- Home
- Entertainment
- Singeetam Srinivasa Rao ప్రపంచ రికార్డ్, ఇండియాలోనే ఫస్ట్ డైరెక్టర్.. హాలీవుడ్ లెజెండ్కి షాక్
Singeetam Srinivasa Rao ప్రపంచ రికార్డ్, ఇండియాలోనే ఫస్ట్ డైరెక్టర్.. హాలీవుడ్ లెజెండ్కి షాక్
టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఇటీవల దర్శకుడిగా తన కొత్త సినిమాని ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ప్రపంచ రికార్డు సృష్టించారు. మరో రికార్డు బ్రేక్ చేశారు.

95 ఏళ్ల వయసులో దర్శకత్వం వహిస్తున్న సింగీతం శ్రీనివాసరావు
టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ప్రపంచ రికార్డు సృష్టించారు. ఆయన ఇటీవల ఓ మూవీకి దర్శకత్వం వహిస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. నాగ్ అశ్విన్ దర్శకత్వ సూపర్ విజన్లో సింగీతం శ్రీనివాసరావు మూవీ చేస్తున్నారు. వైజయంతి మూవీస్ దీన్ని నిర్మిస్తుంది. ఇటీవలే ఈ మూవీని ప్రకటించారు. అంతేకాదు ప్రారంభం కూడా జరిగింది. దీనికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నట్టు వెల్లడించారు.
దర్శకుడిగా మరో ప్రయోగం చేస్తున్న సింగీతం
సింగీతం శ్రీనివాసరావు గతంలో అనేక ప్రయోగాత్మక చిత్రాలు రూపొందించారు. ఇండియన్ మూవీస్లో టైమ్ ట్రావెల్ స్టోరీ తెరకెక్కించిన తొలి దర్శకుడు సింగీతం అని చెప్పొచ్చు. `ఆదిత్య 369` మూవీ టైమ్ ట్రావెల్ కథతోనే తెరకెక్కిన విషయం తెలిసిందే. దీంతోపాటు మరో ప్రయోగాత్మక మూవీ `పుష్పక విమానం`, అలాగే `భైరవ ద్వీపం` వంటి సంచలనాత్మక చిత్రాలను రూపొందించి మెప్పించారు. ఇప్పుడు మరో ప్రయోగానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటి వరకు సింగీతం శ్రీనివాసరావు 60 సినిమాలు చేశారు. చివరగా ఆయన 2013లో `వెల్కమ్ ఒబామా` మూవీని రూపొందించారు. అప్పట్నుంచి సినిమాలకు దూరంగానే ఉన్నారు. ఇప్పుడు తన SSR61 ని ప్రకటించారు.
95ఏళ్ల వయసులో దర్శకత్వం చేస్తున్న సింగీతం శ్రీనివాసరావు
ఆ తర్వాత `ఆదిత్య 999`ని రూపొందిస్తారని ప్రచారం జరిగింది. కానీ అది వర్కౌట్ కాలేదు. ఈ క్రమంలో ఇప్పుడు మరో మూవీని ఆయన దర్శకుడిగా మెగా ఫోన్ పడుతున్నారు. ఎలాంటి సినిమా చేస్తున్నారు, ఇందులో నటీనటులు ఎవరనేది తెలియాల్సి ఉంది. కానీ 95ఏళ్ల వయసులో సింగీతం శ్రీనివాసరావు సినిమాకి దర్శకత్వం వహిస్తుండటమే ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఇదిలా ఉంటే, సింగీతం ఇప్పుడు ప్రపంచ రికార్డు సృష్టించారు. లేట్ ఏజ్లో సినిమాకి దర్శకత్వం వహిస్తున్న తొలి భారతీయ దర్శకుడిగా నిలిచారు. అలాగే హాలీవుడ్ డైరెక్టర్ రికార్డుని బ్రేక్ చేశారు.
క్లింట్ ఈస్ట్ వుడ్ రికార్డ్ బ్రేక్
ఇప్పటి వరకు ప్రపంచంలోనే అతి లేట్ వయసులో సినిమాకి దర్శకత్వం వహించిన డైరెక్టర్గా ఫోర్చ్ గీస్కి చెందిన దర్శకుడు మనోల్ డి ఎలివేరా రికార్డ్ సృష్టించారు. ఆయన 103ఏళ్ల వయసులో సినిమాకి దర్శకత్వం వహించారు. 1908లో జన్మించిన ఆయన 2012లో `గెబో అండ్ ది షాడో` అనే చిత్రాన్ని రూపొందించారు. ఆ తర్వాత మూడేళ్లకి చనిపోయారు. ఆ తర్వాత క్లింట్ ఈస్ట్ వుడ్ పేరుతో ఈ రికార్డు ఉంది. ఆయన 94ఏళ్ల వయసులో సినిమాకి దర్శకత్వం వహించారు.1930లో జన్మించిన ఆయన రెండేళ్ల క్రితం `జురార్ నెం 2` అనే మూవీని రూపొందించారు. ఇప్పుడు క్లింట్ ఈస్ట్ వుడ్ రికార్డుని సింగీతం బ్రేక్ చేశారు.
సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన తెలుగు సినిమాలు
సింగీతం శ్రీనివాసరావు 1931లో జన్మించారు. 1972లో `నీతి నిజాయితీ` చిత్రంతో దర్శకుడిగా మారారు. తమిళంలో రూపొందించిన `దిక్కత్ర పార్వతి` మూవీ జాతీయ అవార్డు అందుకుంది. ఆ తర్వాత `అమెరికా అమ్మాయి`, `తరం మారింది`, `పంతులమ్మ`, `అమావాస్య చంద్రుడు`, `ఆంధ్రా కేసరి`, `వసంత గీతం`, `మయూరి`, `అమెరికా అబ్బాయి`, `పుష్పక విమానం`, `ఆదిత్య 369`, `బృందావనం`, `భైరవ ద్వీపం`, `శ్రీకృష్ణార్జున విజయం`, `విజయం`, `వెల్ కమ్ ఒబామా` వంటి తెలుగు చిత్రాలకు దర్శకత్వం వహించారు. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళంలో కూడా సినిమాలు రూపొందించారు. దర్శకుడిగానే కాదు, నటుడిగా, సంగీత దర్శకుడిగా, రైటర్గా రాణించారు.

