అల్లు అర్జున్ కంటే సుడిగాలి సుధీర్ క్రేజే ఎక్కువా..? షాకింగ్ సర్వే నిజాలు, ఆడేసుకుంటున్న యాంటీ ఫ్యాన్స్!
అల్లు అర్జున్ ని యాంటీ ఫ్యాన్స్ ఆడేసుకుంటున్నారు. సుడిగాలి సుధీర్ క్రేజ్ కూడా లేదంటూ ట్రోల్ చేస్తున్నారు. దీనికంతటికీ ఒక సర్వే కారణమైంది. సదరు సర్వేలో సుడిగాలి సుధీర్ కంటే అల్లు అర్జున్ వెనుకబడ్డారు.
Allu Arjun
ఒక యూట్యూబర్ అల్లు అర్జున్-సుడిగాలి సుధీర్ మధ్య పోల్ నిర్వహించాడు. సదరు పోల్ లో ''మీకు ఎవరంటే ఇష్టం ఓపెన్ గా చెప్పండి?' అని అడిగాడు. ఈ పోల్ నందు ఏకంగా 40 వేలకు పైగా నెటిజెన్స్ పాల్గొన్నారు. తమ అభిప్రాయం తెలియజేశారు. ఈ పోల్ లో అనూహ్య ఫలితం వచ్చింది.
Allu Arjun
క్రేజ్ లో సుడిగాలి సుధీర్ పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ ని బీట్ చేస్తాడని ఎవరూ ఊహించరు. కానీ ఫలితం అలానే వచ్చింది. అది కూడా భారీ ఆధిక్యం సుడిగాలి సుధీర్ సాధించాడు. సుధీర్ ఇష్టం అంటూ 69 శాతం మంది ఓట్లు వేయగా, అల్లు అర్జున్ కి అనుకూలంగా 31 శాతం మంది ఓటేశారు.
ఒక వంద లేక రెండొందలు మంది పాల్గొన్న పోల్ అయితే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నలభై వేల నెటిజన్స్ ఓట్లు వేశారు. అలాగే కామెంట్స్ రూపంలో కూడా సుధీర్ కి అనుకూలంగా తమ అభిప్రాయం వెల్లడించారు. ఎలాంటి సపోర్ట్ లేకుండా ఎదిగిన సుధీర్ గొప్పంటూ పలువురు కామెంట్ చేశారు.
అల్లు అర్జున్ యాంటీ ఫ్యాన్స్ ఈ పోల్ రిజల్ట్ స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. గ్రౌండ్ రియాలిటీలో అల్లు అర్జున్ క్రేజ్ ఇది అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఈ పరిణామంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహానికి గురి అవుతున్నారు. వారు కూడా ఏమాత్రం తగ్గకుండా కౌంటర్లు ఇస్తున్నారు.
Allu Arjun
అలాగే మరో మెగా హీరో వైష్ణవ్ తేజ్, సుడిగాలి సుధీర్ మధ్య అదే యూట్యూబర్ మరో పోల్ నిర్వహించాడు. ఆ పోల్ నందు వైష్ణవ్ తేజ్-కృతి శెట్టి, సుడిగాలి సుధీర్-రష్మీ జోడిలలో ఏ జోడీ మీకు ఇష్టం? అని పోల్ నిర్వహించాడు. ఈ పోల్ నందు కూడా సుడిగాలి సుధీర్ దే పై చేయి అయ్యింది. 29 వేల మంది పాల్గొన్న ఈ పోల్ లో 84 శాతం సుదీర్ కి అనుకూలంగా ఓట్లు వేశారు.
దీంతో సుడిగాలి సుధీర్ కి భారీ మాస్ ఫాలోయింగ్ ఉందని అర్థం అవుతుంది. ఇక సుధీర్ లేటెస్ట్ మూవీ గాలోడు మంచి వసూళ్లను సాధిస్తునట్లు సమాచారం. రెండున్నర కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిపిన గాలోడు మూవీ నాలుగు కోట్లకు పైగా గ్రాస్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాల అంచనా.