జీవితంలో ముఖ్యమైన వ్యక్తిని పోగొట్టుకున్నాను కన్నీరు రావడం లేదు.. సునీత ఆసక్తికర కామెంట్స్!
సింగర్ కమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీత ఆసక్తికర కామెంట్స్ చేశారు. జీవితంలో ముఖ్యమైన వ్యక్తి దూరం అయ్యాక ఏం జరిగినా కన్నీళ్లు రావడం లేదన్నారు.
Singer Sunitha
17 ఏళ్లకే పరిశ్రమలో అడుగుపెట్టారు సునీత. స్టార్ సింగర్ అయ్యారు. అలాగే డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా రాణించారు. సింగర్ సునీతకు ఎస్పీ బాలు అంటే వల్లమాలిన అభిమానం. ఎస్పీ బాలుతో కలిసి ఆమె పలు మ్యూజిక్ షోలు చేశారు. దేశ విదేశాల్లో మ్యూజిక్ కాన్సర్ట్స్ లో పాల్గొన్నారు. సునీత మీద ఎస్పీ బాలు సైతం ప్రత్యేక అభిమానం కలిగి ఉండేవారు.
Singer Sunitha
సంగీత ప్రియుల మనసు దోచిన పాడుతా తీయగా షోలో బాలుతో పాటు ఆమె జడ్జి సీటు పంచుకున్నారు. పలు సీజన్స్ కి సునీత, ఎస్పీ బాలు పనిచేశారు. ఎస్పీ బాలును సునీత మామయ్య అని పిలిచేవారట. ఆయన కూడా ఆప్యాయంగా కోడలా అనేవారట. కుటుంబ సభ్యులకు మించిన సాన్నిహిత్యం ఇద్దరి మధ్య ఉండేది.
Singer Sunitha
అలాంటి బాలు గారి మరణాన్ని సునీత జీర్ణించుకోలేకపోయారు. 2020 సెప్టెంబర్ 25న బాలు చెన్నైలోని ఎంజీఆర్ ఆసుపత్రిలో కన్నుమూశారు. కరోనా బారిన పడిన బాలు ఆపత్రిలో చేరారు. ఈ విషయం తెలియజేస్తూ వీడియో విడుదల చేశారు. మైల్డ్ అటాక్ అని డాక్టర్స్ చెప్పారు. కోలుకొని త్వరలో తిరిగి వస్తాను. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వీడియో బైట్ విడుదల చేశారు. అవే ఆయన చివరి మాటలు అయ్యాయి.
సుదీర్ఘ కాలం మృత్యువుతో పోరాడి ఓడిపోయారు. బాలు మృతిని జీర్ణించుకోవడం సునీత వల్ల కాలేదు. మీ పాట మరోసారి వినాలని ఉంది మామయ్య అంటూ... ఓ సుదీర్ఘ సందేశం పోస్ట్ చేశారు. తాజాగా ఎస్పీ బాలు మరణంపై సునీత స్పందించారు. జీవితంలో ముఖ్యమైన వ్యక్తి బాలు గారిని కోల్పోయాము. ఆయన మరణం నాకు కన్నీళ్లు రావడం లేదు. బాలు మరణం కన్నా బాధించే సంఘటన ఏముంటుంది? అని సునీత కామెంట్ చేశారు.
తనపై వచ్చే వ్యక్తిగత విమర్శల మీద కూడా సునీత స్పందించారు. ఎవరేమి అనుకున్నా నేను పట్టించుకోను. నేను సాధించాల్సిన విజయాలు, చేరుకోవాల్సిన లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు వెళతాను. నేను ఏం చేయాలి? ఏమి చేయగలను? అనే స్పష్టత నాకుందని ఆత్మ స్తైర్యం ప్రదర్శించారు.