నా పాటని వేస్ట్ చేశారు.. రాజమౌళి, కీరవాణిలపై శివ శక్తి దత్తా సంచలన వ్యాఖ్యలు
రైటర్ శివశక్తి దత్తా దర్శకుడు రాజమౌళి, కీరవాణిలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పాటని వేస్ట్ చేశారని, తనకు పాట నచ్చలేదంటూ హాట్ కామెంట్ చేశారు.

`ఆర్ఆర్ఆర్`పై శివ శక్తి దత్తా కామెంట్స్ వైరల్
ఆస్కార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి తండ్రి, రైటర్ శివ శక్తి దత్తా ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శివ శక్తి దత్తా కామెంట్స్ వైరల్గా మారుతున్నాయి.
`ఆర్ఆర్ఆర్` సినిమాలో ఆయన రాసిన పాటకు సంబంధించిన శివ శక్తి దత్తా చేసిన కామెంట్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
`ఆర్ఆర్ఆర్`లోని `నాటు నాటు` పాటకి ఆస్కార్
రాజమౌళి దర్శకత్వంలో `ఆర్ఆర్ఆర్` మూవీ రూపొందింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించారు. డీవీవీ దానయ్య ఈ సినిమాని నిర్మించారు.
ఎంఎం కీరవాణి సంగీతం అందించగా ఇందులోని పాటలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. బ్లాక్ బస్టర్గా నిలిచాయి. ముఖ్యంగా `నాటు నాటు` పాట ఎంతటి సంచలనాలు సృష్టించిందో తెలిసిందే.
ఏకంగా ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకుంది. ఈ పాట రాసిన చంద్రబోస్, మ్యూజిక్ కంపోజ్ చేసిన కీరవాణి ఆస్కార్ని అందుకున్నారు.
`రామమ్ రాఘవం`పై పాటపై రైటర్ శివ శక్తి దత్తా కామెంట్స్
`ఆర్ఆర్ఆర్`లోని `నాటు నాటు` పాటకి ఆస్కార్ అవార్డు వరించిన సమయంలో 10టీవీతో శివ శక్తి దత్తా మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
`ఆర్ఆర్ఆర్`లో శివ శక్తి దత్తా `రామమ్ రాఘవం` అనే పాటని రాశారు. అయితే ఈ పాటని వేస్ట్ చేశారని, సరిగా కంపోజ్ చేయలేదని, అది తనకు నచ్చలేదని తెలిపారు శివ శక్తి దత్తా.
నా పాటని వేస్ట్ చేశారు, ఆ పాట అస్సలు నచ్చలేదుః శివ శక్తి దత్తా
ఆయన మాట్లాడుతూ, `నా పాట ట్యూన్ నచ్చ లేదు, పాట పిక్చరైజేషన్ నచ్చలేదు. ఆ పాటని వాళ్లు(రాజమౌళి, కీరవాణి) సరిగా ఉపయోగించలేదు.
పాట మొత్తం మిస్ యూజ్ అయ్యింది. ఓ రకంగా పాటని వేస్ట్ చేశారు` అని తెలిపారు శివ శక్తి దత్తా. ఆయన కామెంట్స్ ఇప్పుడు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి.
`రామమ్ రాఘవం` పాట `ఆర్ఆర్ఆర్`లో క్లైమాక్స్ లో వస్తుంది.రామ్ చరణ్ నటించిన రామరాజు పాత్ర బ్రిటీష్ జైల్లో ఉన్న నేపథ్యంలో వారి నుంచి తప్పించుకుని ఆయన అల్లూరి సీతారామరాజుగా సిద్ధమయ్యే సమయంలో ఈ పాట వస్తుంది.
ఆ సీన్లో ఆకట్టుకునేలా ఉంటుంది. కానీ ఈ పాట రైటర్ శివ శక్తి దత్తాకి నచ్చకపోవడం గమనార్హం.
`ఆర్ఆర్ఆర్` మూవీ సంచలన విజయం
రాజమౌళి రూపొందించిన `ఆర్ఆర్ఆర్` మూవీ మూడేళ్ల క్రితం విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లని సాధించింది. సుమారు ప్రపంచ వ్యాప్తంగా రూ. 1280కోట్లు వసూలు చేసింది.
ఆస్కార్ అవార్డుతోపాటు ఆరు జాతీయ అవార్డులు, ఫిల్మ్ ఫేర్ అవార్డులు, గోల్డెన్ గ్లోబ్ పురస్కారాలతోపాటు పలు జాతీయ అంతర్జాతీయ అవార్డులు అందుకుంది.