- Home
- Entertainment
- ట్రాన్స్ ఫరెంట్ బ్లాక్ డ్రెస్లో హాట్ పోజులిచ్చిన శృతి హాసన్.. కాన్స్ రెడ్ కార్పెట్లో హోయలు పోతూ రచ్చ
ట్రాన్స్ ఫరెంట్ బ్లాక్ డ్రెస్లో హాట్ పోజులిచ్చిన శృతి హాసన్.. కాన్స్ రెడ్ కార్పెట్లో హోయలు పోతూ రచ్చ
శృతి హాసన్ మరోసారి కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో సందడి చేసింది. ఫ్రాన్స్ లో జరుగుతున్న ఈ వేడుకలో ఇండియన్ తారలు సందడి చేస్తున్నారు. తాజాగా శృతి రెడ్ కార్పెట్పై హోయలు పోయింది.

శృతి హాసన్ మరోసారి కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్-2023లో పాల్గొంది. ఫ్రాన్స్ లో జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక చలనచిత్రోత్సవ వేడుకలో ఇండియన్ భామలు సందడి చేస్తున్నారు. ఇప్పటికే ఐశ్వర్య రాయ్, మృణాల్ ఠాకూర్ వంటి హీరోయిన్లు సందడి చేశారు. ఇప్పుడు శృతి హాసన్ సైతం హల్ చల్ చేసింది.
సోమవారం సాయంత్రం ఆమె రెడ్ కార్పెట్పై హోయలు పోయింది. ఇందులో బ్లాక్ డ్రెస్లో మెరిసింది శృతి. సాధారణంగా ఆమెకి బ్లాక్ అంటే ఇష్టం. ఎక్కువగా బ్లాక్ ని ఇష్టపడుతుంటుంది. తాజాగా కాన్స్ వేడుకలోనూ బ్లాక్ డ్రెస్ ధరించి మంత్రముగ్దుల్ని చేసింది. పలుచని డ్రెస్లో హాట్ అందాలు చూపిస్తూ చెమటలు పట్టిస్తుంది.
ట్రెండీ వేర్లో శృతి సూపర్ హాట్గా ఉంది. ఆమె హాట్నెస్ మరింతగా పెరిగింది. ఆమె చూపులు చురకత్తుల్లా ఉన్నాయి. ఏంజెల్లా పోజులిస్తూ హోయలు పోగా, ఆమె అందాలను బంధించేందుకు ఫోటోగ్రాఫర్లు పోటీ పడ్డారు. శృతి అందాలు బంధించేందుకు కెమెరాలు పోటీ పడటం విశేషంగా చెప్పొచ్చు.
రెడ్ కార్పెట్ ఫోటోలను పంచుకుంటూ ఓ పోస్ట్ పెట్టింది శృతి హాసన్. రెడ్ కార్పెటే అయినా, దాన్ని బ్లాక్ చేయండి అంటూ పేర్కొంది. ఇక ఈ అమ్మడి ఫోటోలపై నెటిజన్లు స్పందిస్తూ శృతి హాసన్ అందంపై కామెంట్లు చేస్తున్నారు. ఆకాశం నుంచి దిగివచ్చిన ఏంజెల్ నువ్వు అని, బ్లాక్ కిల్లర్ అని, కిల్లర్ పోజులు అని, బాబోయ్ ఇది టూ హాట్ అని, సెక్సీ బ్యూటీ అని, కాన్స్ లో అయినా తగ్గేదెలే అని కామెంట్లు చేస్తున్నారు.
గతంలో 2017లో తొలిసారి కాన్స్ రెడ్ కార్పెట్పై మెరిసింది శృతి హాసన్. అప్పుడు కూడా బ్లాక్ డ్రెస్లోనే కనువిందు చేసింది. ఇప్పుడు మరోసారి ఆమెకి కాన్స్ లో పాల్గొనే అవకాశం దక్కింది. క్రమంగా ఇండియన్ హీరోయిన్లకి అవకాశాలు పెరుగుతున్నాయని, ఇండియన్ సినిమాకి దక్కుతున్న గౌరవంగా దీన్ని చెప్పొచ్చు.
శృతి హాసన్ అత్యంత సక్సెస్ ఫుల్ హీరోయిన్గా రాణిస్తుంది. ఆమె తెలుగులో చేసిన సినిమాల్లో చాలా వరకు విజయం సాధించాయి. ఇటీవలే సంక్రాంతికి రెండు సినిమాలతో వచ్చింది. `వాల్తేర్ వీరయ్య`, `వీరసింహారెడ్డి` చిత్రాలతో ఆడియెన్స్ ముందుకొచ్చింది. రెండు విజయాలను అందుకుంది. ఇప్పుడు ప్రభాస్తో `సలార్` చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమా సెప్టెంబర్లో రాబోతుంది.
దీంతోపాటు మరో తెలుగు సినిమాకి సైన్ చేసింది శృతి హాసన్.. నానితో మొదటి సారి కలిసి నటిస్తుంది. `నాని30`లో ఆమె కూడా నటిస్తుంది. అయితే శృతిది ఇందులో కీలక పాత్రనా? లేక మరో హీరోయిన్గానా? అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది.