముఖ్యంగా బోల్డ్ స్టేట్మెంట్స్తో వార్తల్లో నిలిచేందుకు తాపత్రేయ పడుతుంటారు. ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వటంలో ఎప్పుడూ ముందుండే సోనమ్ కపూర్ తాజాగా మరో ఇంట్రస్టింగ్ కామెంట్ చేసింది.
బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్, ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ అహూజాలు బాలీవుడ్లోనే లవ్లీ కపుల్స్లో ఒకరు. లాక్ డౌన్ సమయంలో చాలా రోజుల పాటు ఢిల్లీలోనే ఉన్న ఈ జంట ప్రస్తుతం లండన్లోని తమ నివాసంలో ఉంటున్నారు.
లాక్ డౌన్ సమయంలో తన ప్రైవేట్ మూమెంట్స్ను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటూ వస్తోంది సోనమ్. వంట చేయటం నుంచి వర్క్ అవుట్ పోస్ట్ ల వరకు తెగ హడావిడి చేసింది.
భార్యా భర్తలు ఇద్దరూ కలిసి ఎంజాయ్ చేసిన సరదా విషయాలను కూడా అభిమానులతో షేర్ చేసుకుంటుంటారు ఈ జంట..
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన భర్త ఆనంద్ అహూజా బెడ్ రూంలో పెట్టిన స్ట్రిక్ట్ రూల్ గురించి చెప్పింది. ముఖ్యంగా బెడ్ రూంలో మొబైల్ ఫోన్ వాడకాన్ని ఆనంద్ నిషేదించాడని తెలిపింది సోనమ్. అంతేకాదు ఈ రూల్ ప్రతీ జంట తప్పకుండా పాటించాలని చెబుతోంది సోనమ్.
ఇక సినిమాల విషయానికి వస్తే సోనమ్ చివరగా దుల్కర్ సల్మాన్తో కలిసి జోయా ఫ్యాక్టర్ సినిమాలో నటించింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాదించలేదు. ప్రస్తుతం బ్లైండ్ అనే సినిమాకు రీమేక్గా తెరకెక్కుతున్న మూవీలో నటిస్తోంది.