గ్రాండ్గా సిరివెన్నెల కుమారుడు రాజా పెళ్ళి వేడుక.. ఫోటోస్ వైరల్
ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి కనిష్ట పుత్రుడు, నటుడు రాజా(రాజా భవాని శంకర శర్మ) వివాహం వెంకటలక్ష్మి హిమబిందుతో శనివారం గ్రాండ్గా జరిగింది.
శనివారం(31-10-2020) హైదరాబాద్ లోని హోటల్ దస్పాల్లాలో ఉదయం 10.55 నిమిషాలకు రాజా- వెంకటలక్ష్మి మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.
వైభవంగా జరిగిన రాజా- వెంకట లక్ష్మి వివాహ వేడుకకు సినీ ప్రముఖులు భారీగా హాజరయ్యారు. ప్రముఖ దర్శకులు శ్రీ త్రివిక్రమ్, కృష్ణవంశీ, క్రిష్, గుణ్ణం గంగరాజు, వంశీ పైడపల్లి, ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, వెంకట్ అక్కినేని, రచయిత బుర్ర సాయిమాధవ్ తదితరులు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఈ సందర్బంగా నూతన వధూవరుల ఫోటోలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
రాజా ఇటీవల `ఫిదా` చిత్రంలో హీరో వరుణ్ తేజ్కి అన్నయ్యగా నటించిన విషయం తెలిసిందే. దీంతోపాటు `చాణక్య`, `భానుమతి రామకృష్ణ`, `అంతరిక్షం` వంటి చిత్రాల్లో నటుడిగా మెప్పించారు.
నవ్వులు చిందిస్తున్న నూతన వధూవరులు రాజా- వెంకటలక్ష్మి
పెళ్ళి కూతురు వెంకటలక్ష్మి
భార్య, కుమారుడు రాజాతో సిరివెన్నెల సీతారామశాస్త్రి
రాజా పెళ్ళి కార్డ్
రాజా పెళ్ళి కార్డ్
రాజా పెళ్ళి కార్డ్
రాజా పెళ్ళి కార్డ్